ETV Bharat / sports

'ఐపీఎల్​ ఎప్పుడు జరిగినా ఆడేందుకు సిద్ధంగా ఉండాలి'

author img

By

Published : Jul 21, 2020, 7:04 PM IST

ఐపీఎల్​ ఆడేందుకు ఆటగాళ్లంతా మానసికంగా సిద్ధంగా ఉండాలని తెలిపాడు సీఎస్కే క్రికెటర్​ సురేశ్​ రైనా. ఇటీవలే తన వ్యక్తిగత శిక్షణా కేంద్రంలో ట్రైనింగ్​ ప్రారంభించిన రైనా.. లీగ్​ నిర్వహణకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

Suresh Raina
సురేశ్

క్రికెట్​ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్​ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవలే ఐసీసీ టీ20 ప్రపంచ కప్​ వాయిదాతో లీగ్​కు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చినట్లైంది. ఈ క్రమంలోనే బీసీసీఐ, ఐపీఎల్​ ఫ్రాంచైజీలు లీగ్​ నిర్వహణకు ప్రణాళికలు రచిస్తున్నాయి.

ఇటీవలే, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాడు సురేశ్​ రైనా ఘజియాబాద్​లోని తన వ్యక్తిగత శిక్షణా కేంద్రంలో ట్రైనింగ్​ ప్రారంభించాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఇన్​స్టా వేదికగా పంచుకున్నాడు. రైనాతో పాటు, బౌలర్లు మహ్మద్ షమీ, పీయూష్​ చావ్లా, బ్యాట్స్​మన్​ రిషబ్ పంత్​లూ లీగ్​కు సన్నద్ధమవుతున్నారు.

ఈ సందర్భంగా ఐపీఎల్​ నిర్వహణపై స్పందించిన రైనా.. టోర్నమెంటు ఎప్పుడు జరుగుతుందో అని ఆటగాళ్లు ఆలోచించాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఫిట్​నెస్​పై దృష్టి సారించి... లీగ్​కు ఎప్పుడు పిలిచినా సిద్ధంగా ఉండేలా తయారవ్వాలని తెలిపాడు.

"ఫ్రాంచైజీలు వారి పనులు చేసుకుంటున్నాయి. మా పని మేము చేస్తున్నాం. వారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఈ క్రికెట్ లీగ్​ ఆడేందుకు మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. ఐపీఎల్​ షెడ్యూల్​ ప్రకటించిన తర్వాత.. ఆటగాడికి కనీసం 3,4 వారాల శిక్షణ అవసరం. ఐపీఎల్​ ఎప్పుడు జరిగినా నాకు సంతోషమే. కాకపోతే ప్రస్తుత కరోనా పరిస్థితి కారణంగా అభిమానులను అనుమతించకపోతే.. మేము వారిని కోల్పోతాం."

-సురేశ్​ రైనా, టీమ్​ఇండియా క్రికెటర్​

లాక్​డౌన్​ కారణంగా దాదాపు 6 నెలలకు పైగా క్రికెటర్లకు విరామం లభించింది. దీంతో వారంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్లీ పుంజుకోవాలంటే కచ్చితంగా శిక్షణ అవసరమని రైనా ఉద్ఘాటించాడు.

క్రికెట్​ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్​ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవలే ఐసీసీ టీ20 ప్రపంచ కప్​ వాయిదాతో లీగ్​కు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చినట్లైంది. ఈ క్రమంలోనే బీసీసీఐ, ఐపీఎల్​ ఫ్రాంచైజీలు లీగ్​ నిర్వహణకు ప్రణాళికలు రచిస్తున్నాయి.

ఇటీవలే, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాడు సురేశ్​ రైనా ఘజియాబాద్​లోని తన వ్యక్తిగత శిక్షణా కేంద్రంలో ట్రైనింగ్​ ప్రారంభించాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఇన్​స్టా వేదికగా పంచుకున్నాడు. రైనాతో పాటు, బౌలర్లు మహ్మద్ షమీ, పీయూష్​ చావ్లా, బ్యాట్స్​మన్​ రిషబ్ పంత్​లూ లీగ్​కు సన్నద్ధమవుతున్నారు.

ఈ సందర్భంగా ఐపీఎల్​ నిర్వహణపై స్పందించిన రైనా.. టోర్నమెంటు ఎప్పుడు జరుగుతుందో అని ఆటగాళ్లు ఆలోచించాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఫిట్​నెస్​పై దృష్టి సారించి... లీగ్​కు ఎప్పుడు పిలిచినా సిద్ధంగా ఉండేలా తయారవ్వాలని తెలిపాడు.

"ఫ్రాంచైజీలు వారి పనులు చేసుకుంటున్నాయి. మా పని మేము చేస్తున్నాం. వారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఈ క్రికెట్ లీగ్​ ఆడేందుకు మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. ఐపీఎల్​ షెడ్యూల్​ ప్రకటించిన తర్వాత.. ఆటగాడికి కనీసం 3,4 వారాల శిక్షణ అవసరం. ఐపీఎల్​ ఎప్పుడు జరిగినా నాకు సంతోషమే. కాకపోతే ప్రస్తుత కరోనా పరిస్థితి కారణంగా అభిమానులను అనుమతించకపోతే.. మేము వారిని కోల్పోతాం."

-సురేశ్​ రైనా, టీమ్​ఇండియా క్రికెటర్​

లాక్​డౌన్​ కారణంగా దాదాపు 6 నెలలకు పైగా క్రికెటర్లకు విరామం లభించింది. దీంతో వారంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్లీ పుంజుకోవాలంటే కచ్చితంగా శిక్షణ అవసరమని రైనా ఉద్ఘాటించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.