అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గ్రెగ్ బార్క్లే.. ప్రతిష్ఠాత్మక టెస్టు ఛాంపియన్షిప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా లాక్డౌన్ వల్ల టోర్నీ నిర్వహణలోని లోపాలు బయపడ్డాయని అన్నారు. భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు.
"టెస్టు ఛాంపియన్షిప్ను కుదించాలని నేను అనుకోను. కరోనా వల్ల ఛాంపియన్షిప్లోని లోపాలు బయటపడ్డాయని భావిస్తున్నాను. టెస్టు క్రికెట్ను అభివృద్ధి చేసే క్రమంలో ఛాంపియన్షిప్ లాంటి టోర్నీలు నిర్వహించడం వల్ల దానిపై మరింత ఆసక్తి పెరుగుతుందని భావిస్తున్నారు. కానీ, నా దృష్టిలో అది జరగదు. దీన్ని రూపొందించిన వ్యక్తి ఆధారంగా దీనికి చాలా భవిష్యత్తు ఉంది. కానీ, ప్రాక్టికల్గా దాన్ని నేను అంగీకరించలేను. దాని వల్ల చేయాలనుకున్నది చేశారో లేదా నాకు తెలియదు"
- గ్రెగ్ బార్క్లే, ఐసీసీ అధ్యక్షుడు
దీంతో తొలి టెస్టు ఛాంపియన్షిప్ టోర్నీనే చివరిదని ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ పరోక్షంగా చెప్పారు. ఈ ఛాంపియన్షిప్ చిన్న బోర్డులకు సరిపోదని అభిప్రాయపడ్డాడు. ఈ విషయమై కొన్ని సభ్య దేశాలతో తనకు మద్దతు ఉందని వెల్లడించాడు. అయితే ప్రస్తుతం క్రికెట్ క్యాలెండర్ను పునరుద్ధరించాలని బార్క్లే అంగీకరించాడు.
ఆ మ్యాచ్ చూడాలనుకుంటున్నా
భారత్ - పాకిస్థాన్ ద్వైపాక్షిక క్రికెట్ను తాను మళ్లీ చూడాలనుకుంటున్నట్లు గ్రెగ్ బార్క్లే స్పష్టం చేశారు. ఇది ఆదేశం కాదని.. భౌగోళిక రాజకీయ అంశాలు దానితో ముడిపడి ఉన్నాయని తనకు అర్థం అవుతుందని తెలిపారు. బీసీసీఐ లాంటి బోర్డుల బలమైన సభ్యుల ప్రాముఖ్యాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ను యథావిధిగా నిర్వహిస్తామని ఐసీసీ ఇటీవలే స్పష్టం చేసింది. లార్డ్స్ వేదికగా 2021 జూన్లో జరగబోయే తుదిపోరు కోసం ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల విజయాలతో పాయింట్లను ఇవ్వాలని నిర్ణయించారు.