ETV Bharat / sports

రాజస్థాన్ జట్టులోకి కోహ్లీ.. కానీ ఒక్క షరతు

ఐపీఎల్​ ప్రస్తుత సీజన్​లో బెంగళూరుకు కాకుండా రాజస్థాన్​కు కోహ్లీ ఆడనున్నాడంటూ వస్తున్న వార్తలపై 'ఆర్ఆర్' ఫ్రాంఛైజీ స్పందించింది. కోహ్లీ వస్తే తీసుకుంటామని కానీ ఒక్క షరతు ఉందని చెప్పింది.

author img

By

Published : Aug 10, 2020, 2:02 PM IST

Updated : Aug 10, 2020, 2:47 PM IST

Rajasthan Royals ready to pick Virat Kohli
కోహ్లీ

ఐపీఎల్ ప్రారంభానికి మరో 40 రోజులు ఉంది. అయినాసరే ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో పండగ వాతావరణం నెలకొంది. దాదాపు ఆరు నెలల తర్వాత మళ్లీ ఆడబోతున్నామనే ఉత్సాహంలో క్రికెటర్లు ఉన్నారు. ఈ క్రమంలోనే రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్​సీబీ) కెప్టెన్​ కోహ్లీ ఇప్పుడు హాట్​టాపిక్​గా మారిపోయాడు.

కోహ్లీ రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వెళ్తాడని, అందుకు సంబంధించిన ఓ ఫొటో వైరల్​గా మారింది. ఇదే విషయంపై స్పందించిన ఫ్రాంచైజీ.. కోహ్లీనీ తమ జట్టులో చేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నప్పటికీ ఓ షరతు కూడా ఉందని ట్వీట్​ చేసింది. విరాట్​తో పాటే ఆర్సీబీ ఇన్​సైడర్​ నాగ్స్​ను తీసుకొస్తే.. ఇద్దరినీ జట్టులోకి స్వాగతిస్తామని చమత్కరించింది.

ఈ లీగ్ సమయంలో అభిమానులను ఎంటర్​టైన్ చేసేందుకు నాగ్స్,​ కొన్ని షోలు చేస్తుంటాడు. ఫ్రాంచైజీ వార్తలను ఫన్నీగా చదువుతూ అలరిస్తుంటాడు.

బ్యాట్సమన్​గా సరే.. కెప్టెన్​గా?

ఐపీఎల్​ ప్రారంభమైనప్పటి నుంచి కోహ్లీ బెంగళూరు తరఫునే ఆడుతున్నాడు. 2013లో జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టాడు. కానీ ఇప్పటివరకు ఒక్కసారైనా టైటిల్​ గెలుచుకోలేకపోయాడు. ఐపీఎల్​లో బ్యాట్స్​మన్​గా రికార్డులు నమోదు చేస్తున్నప్పటికీ కెప్టెన్​గా మాత్రం నిరాశపరుస్తూనే ఉన్నాడని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. ఉత్తమ ఆటగాళ్లు ఉన్న ఆర్​సీబీ లాంటి జట్టు ఇప్పటికీ టైటిల్​ సొంతం చేసుకోలేకపోవడం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు.

ఐపీఎల్ ప్రారంభానికి మరో 40 రోజులు ఉంది. అయినాసరే ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో పండగ వాతావరణం నెలకొంది. దాదాపు ఆరు నెలల తర్వాత మళ్లీ ఆడబోతున్నామనే ఉత్సాహంలో క్రికెటర్లు ఉన్నారు. ఈ క్రమంలోనే రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్​సీబీ) కెప్టెన్​ కోహ్లీ ఇప్పుడు హాట్​టాపిక్​గా మారిపోయాడు.

కోహ్లీ రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వెళ్తాడని, అందుకు సంబంధించిన ఓ ఫొటో వైరల్​గా మారింది. ఇదే విషయంపై స్పందించిన ఫ్రాంచైజీ.. కోహ్లీనీ తమ జట్టులో చేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నప్పటికీ ఓ షరతు కూడా ఉందని ట్వీట్​ చేసింది. విరాట్​తో పాటే ఆర్సీబీ ఇన్​సైడర్​ నాగ్స్​ను తీసుకొస్తే.. ఇద్దరినీ జట్టులోకి స్వాగతిస్తామని చమత్కరించింది.

ఈ లీగ్ సమయంలో అభిమానులను ఎంటర్​టైన్ చేసేందుకు నాగ్స్,​ కొన్ని షోలు చేస్తుంటాడు. ఫ్రాంచైజీ వార్తలను ఫన్నీగా చదువుతూ అలరిస్తుంటాడు.

బ్యాట్సమన్​గా సరే.. కెప్టెన్​గా?

ఐపీఎల్​ ప్రారంభమైనప్పటి నుంచి కోహ్లీ బెంగళూరు తరఫునే ఆడుతున్నాడు. 2013లో జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టాడు. కానీ ఇప్పటివరకు ఒక్కసారైనా టైటిల్​ గెలుచుకోలేకపోయాడు. ఐపీఎల్​లో బ్యాట్స్​మన్​గా రికార్డులు నమోదు చేస్తున్నప్పటికీ కెప్టెన్​గా మాత్రం నిరాశపరుస్తూనే ఉన్నాడని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. ఉత్తమ ఆటగాళ్లు ఉన్న ఆర్​సీబీ లాంటి జట్టు ఇప్పటికీ టైటిల్​ సొంతం చేసుకోలేకపోవడం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు.

Last Updated : Aug 10, 2020, 2:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.