ETV Bharat / sports

'అవకాశమిస్తే టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ ఆడతా'

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో భారత్​కు ప్రాతినిధ్యం వహించాలని ఆశిస్తున్నట్లు వెల్లడించాడు టీమ్​ఇండియా ఫాస్ట్​బౌలర్​ శ్రీశాంత్​. సెలక్టర్లు తనను జట్టులోకి తిరిగి ఎంపిక చేస్తే తన ప్రతిభను నిరూపించుకుంటానని చెప్పాడు. సెప్టెంబరులో అతడిపై ఉన్న నిషేధం ముగియనున్న నేపథ్యంలో.. తిరిగి కేరళ తరపున రంజీల్లో ఆడనున్నాడు.

author img

By

Published : Jun 21, 2020, 6:11 PM IST

Sreesanth nurses the dreams of representing India again
'ఛాన్సిస్తే ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో ఆడతా'

స్పాట్​ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్​కు దూరమైన భారత బౌలర్ శ్రీశాంత్.. త్వరలో మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఈ సెప్టెంబరుతో అతడిపై నిషేధం ముగియనున్న నేపథ్యంలో రంజీల్లో కేరళ తరఫున బరిలోకి దిగనున్నాడు. అయితే ఫిట్​నెస్​ నిరూపించుకున్న తర్వాతే ఇతడిని జట్టులోకి తీసుకోనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీశాంత్​.. టీమ్​ఇండియా తరఫున ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో ఆడాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

"ప్రస్తుతం జాతీయ జట్టులో స్థానానికి నేను పోటీపడలేను. కేవలం నా అనుభవాన్ని, సహకారాన్ని అందిచడానికి మాత్రమే సిద్ధంగా ఉన్నా. ఒకవేళ సెలక్టర్లు నన్ను తిరిగి జట్టులోకి తీసుకుంటే.. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో భారత్​ తరఫున ఆడాలనుంది".

- శ్రీశాంత్​, టీమ్​ఇండియా ఫాస్ట్​బౌలర్​

ఏం జరిగిందంటే?

2013 ఐపీఎల్​లో​ స్పాట్​ ఫిక్సింగ్​ ఆరోపణల నేపథ్యంలో శ్రీశాంత్​తో పాటు, రాజస్థాన్​ రాయల్స్ జట్టు​లోని అజిత్​ చండిలియా, అంకిత్​ చవాన్​లు అరెస్టు అయ్యారు. అనంతరం కేరళ పేసర్​పై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) జీవితకాలం నిషేధం విధించింది. దాన్ని పునఃపరిశీలించాలని శ్రీశాంత్.. సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీంతో ఈ బౌలర్​పై ఉన్న శిక్షను తగ్గించాలని బీసీసీఐకి సూచించింది అత్యున్నత న్యాయస్థానం. కోర్టు ఆదేశాల మేరకు అతడిపై ఉన్న నిషేధాన్ని జీవిత కాలం నుంచి ఏడేళ్లకు బోర్డు కుదించింది. ఆ గడువు ఈ ఏడాది సెప్టెంబరు నాటికి పూర్తి కానుంది.

ఇదీ చూడండి... ఐపీఎల్​లో వార్నర్​తో పాటు ఆసీస్ క్రికెటర్లందరూ

స్పాట్​ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్​కు దూరమైన భారత బౌలర్ శ్రీశాంత్.. త్వరలో మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఈ సెప్టెంబరుతో అతడిపై నిషేధం ముగియనున్న నేపథ్యంలో రంజీల్లో కేరళ తరఫున బరిలోకి దిగనున్నాడు. అయితే ఫిట్​నెస్​ నిరూపించుకున్న తర్వాతే ఇతడిని జట్టులోకి తీసుకోనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీశాంత్​.. టీమ్​ఇండియా తరఫున ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో ఆడాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

"ప్రస్తుతం జాతీయ జట్టులో స్థానానికి నేను పోటీపడలేను. కేవలం నా అనుభవాన్ని, సహకారాన్ని అందిచడానికి మాత్రమే సిద్ధంగా ఉన్నా. ఒకవేళ సెలక్టర్లు నన్ను తిరిగి జట్టులోకి తీసుకుంటే.. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో భారత్​ తరఫున ఆడాలనుంది".

- శ్రీశాంత్​, టీమ్​ఇండియా ఫాస్ట్​బౌలర్​

ఏం జరిగిందంటే?

2013 ఐపీఎల్​లో​ స్పాట్​ ఫిక్సింగ్​ ఆరోపణల నేపథ్యంలో శ్రీశాంత్​తో పాటు, రాజస్థాన్​ రాయల్స్ జట్టు​లోని అజిత్​ చండిలియా, అంకిత్​ చవాన్​లు అరెస్టు అయ్యారు. అనంతరం కేరళ పేసర్​పై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) జీవితకాలం నిషేధం విధించింది. దాన్ని పునఃపరిశీలించాలని శ్రీశాంత్.. సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీంతో ఈ బౌలర్​పై ఉన్న శిక్షను తగ్గించాలని బీసీసీఐకి సూచించింది అత్యున్నత న్యాయస్థానం. కోర్టు ఆదేశాల మేరకు అతడిపై ఉన్న నిషేధాన్ని జీవిత కాలం నుంచి ఏడేళ్లకు బోర్డు కుదించింది. ఆ గడువు ఈ ఏడాది సెప్టెంబరు నాటికి పూర్తి కానుంది.

ఇదీ చూడండి... ఐపీఎల్​లో వార్నర్​తో పాటు ఆసీస్ క్రికెటర్లందరూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.