ETV Bharat / sports

'వారందరికీ ఈ విజయమే సమాధానం'

author img

By

Published : Jan 19, 2021, 4:25 PM IST

తొలిటెస్టు ఓటమి తర్వాత సిరీస్​ను టీమ్​ఇండియా 0-4తో ముగిస్తుందని విశ్లేషకులు హేళన చేశారు. అయితే రెండు, నాలుగు టెస్టుల్లో విజయం, మూడో మ్యాచ్​ డ్రాతో ట్రోఫీని నిలబెట్టుకొని సగర్వంగా స్వదేశానికి రానుంది భారత జట్టు. ఈ విజయంపై తనదైన శైలిలో స్పందించాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ. విమర్శించిన వాళ్లందరూ లేచి తమ గెలుపును చూడాలని చెప్పాడు.

To everyone who doubted us after Adelaide, stand up and take notice: Kohli
'మమ్మల్ని అనుమానించినవాళ్లు.. లేచి ఈ గెలుపును చూడండి'

టీమ్​ఇండియాను అనుమానించిన వాళ్లందరూ ఒకసారి లేచి జట్టు సామర్థ్యాన్ని చూడాలని అన్నాడు సారథి విరాట్ కోహ్లీ. గబ్బాలో ఆస్ట్రేలియాపై చారిత్రక విజయాన్ని అందించిన క్రికెటర్లకు అభినందనలు తెలియజేశాడు.

  • WHAT A WIN!!! Yessssss. To everyone who doubted us after Adelaide, stand up and take notice. Exemplary performance but the grit and determination was the standout for us the whole way. Well done to all the boys and the management. Enjoy this historic feat lads. Cheers 👏🏼🇮🇳 @BCCI pic.twitter.com/CgWElgOOO1

    — Virat Kohli (@imVkohli) January 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"అద్భుతమైన గెలుపు!!! సాధించాం. అడిలైడ్​ ఓటమి తర్వాత మమ్మల్ని శంకించిన వారందరూ ఒకసారి లేచి చూడండి. అత్యుత్తమ ప్రదర్శన చేశారు. మీరు చూపిన ఆత్మస్థైర్యం, ధృడ సంకల్పం వేరే స్థాయిలో ఉన్నాయి. క్రికెటర్లు, యాజమాన్యానికి అభినందనలు. ఈ చారిత్రక గెలుపును ఆస్వాదించండి. చీర్స్"

-విరాట్ కోహ్లీ, భారత కెప్టెన్

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీ నాలుగు టెస్టుల సిరీస్​లో తొలి మ్యాచ్ అవ్వగానే భారత్​కు తిరిగొచ్చాడు కోహ్లీ. ఆ సమయంలో ప్రసవానికి దగ్గర్లో ఉన్న భార్య అనుష్క శర్మకు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. జనవరి 11న వారికి కూతురు జన్మించింది.

To everyone who doubted us after Adelaide, stand up and take notice: Kohli
జయకేతనం

అడిలైడ్​లో జరిగిన తొలి టెస్టులో 36 పరుగులకు ఆలౌటైన టీమ్ఇండియా.. వైట్​వాష్​తో తిరిగెళ్తుందని తీవ్ర విమర్శలు వచ్చాయి. ​వాటన్నింటినీ తప్పని నిరూపిస్తూ మెల్​బోర్న్​ టెస్టులో జయకేతనం ఎగవేసింది భారత్. ఆ తర్వాత స్ఫూర్తిమంతమైన పోరాటంతో సిడ్నీ టెస్టును డ్రాగా ముగించింది.

ఇదీ చూడండి: గబ్బాలో 'యువ'గర్జన- టీమ్​ఇండియాకు ప్రశంసల వెల్లువ

టీమ్​ఇండియాను అనుమానించిన వాళ్లందరూ ఒకసారి లేచి జట్టు సామర్థ్యాన్ని చూడాలని అన్నాడు సారథి విరాట్ కోహ్లీ. గబ్బాలో ఆస్ట్రేలియాపై చారిత్రక విజయాన్ని అందించిన క్రికెటర్లకు అభినందనలు తెలియజేశాడు.

  • WHAT A WIN!!! Yessssss. To everyone who doubted us after Adelaide, stand up and take notice. Exemplary performance but the grit and determination was the standout for us the whole way. Well done to all the boys and the management. Enjoy this historic feat lads. Cheers 👏🏼🇮🇳 @BCCI pic.twitter.com/CgWElgOOO1

    — Virat Kohli (@imVkohli) January 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"అద్భుతమైన గెలుపు!!! సాధించాం. అడిలైడ్​ ఓటమి తర్వాత మమ్మల్ని శంకించిన వారందరూ ఒకసారి లేచి చూడండి. అత్యుత్తమ ప్రదర్శన చేశారు. మీరు చూపిన ఆత్మస్థైర్యం, ధృడ సంకల్పం వేరే స్థాయిలో ఉన్నాయి. క్రికెటర్లు, యాజమాన్యానికి అభినందనలు. ఈ చారిత్రక గెలుపును ఆస్వాదించండి. చీర్స్"

-విరాట్ కోహ్లీ, భారత కెప్టెన్

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీ నాలుగు టెస్టుల సిరీస్​లో తొలి మ్యాచ్ అవ్వగానే భారత్​కు తిరిగొచ్చాడు కోహ్లీ. ఆ సమయంలో ప్రసవానికి దగ్గర్లో ఉన్న భార్య అనుష్క శర్మకు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. జనవరి 11న వారికి కూతురు జన్మించింది.

To everyone who doubted us after Adelaide, stand up and take notice: Kohli
జయకేతనం

అడిలైడ్​లో జరిగిన తొలి టెస్టులో 36 పరుగులకు ఆలౌటైన టీమ్ఇండియా.. వైట్​వాష్​తో తిరిగెళ్తుందని తీవ్ర విమర్శలు వచ్చాయి. ​వాటన్నింటినీ తప్పని నిరూపిస్తూ మెల్​బోర్న్​ టెస్టులో జయకేతనం ఎగవేసింది భారత్. ఆ తర్వాత స్ఫూర్తిమంతమైన పోరాటంతో సిడ్నీ టెస్టును డ్రాగా ముగించింది.

ఇదీ చూడండి: గబ్బాలో 'యువ'గర్జన- టీమ్​ఇండియాకు ప్రశంసల వెల్లువ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.