ETV Bharat / sports

మెంటార్ ఆన్​ డ్యూటీ.. పంత్​కు ధోనీ కీపింగ్​ పాఠాలు!

author img

By

Published : Oct 20, 2021, 8:44 PM IST

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) భాగంగా ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్​ ఆడింది భారత జట్టు. ఈ మ్యాచ్​ నేపథ్యంలో యువ వికెట్​ కీపర్,​ బ్యాట్స్​మన్​ రిషబ్​ పంత్​కు(Rishabh Pant news) కొన్ని సూచనలు చెబుతూ కనిపించాడు మెంటార్ ధోనీ(Dhoni Mentor). ఈ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

dhoni, pant
ధోనీ, పంత్

టీ20 ప్రపంచకప్​ సందర్భంగా ఆస్ట్రేలియాతో వార్మప్​ మ్యాచ్ ఆడింది టీమ్​ఇండియా(Ind vs Aus Warm-up Match). ఈ మ్యాచ్​ నేపథ్యంలో చోటుచేసుకున్న ఓ దృశ్యం క్రికెట్ అభిమానులను తెగ ఆకట్టుకుంది. నేడు(అక్టోబర్ 20న) జరిగిన మ్యాచ్​ సమయంలో రిషబ్​ పంత్​ కీపింగ్​ పాఠాలు నేర్చుకున్నాడు. అతడికి పాఠాలు నేర్పింది మరెవరో కాదు.. టీమ్​ఇండియా మాజీ సారథి, మెంటార్​ ఎంఎస్​ ధోనీ(Dhoni Mentor).

ఆసీస్​తో వార్మప్​ మ్యాచ్​లో నాలుగు ఓవర్ల ఆట ముగిసిన తర్వాత సైడ్ స్క్రీన్ సమస్య కారణంగా ఆటకు కొంత విరామం లభించింది. ఆ సమయంలో వికెట్​ కీపర్​​ రిషబ్ పంత్​ బౌండరీ లైన్​ వద్ద కీపింగ్​ పాఠాలు​ నేర్చుకుంటూ కనిపించాడు. వికెట్​ మధ్యలో ఉంచి, ధోనీ బంతి విసురుతుండగా పంత్​ కీపర్​ బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ సమయంలో కెమెరాలన్నీ ఒక్కసారిగా వారి వైపు తిరిగాయి.

అనంతరం ఈ వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

ఈ మ్యాచ్​లో ఆస్ట్రేలియాపై అలవోకగా గెలిచింది టీమ్​ఇండియా. ఆసీస్ విధించిన 153 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో ఛేదించింది. అక్టోబర్ 24న పాకిస్థాన్​తో టీమ్​ఇండియా అసలు పోరులో తలపడనుంది.

ఇదీ చదవండి:

వార్మప్ మ్యాచ్​లో భారత్ దూకుడు.. ఆసీస్​పై విజయం

టీ20 ప్రపంచకప్​ సందర్భంగా ఆస్ట్రేలియాతో వార్మప్​ మ్యాచ్ ఆడింది టీమ్​ఇండియా(Ind vs Aus Warm-up Match). ఈ మ్యాచ్​ నేపథ్యంలో చోటుచేసుకున్న ఓ దృశ్యం క్రికెట్ అభిమానులను తెగ ఆకట్టుకుంది. నేడు(అక్టోబర్ 20న) జరిగిన మ్యాచ్​ సమయంలో రిషబ్​ పంత్​ కీపింగ్​ పాఠాలు నేర్చుకున్నాడు. అతడికి పాఠాలు నేర్పింది మరెవరో కాదు.. టీమ్​ఇండియా మాజీ సారథి, మెంటార్​ ఎంఎస్​ ధోనీ(Dhoni Mentor).

ఆసీస్​తో వార్మప్​ మ్యాచ్​లో నాలుగు ఓవర్ల ఆట ముగిసిన తర్వాత సైడ్ స్క్రీన్ సమస్య కారణంగా ఆటకు కొంత విరామం లభించింది. ఆ సమయంలో వికెట్​ కీపర్​​ రిషబ్ పంత్​ బౌండరీ లైన్​ వద్ద కీపింగ్​ పాఠాలు​ నేర్చుకుంటూ కనిపించాడు. వికెట్​ మధ్యలో ఉంచి, ధోనీ బంతి విసురుతుండగా పంత్​ కీపర్​ బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ సమయంలో కెమెరాలన్నీ ఒక్కసారిగా వారి వైపు తిరిగాయి.

అనంతరం ఈ వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

ఈ మ్యాచ్​లో ఆస్ట్రేలియాపై అలవోకగా గెలిచింది టీమ్​ఇండియా. ఆసీస్ విధించిన 153 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో ఛేదించింది. అక్టోబర్ 24న పాకిస్థాన్​తో టీమ్​ఇండియా అసలు పోరులో తలపడనుంది.

ఇదీ చదవండి:

వార్మప్ మ్యాచ్​లో భారత్ దూకుడు.. ఆసీస్​పై విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.