ETV Bharat / sports

'టీ20 ప్రపంచకప్​ వాయిదా పడితే ఐపీఎల్​ లాంఛనమే!'

author img

By

Published : May 17, 2020, 3:10 PM IST

టీ20 ప్రపంచకప్​ వాయిదా పడితే ఆ సమయం ఐపీఎల్​ నిర్వహణకు ఎంతగానో సహకరిస్తుందని అన్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్​ మార్క్​ టేలర్​. దానికి సంబంధించిన ప్రణాళికలను భారత్​, ఆస్ట్రేలియా క్రికెట్​ బోర్డులు కలిసి చర్చించుకోవాలని సూచించాడు.

T20 World Cup's likely postponement will open door for IPL
'టీ20 ప్రపంచకప్​ వాయిదా పడితే ఐపీఎల్​ లాంఛనమే!'

ఐసీసీ టీ20 ప్రపంచకప్​ కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడనున్న క్రమంలో.. ఆ సమయం ఐపీఎల్​ నిర్వహణకు అనువైనదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్​ మార్క్​ టేలర్​ అన్నాడు. ఒకవేళ ఐపీఎల్​ నిర్వహిస్తే భారత్​ వరకు ఎలా ప్రయాణిస్తారనేది వ్యక్తిగత వ్యవహారమని.. దానికి వారి దేశ క్రికెట్​ బోర్డ్​ల సహకారం అవసరం లేదని స్పష్టం చేశాడు.

"అక్టోబరులో నిర్వహించే టీ20 ప్రపంచకప్​ కోసం 15 జట్లు ఆస్ట్రేలియాకు రావాలని యోచిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న సంక్షోభంలో ఏడు వేదికలపై 45 మ్యాచ్​లను నిర్వహించడం కష్టతరమైనదని భావిస్తున్నా. టోర్నీకి ముందు 14 రోజుల నిర్బంధమనేది మరీ కఠినమైనది. ఇలాంటి పరిస్థితిలో ప్రపంచకప్​ను వాయిదా వేయాలని ఐసీసీ నిర్ణయిస్తే.. ఆ షెడ్యూల్​ ఐపీఎల్​ నిర్వహణకు ఉపయోగపడుతుంది".

- మార్క్​ టేలర్​, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్​

క్రికెట్​ ఆస్ట్రేలియా(సీఏ).. టీ20 ప్రపంచకప్ జరగాలనుకుంటోంది. అదే సమయంలో ఆసీస్​ ఆటగాళ్లు ఐపీఎల్​ నిర్వహిస్తే భారత్​ వెళ్లాలని కోరుకుంటున్నారు. ఈ ఏడాది చివర్లో ఆసీస్​తో జరిగే ద్వైపాక్షిక సిరీస్​లో పాల్గొనడానికి భారత్..​ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ విషయంలో ఇరు దేశాల క్రికెట్​ బోర్డులు కలిసి చర్చించుకోవాలని టేలర్​ సూచించాడు.

ఇదీ చూడండి.. బయో సెక్యూర్ విధానంలో ఇంగ్లాండ్-పాక్ సిరీస్

ఐసీసీ టీ20 ప్రపంచకప్​ కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడనున్న క్రమంలో.. ఆ సమయం ఐపీఎల్​ నిర్వహణకు అనువైనదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్​ మార్క్​ టేలర్​ అన్నాడు. ఒకవేళ ఐపీఎల్​ నిర్వహిస్తే భారత్​ వరకు ఎలా ప్రయాణిస్తారనేది వ్యక్తిగత వ్యవహారమని.. దానికి వారి దేశ క్రికెట్​ బోర్డ్​ల సహకారం అవసరం లేదని స్పష్టం చేశాడు.

"అక్టోబరులో నిర్వహించే టీ20 ప్రపంచకప్​ కోసం 15 జట్లు ఆస్ట్రేలియాకు రావాలని యోచిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న సంక్షోభంలో ఏడు వేదికలపై 45 మ్యాచ్​లను నిర్వహించడం కష్టతరమైనదని భావిస్తున్నా. టోర్నీకి ముందు 14 రోజుల నిర్బంధమనేది మరీ కఠినమైనది. ఇలాంటి పరిస్థితిలో ప్రపంచకప్​ను వాయిదా వేయాలని ఐసీసీ నిర్ణయిస్తే.. ఆ షెడ్యూల్​ ఐపీఎల్​ నిర్వహణకు ఉపయోగపడుతుంది".

- మార్క్​ టేలర్​, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్​

క్రికెట్​ ఆస్ట్రేలియా(సీఏ).. టీ20 ప్రపంచకప్ జరగాలనుకుంటోంది. అదే సమయంలో ఆసీస్​ ఆటగాళ్లు ఐపీఎల్​ నిర్వహిస్తే భారత్​ వెళ్లాలని కోరుకుంటున్నారు. ఈ ఏడాది చివర్లో ఆసీస్​తో జరిగే ద్వైపాక్షిక సిరీస్​లో పాల్గొనడానికి భారత్..​ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ విషయంలో ఇరు దేశాల క్రికెట్​ బోర్డులు కలిసి చర్చించుకోవాలని టేలర్​ సూచించాడు.

ఇదీ చూడండి.. బయో సెక్యూర్ విధానంలో ఇంగ్లాండ్-పాక్ సిరీస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.