ETV Bharat / sports

మ్యాచ్​ కోసం అడవిని దాటి.. కొండను ఎక్కి! - టీమ్ఇండియా ఫ్యాన్ సుధీర్ కుమార్

భారత్​లో క్రికెట్ అభిమానులకు సుపరిచితమైన పేరు సుధీర్ కుమార్. టీమ్ఇండియా ఆడే ప్రతి మ్యాచ్​కూ హాజరై స్టాండ్స్​లో అతడు చేసే సందడి అందరికీ తెలిసిందే. తాజాగా కరోనా పరిస్థితుల వల్ల భారత్-ఇంగ్లాండ్ మధ్య పుణె వేదికగా జరుగుతోన్న వన్డే సిరీస్​కు ప్రేక్షకుల్ని అనుమతించలేదు. దీంతో సుధీర్​కు మ్యాచ్ చూసే అవకాశం లేకపోయింది. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గకుంగా మైదానం దగ్గర్లోని ఓ కొండపై నుంచి మ్యాచ్​ను వీక్షిస్తున్నాడీ సూపర్ ఫ్యాన్.

Sachin super fan Sudhir Kumar
సుధీర్ కుమార్
author img

By

Published : Mar 27, 2021, 8:21 AM IST

భారత్​లో క్రికెట్ పరిచయం ఉన్న అందరికీ సుధీర్ కుమార్ తెలిసే ఉంటుంది. త్రివర్ణ పతాక రంగులతో పాటు 'ఐ మిస్ యూ సచిన్' అని ఒంటిపై రాసుకుని, ఓ చేతిలో జాతీయ జెండా మరో చేతిలో శంఖం పట్టుకుని టీమ్ఇండియా ఆడే ప్రతి మ్యాచ్​కు స్టేడియంలోని స్టాండ్స్​లో కనిపిస్తాడు కదా.. అతనే సుధీర్. సచిన్​కు వీరాభిమాని అయిన ఈ టీమ్ఇండియా సూపర్ ఫ్యాన్ జట్టు ఆడే ప్రతి మ్యాచ్​కు హాజరవుతాడు.

Sachin super fan Sudhir Kumar
సుధీర్ కుమార్

కానీ కరోనా కారణంగా ఇంగ్లాండ్​తో వన్డే సిరీస్​ను పుణెలోని ఖాళీ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. దీంతో స్టేడియంలో మ్యాచ్ చూసే అవకాశం సుధీర్​కు లేదు. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా దగ్గర్లో ఉన్న ఘోరాదీశ్వర్ కొండపై నుంచి మ్యాచ్ వీక్షించేందుకు అడవిలో ప్రమాదకర ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పటివరకూ జరిగిన రెండు వన్డేలను అతను ఆ కొండపై నుంచే తిలకించాడు. అక్కడి నుంచి మైదానంలోని ఆటగాళ్లు కనిపించకపోయినప్పటికీ.. స్టేడియంలోని పెద్ద తెరపై ఆటగాళ్లను చూసి కేరింతలు కొడుతున్నాడు.

Sachin super fan Sudhir Kumar
సుధీర్ కుమార్

మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియానికి చేరుకుని జట్టు బస్సు వచ్చిన తర్వాత శంఖంతో స్వాగతం పలుకుతాడు. ఆ తర్వాత అడవి గుండా రెండు కిలోమీటర్లు ప్రయాణం చేసి కొండపైకి ఎక్కుతాడు. చీకటి పడితే ఆ దారిలో ప్రయాణించడం కష్టమని భావించి తొలి ఇన్నింగ్స్​లో 40 ఓవర్లు పూర్తి కాగానే అక్కడి నుంచి వెళ్లిపోతానని అతను చెప్తున్నాడు. ఇటీవల ప్రపంచ రోడ్డు భద్రత సిరీస్​లో తిరిగి సచిన్ ఆట చూసినందుకు ఉప్పొంగిపోయానని తెలిపాడు.

Sachin super fan Sudhir Kumar
సుధీర్ కుమార్
Sachin super fan Sudhir Kumar
సుధీర్ కుమార్

భారత్​లో క్రికెట్ పరిచయం ఉన్న అందరికీ సుధీర్ కుమార్ తెలిసే ఉంటుంది. త్రివర్ణ పతాక రంగులతో పాటు 'ఐ మిస్ యూ సచిన్' అని ఒంటిపై రాసుకుని, ఓ చేతిలో జాతీయ జెండా మరో చేతిలో శంఖం పట్టుకుని టీమ్ఇండియా ఆడే ప్రతి మ్యాచ్​కు స్టేడియంలోని స్టాండ్స్​లో కనిపిస్తాడు కదా.. అతనే సుధీర్. సచిన్​కు వీరాభిమాని అయిన ఈ టీమ్ఇండియా సూపర్ ఫ్యాన్ జట్టు ఆడే ప్రతి మ్యాచ్​కు హాజరవుతాడు.

Sachin super fan Sudhir Kumar
సుధీర్ కుమార్

కానీ కరోనా కారణంగా ఇంగ్లాండ్​తో వన్డే సిరీస్​ను పుణెలోని ఖాళీ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. దీంతో స్టేడియంలో మ్యాచ్ చూసే అవకాశం సుధీర్​కు లేదు. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా దగ్గర్లో ఉన్న ఘోరాదీశ్వర్ కొండపై నుంచి మ్యాచ్ వీక్షించేందుకు అడవిలో ప్రమాదకర ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పటివరకూ జరిగిన రెండు వన్డేలను అతను ఆ కొండపై నుంచే తిలకించాడు. అక్కడి నుంచి మైదానంలోని ఆటగాళ్లు కనిపించకపోయినప్పటికీ.. స్టేడియంలోని పెద్ద తెరపై ఆటగాళ్లను చూసి కేరింతలు కొడుతున్నాడు.

Sachin super fan Sudhir Kumar
సుధీర్ కుమార్

మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియానికి చేరుకుని జట్టు బస్సు వచ్చిన తర్వాత శంఖంతో స్వాగతం పలుకుతాడు. ఆ తర్వాత అడవి గుండా రెండు కిలోమీటర్లు ప్రయాణం చేసి కొండపైకి ఎక్కుతాడు. చీకటి పడితే ఆ దారిలో ప్రయాణించడం కష్టమని భావించి తొలి ఇన్నింగ్స్​లో 40 ఓవర్లు పూర్తి కాగానే అక్కడి నుంచి వెళ్లిపోతానని అతను చెప్తున్నాడు. ఇటీవల ప్రపంచ రోడ్డు భద్రత సిరీస్​లో తిరిగి సచిన్ ఆట చూసినందుకు ఉప్పొంగిపోయానని తెలిపాడు.

Sachin super fan Sudhir Kumar
సుధీర్ కుమార్
Sachin super fan Sudhir Kumar
సుధీర్ కుమార్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.