టీమ్ఇండియా క్రికెటర్ భువనేశ్వర్ కుమార్తో సహా అతడి కుటుంబ సభ్యులు కరోనా బారిన పడ్డారు. అతని తల్లి ఇంద్రేష్ దేవి పరిస్థితి విషమంగా ఉంది. ఆమె ఆక్సిజన్ స్థాయిలు పడిపోయాయి. దీంతో ఆమెను యూపీ మేరఠ్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
గర్భవతి అయినా భువీ భార్య నూపుర్కు కూడా కొవిడ్ పాజిటివ్గా తేలింది. ఆమె ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని ఇందోర్లో క్వారంటైన్లో ఉన్నారు.
గత నెల 20న భువీ తండ్రి కిరణ్ పాల్ సింగ్.. క్యాన్సర్తో పోరాడుతూ మృతి చెందారు. అనంతరం ఆయన కర్మకాండలను బులంద్ షహర్లోని లుహార్లిలో చేశారు. తర్వాతి రోజు భువీతో పాటు కుటుంబ సభ్యులందరూ కొవిడ్ టెస్ట్ చేయించుకోగా.. వారందరికీ నెగెటివ్గా తేలింది. నాలుగో రోజుల తర్వాత భువీ తల్లి ఇంద్రేష్కు తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో మరో సారి పరీక్షలు చేయించగా.. కరోనా నిర్ధరణ అయింది.
ఇదీ చదవండి: స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఇంట్లో విషాదం