ETV Bharat / sports

'ఈ సారి భారత్​ను కచ్చితంగా ఓడిస్తాం'

ప్రపంచకప్​లో భారత్​పై తమ పరాజయాలు ఈ ప్రపంచకప్​తో ఆగిపోతాయని పాకిస్థాన్ చీఫ్ సెలక్టర్​ ఇంజిమామ్ ఉల్ హఖ్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. ప్రతీ జట్టుకు వరల్డ్​కప్​ గెలిచేందుకు అవకాశముందని అభిప్రాయపడ్డాడు.

author img

By

Published : May 26, 2019, 7:00 PM IST

ఇంజిమామ్

ప్రపంచకప్​లో భారత్​ను ఓడిస్తామని పాకిస్థాన్ చీఫ్​ సెలక్టర్, మాజీ ఆటగాడు ఇంజిమామ్​ ఉల్ హఖ్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. మాంచెస్టర్ వేదికగా జూన్ 16న చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే పోరులో తమదే విజయమని ఇంజిమామ్ ధీమాగా ఉన్నాడు.

"ప్రపంచకప్​లో భారత్​పై మా పరాజయాలు ఈ మెగాటోర్నీతో ఆగిపోతాయి. ఈ సారి మా జట్టు తప్పక గెలుస్తుంది. వరల్డ్​కప్​ అంటే ఇండియా ఒక్కరితో ఆడితే సరిపోదు, ప్రతీ మ్యాచ్ మాకు ముఖ్యమే. ప్రతి జట్టుకు ప్రపంచకప్​ గెలిచేందుకు అవకాశముంది. మా జట్టు అన్ని విభాగాల్లో సమతూకంగా ఉంది" -ఇంజిమామ్ ఉల్ హఖ్, పాక్ చీఫ్ సెలక్టర్

జట్టులో మార్పులు గురించి మాట్లాడుతూ.. "అంతర్జాతీయ టోర్నీలు ఆడే జట్టు​ను కూర్చడంలో కొన్ని సమస్యలు సహజమే. ముఖ్యంగా ఫాస్ట్​ బౌలర్లను ఎంపిక చేయడంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నా" అని తెలిపాడు. ప్రపంచకప్​లో పాకిస్థాన్, ఇంగ్లాండ్, భారత్​, న్యూజిలాండ్ జట్లు సెమీస్ వరకు వెళ్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇప్పటివరకు ప్రపంచకప్​లో భారత్​, పాక్​ జట్లు ఆరుసార్లు తలపడగా.. ప్రతీ సారి విజయం భారత్​నే వరించింది. ఈ నెల 30న 12వ ప్రపంచకప్​ సీజన్ ఇంగ్లాండ్, వేల్స్ వేదికగా ఆరంభంకానుంది.

ప్రపంచకప్​లో భారత్​ను ఓడిస్తామని పాకిస్థాన్ చీఫ్​ సెలక్టర్, మాజీ ఆటగాడు ఇంజిమామ్​ ఉల్ హఖ్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. మాంచెస్టర్ వేదికగా జూన్ 16న చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే పోరులో తమదే విజయమని ఇంజిమామ్ ధీమాగా ఉన్నాడు.

"ప్రపంచకప్​లో భారత్​పై మా పరాజయాలు ఈ మెగాటోర్నీతో ఆగిపోతాయి. ఈ సారి మా జట్టు తప్పక గెలుస్తుంది. వరల్డ్​కప్​ అంటే ఇండియా ఒక్కరితో ఆడితే సరిపోదు, ప్రతీ మ్యాచ్ మాకు ముఖ్యమే. ప్రతి జట్టుకు ప్రపంచకప్​ గెలిచేందుకు అవకాశముంది. మా జట్టు అన్ని విభాగాల్లో సమతూకంగా ఉంది" -ఇంజిమామ్ ఉల్ హఖ్, పాక్ చీఫ్ సెలక్టర్

జట్టులో మార్పులు గురించి మాట్లాడుతూ.. "అంతర్జాతీయ టోర్నీలు ఆడే జట్టు​ను కూర్చడంలో కొన్ని సమస్యలు సహజమే. ముఖ్యంగా ఫాస్ట్​ బౌలర్లను ఎంపిక చేయడంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నా" అని తెలిపాడు. ప్రపంచకప్​లో పాకిస్థాన్, ఇంగ్లాండ్, భారత్​, న్యూజిలాండ్ జట్లు సెమీస్ వరకు వెళ్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇప్పటివరకు ప్రపంచకప్​లో భారత్​, పాక్​ జట్లు ఆరుసార్లు తలపడగా.. ప్రతీ సారి విజయం భారత్​నే వరించింది. ఈ నెల 30న 12వ ప్రపంచకప్​ సీజన్ ఇంగ్లాండ్, వేల్స్ వేదికగా ఆరంభంకానుంది.


New Delhi, May 25 (ANI): The newly elected Member of Parliaments (MPs) of the Bharatiya Janata Party and other party leaders arrived in the national capital today. They have arrived for the National Democratic Alliance (NDA) Parliamentary Board meeting in Delhi. While speaking to media, Bharatiya Janata Party (BJP) leader and elected MP from Jaipur rural Rajyavardhan Singh Rathore said, "Under the leadership of Narendra Modi the Bharatiya Janata Party (BJP) has undoubtedly achieved historic victory. If anyone who can change the machinery of this country and strengthen it then it is Modi and his leadership."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.