ETV Bharat / sports

ప్లాస్మా దానం చేసి ప్రాణాలు కాపాడండి: సచిన్

కరోనా వైరస్​తో పోరాడుతున్న వారికి ప్లాస్మా దానం చేయాలని వైరస్​ బారిన పడి కోలుకున్న వారికి పిలుపునిచ్చారు క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్. అలా చేస్తే విషమ పరిస్థితుల్లో ఉన్న వారు మెరుగయ్యే అవకాశం ఉందని తెలిపారు.

author img

By

Published : Jul 9, 2020, 6:24 PM IST

Sachin Request to Plasma donars
సచిన్

కరోనా వైరస్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని రక్షించేందుకు ఆ మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ పిలుపునిచ్చారు. బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌‌ ఆధ్వర్యంలో బుధవారం అంథేరిలోని సెవెన్‌ హిల్స్‌ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీ కేంద్రం ప్రారంభించిన బ్యాటింగ్‌ దిగ్గజం ఈ సందర్భంగా వైద్యాధికారుల సేవలను కొనియాడారు.

"కొవిడ్‌-19 ‌కారణంగా మనమంతా ఇప్పుడు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఈ సందర్భంగా వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు వైరస్‌ సోకిన వారిని కాపాడటానికి నిరంతరాయంగా పనిచేస్తున్నారు. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది శాస్త్రవేత్తలు ఈ మహమ్మారికి మందు కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు. అలాగే విషమ పరిస్థితుల్లో ఉన్న వారికి ప్లాస్మా థెరపీ చికిత్స అందిస్తే వారు కోలుకునే అవకాశం ఉంది. ఈ సేవలను ప్రారంభించిన బీఎంసీ అధికారులకు అభినందనలు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయండి. తద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారు కోలుకుంటారు."

-సచిన్ తెందూల్కర్, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

వైరస్‌ నుంచి కోలుకున్న వారి రక్తంలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు తయారవుతాయి. అలాంటి వారి రక్తంలోని ప్లాస్మాను సేకరించి దాన్ని ఇతర పేషంట్లకు ఎక్కించడం ద్వారా వారిలోనూ రోగనిరోధక శక్తి పెరిగి వేగంగా కోలుకునే అవకాశం ఉంది. అందుకోసమే బీఎంసీ అధికారులు ప్లాస్మా థెరపీ కేంద్రాన్ని ప్రారంభించారు.

కరోనా వైరస్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని రక్షించేందుకు ఆ మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ పిలుపునిచ్చారు. బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌‌ ఆధ్వర్యంలో బుధవారం అంథేరిలోని సెవెన్‌ హిల్స్‌ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీ కేంద్రం ప్రారంభించిన బ్యాటింగ్‌ దిగ్గజం ఈ సందర్భంగా వైద్యాధికారుల సేవలను కొనియాడారు.

"కొవిడ్‌-19 ‌కారణంగా మనమంతా ఇప్పుడు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఈ సందర్భంగా వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు వైరస్‌ సోకిన వారిని కాపాడటానికి నిరంతరాయంగా పనిచేస్తున్నారు. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది శాస్త్రవేత్తలు ఈ మహమ్మారికి మందు కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు. అలాగే విషమ పరిస్థితుల్లో ఉన్న వారికి ప్లాస్మా థెరపీ చికిత్స అందిస్తే వారు కోలుకునే అవకాశం ఉంది. ఈ సేవలను ప్రారంభించిన బీఎంసీ అధికారులకు అభినందనలు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయండి. తద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారు కోలుకుంటారు."

-సచిన్ తెందూల్కర్, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

వైరస్‌ నుంచి కోలుకున్న వారి రక్తంలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు తయారవుతాయి. అలాంటి వారి రక్తంలోని ప్లాస్మాను సేకరించి దాన్ని ఇతర పేషంట్లకు ఎక్కించడం ద్వారా వారిలోనూ రోగనిరోధక శక్తి పెరిగి వేగంగా కోలుకునే అవకాశం ఉంది. అందుకోసమే బీఎంసీ అధికారులు ప్లాస్మా థెరపీ కేంద్రాన్ని ప్రారంభించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.