ETV Bharat / sports

డ్రాగా ముగిసిన భారత్​, ఆస్ట్రేలియా వార్మప్ మ్యాచ్

author img

By

Published : Dec 8, 2020, 4:30 PM IST

ఆస్ట్రేలియా-ఎ, భారత్​-ఎ జట్ల మధ్య జరిగిన వార్మప్​ మ్యాచ్​ డ్రాగా ముగిసింది. రెండో ఇన్నింగ్స్​లో వికెట్​ కీపర్​ వృద్ధిమాన్​ సాహా అర్ధశతకంతో చెలరేగగా.. మిగిలిన భారత బ్యాట్స్​మెన్​ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయారు.

Solid Saha strikes half ton before Test series opener, tour match ends in draw
భారత్​, ఆస్ట్రేలియా మధ్య ప్రాక్టీస్​ మ్యాచ్​ డ్రా

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-ఎ, భారత్​-ఎ జట్ల మధ్య జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్​ డ్రాగా ముగిసింది. మ్యాచ్​ రెండో ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా బ్యాట్స్​మన్​ వృద్ధిమాన్​ సాహా అర్ధశతకంతో అలరించగా.. మిగిలిన ఆటగాళ్లు సరైన ప్రదర్శన చేయడంలో విఫలమయ్యారు. భారత టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్‌ పుజారా రెండో ఇన్నింగ్స్​లో డకౌట్​గా వెనుదిరిగాడు.

ఆదివారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో తొలుత అజింక్యా రహానె(117*) శతకం బాదగా.. భారత్‌ 247/9 పరుగుల స్కోర్‌ చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. అనంతరం క్రిస్‌గ్రీన్‌(125*) శతకంతో చెలరేగడం వల్ల ఆస్ట్రేలియా 306/9 పరుగుల స్కోర్‌ సాధించి తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌పై 59 పరుగుల ఆధిక్యం సంపాదించింది.

ఈ క్రమంలోనే మంగళవారం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్-‌ఎ జట్టు ఏ పరిస్థితుల్లో మెరుగ్గా కనిపించలేదు. శుభ్‌మన్‌ గిల్‌(29), హనుమ విహారి(28), అజింక్యా రహానె(28) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. చివర్లో వృద్ధిమాన్‌ సాహా అర్ధశతకంతో నాటౌట్​గా నిలిచి జట్టుకు విలువైన స్కోరును అందించాడు. దీంతో భారత్​ రెండో ఇన్నింగ్స్​లో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఆ తర్వాత 130 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్​కు దిగిన కంగారూ జట్టు ఆట చివరి రోజు ముగిసే సమయానికి ఒక్క వికెట్​ నష్టపోయి 52 పరుగులు చేశారు. దీంతో మ్యాచ్​ డ్రాగా ముగిసింది.

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-ఎ, భారత్​-ఎ జట్ల మధ్య జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్​ డ్రాగా ముగిసింది. మ్యాచ్​ రెండో ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా బ్యాట్స్​మన్​ వృద్ధిమాన్​ సాహా అర్ధశతకంతో అలరించగా.. మిగిలిన ఆటగాళ్లు సరైన ప్రదర్శన చేయడంలో విఫలమయ్యారు. భారత టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్‌ పుజారా రెండో ఇన్నింగ్స్​లో డకౌట్​గా వెనుదిరిగాడు.

ఆదివారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో తొలుత అజింక్యా రహానె(117*) శతకం బాదగా.. భారత్‌ 247/9 పరుగుల స్కోర్‌ చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. అనంతరం క్రిస్‌గ్రీన్‌(125*) శతకంతో చెలరేగడం వల్ల ఆస్ట్రేలియా 306/9 పరుగుల స్కోర్‌ సాధించి తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌పై 59 పరుగుల ఆధిక్యం సంపాదించింది.

ఈ క్రమంలోనే మంగళవారం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్-‌ఎ జట్టు ఏ పరిస్థితుల్లో మెరుగ్గా కనిపించలేదు. శుభ్‌మన్‌ గిల్‌(29), హనుమ విహారి(28), అజింక్యా రహానె(28) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. చివర్లో వృద్ధిమాన్‌ సాహా అర్ధశతకంతో నాటౌట్​గా నిలిచి జట్టుకు విలువైన స్కోరును అందించాడు. దీంతో భారత్​ రెండో ఇన్నింగ్స్​లో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఆ తర్వాత 130 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్​కు దిగిన కంగారూ జట్టు ఆట చివరి రోజు ముగిసే సమయానికి ఒక్క వికెట్​ నష్టపోయి 52 పరుగులు చేశారు. దీంతో మ్యాచ్​ డ్రాగా ముగిసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.