ఆసీస్తో జరిగే సిరీస్లో అన్ని ఫార్మాట్లలోనూ టీమ్ఇండియా ఓడిపోతుందని జోస్యం చెప్పాడు ఇంగ్లాండ్ మాజీ సారథి మైకేల్ వాన్. భారత జట్టులో ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లు ఉండటాన్ని పాత పద్ధతిగా అభివర్ణించిన అతడు.. ఆ విధానం తనకు నచ్చలేదని అన్నాడు.
"భారత వన్డే జట్టు ఇంకా పాత పద్ధతిని అవలంబిస్తోంది. కేవలం ఐదుగురు బౌలర్లే ఉన్నారు. బ్యాటింగ్ విభాగంలో సత్తా లేదు. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో స్లోఓవర్ రేట్ వేసింది. తమ ఓవర్లను పూర్తిచేయడానికి దాదాపు నాలుగు గంటలకు పైగా సమయం తీసుకుంది. డిఫెన్సివ్, ఫీల్డింగ్ సరిగ్గా చేయలేదు. బౌలింగ్ కూడా పేలవంగా చేసింది. ఇది నాకు ఏమాత్రం నచ్చలేదు. కాగా, ఆస్ట్రేలియా అద్భుతంగా ఆడుతోంది. కాబట్టి టీమ్ఇండియా ఓడిపోతుందని భావిస్తున్నాను.''
-మైకేల్ వాన్, ఇంగ్లాండ్ మాజీ సారథి.
శుక్రవారం సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై 67 పరుగుల తేడాతో టీమ్ఇండియా ఓడిపోయింది. విజయంలో ఫించ్(114), స్మిత్(105) సెంచరీలతో కీలక పాత్ర పోషించారు. దీంతో వన్డే సిరీస్లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
ఇదీ చూడండి: తొలి వన్డే: ఆసీస్ ఘనతలు.. భారత్ చెత్త రికార్డులివే..