మధ్యప్రదేశ్లోని ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు సిద్ధమవుతోంది టీమిండియా. అయితే జట్టు సారథి విరాట్ కోహ్లీ మాత్రం స్థానిక చిన్నారులతో కలిసి సరదాగా గడిపాడు. ఓ ప్రకటన కోసం షూటింగ్లో భాగంగా పిల్లలతో గల్లీ క్రికెట్ ఆడాడు ఈ స్టార్ బ్యాట్స్మన్. బ్యాటింగ్ చేయడమే కాకుండా వాళ్లకు బౌలింగ్ కూడా చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు కోహ్లి విశ్రాంతి తీసుకున్నాడు. ఈ సారథికి బదులుగా తాత్కాలిక కెప్టెన్గా రోహిత్ బాధ్యతలు చేపట్టాడు. అయితే గురువారం నుంచి ప్రారంభంకానున్న టెస్టు సిరీస్కు.. విరాట్ సారథ్యంలో బరిలోకి దిగనుంది టీమిండియా.
రెండో టెస్టు నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈడెన్ గార్డెన్లో జరగనున్న ఈ మ్యాచ్ను తొలిసారి డే/నైట్ రూపంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది బీసీసీఐ.