ETV Bharat / sports

ఒకే హోటల్​లో ఆ బాలీవుడ్‌ గాయని, దక్షిణాఫ్రికా క్రికెటర్లు? - South African Cricketers corona news 2020

కరోనా పాజిటివ్​గా వచ్చిన బాలీవుడ్​ గాయని​ కనికా కపూర్​.. దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఉన్న హోటల్​లోనే బస చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు అధికారులు. ఆమె కలిసిన, బస చేసిన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.

South African Cricketers stayed in Same hotel where Bollywood Singer kanika kapoor Stayed
బాలీవుడ్‌ గాయనికి కరోనా... ఆందోళనలో దక్షిణాఫ్రికా క్రికెటర్లు
author img

By

Published : Mar 22, 2020, 6:04 PM IST

కరోనా వైరస్‌ సోకిన బాలీవుడ్‌ గాయని కనికా కపూర్​ బసచేసిన హోటల్లోనే దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు ఉన్నట్లు తెలుస్తోంది. లండన్‌ నుంచి భారత్‌కు వచ్చిన ఆమె.. మార్చి 14 నుంచి 16 వరకు లఖ్‌నవూలోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో బస చేసింది. అదే సమయంలో భారత్‌తో రెండో వన్డే కోసం సఫారీసేన ఆ హోటల్‌లోనే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం హాట్​ టాపిక్​గా మారింది.

" కనికా కపూర్​ హోటల్‌లోని లాబీలో కొంతమంది అతిథులతో మాట్లాడింది. భారత్​తో వన్డే కోసం దక్షిణాఫ్రికా జట్టు, ఆ సమయంలో అదే హోటల్‌లో ఉంది. అక్కడ జరిగిన ఓ న్యూస్‌ ఛానెల్‌ వార్షిక సమావేశంలోనూ పాల్గొంది. అయితే సీసీటీవీ ఫుటేజిని పరిశీలించి, ఆమెతో సన్నిహితంగా ఉన్న వారి జాబితా తయారుచేయాలి"

-తనిఖీల్లో పాల్గొన్న ఓ అధికారి

భారత్‌తో మార్చి 12న జరగాల్సిన తొలి వన్డే వర్షార్పణమైంది. కరోనా ప్రభావంతో మార్చి 15న, మార్చి 18న జరగాల్సిన చివరి రెండు మ్యాచ్​లు వాయిదా పడ్డాయి.

కరోనా వైరస్‌ సోకిన బాలీవుడ్‌ గాయని కనికా కపూర్​ బసచేసిన హోటల్లోనే దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు ఉన్నట్లు తెలుస్తోంది. లండన్‌ నుంచి భారత్‌కు వచ్చిన ఆమె.. మార్చి 14 నుంచి 16 వరకు లఖ్‌నవూలోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో బస చేసింది. అదే సమయంలో భారత్‌తో రెండో వన్డే కోసం సఫారీసేన ఆ హోటల్‌లోనే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం హాట్​ టాపిక్​గా మారింది.

" కనికా కపూర్​ హోటల్‌లోని లాబీలో కొంతమంది అతిథులతో మాట్లాడింది. భారత్​తో వన్డే కోసం దక్షిణాఫ్రికా జట్టు, ఆ సమయంలో అదే హోటల్‌లో ఉంది. అక్కడ జరిగిన ఓ న్యూస్‌ ఛానెల్‌ వార్షిక సమావేశంలోనూ పాల్గొంది. అయితే సీసీటీవీ ఫుటేజిని పరిశీలించి, ఆమెతో సన్నిహితంగా ఉన్న వారి జాబితా తయారుచేయాలి"

-తనిఖీల్లో పాల్గొన్న ఓ అధికారి

భారత్‌తో మార్చి 12న జరగాల్సిన తొలి వన్డే వర్షార్పణమైంది. కరోనా ప్రభావంతో మార్చి 15న, మార్చి 18న జరగాల్సిన చివరి రెండు మ్యాచ్​లు వాయిదా పడ్డాయి.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.