ETV Bharat / sports

'నా మధురమైన జ్ఞాపకాల్లో ఈ సెంచరీ ఒకటి'

author img

By

Published : May 2, 2020, 7:15 PM IST

భారత్​ తరఫున టీ20ల్లో తొలి సెంచరీ చేసిన రైనా.. ఆనాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నాడు. టీమిండియాకు ఆడుతూ మొదటి శతకం చేయడం ఎంతో గొప్పగా అనిపించిందని అన్నాడు.

'నా మధురమైన జ్ఞాపకాల్లో ఈ సెంచరీ ఒకటి'
భారత క్రికెటర్ సురేశ్ రైనా

సరిగ్గా పదేళ్ల క్రితం ఓ అంతర్జాతీయ టీ20 మ్యాచ్​లో సెంచరీ చేసి, ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్​గా నిలిచాడు సురేశ్ రైనా. ఈ నేపథ్యంలో ట్విట్టర్​లో అప్పటి ఫొటోలను పంచుకున్నాడు. తన జీవితంలోని మధురమైన జ్ఞాపకాల్లో ఇది ఒకటని, టీమిండియా తరఫున తొలి శతకం చేయడం ఎంతో గొప్పగా అనిపించిందని, ధైర్యాన్ని ఇచ్చిందని రాసుకొచ్చాడు.

  • One of the most memorable moments for me. Scoring a first ever T20i century for my country undoubtedly filled me with a lot of confidence, energy & a never ending zest of giving my 100% to my game every time I’m on the field. pic.twitter.com/1b7MdthbIP

    — Suresh Raina🇮🇳 (@ImRaina) May 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఈ మ్యాచ్​లో, టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగింది భారత్. తొలి ఓవర్​లోనే క్రీజులోకి వచ్చిన రైనా.. మ్యాచ్​ ఆసాంతం ఆకట్టుకుని 60 బంతుల్లో 101 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. టీమిండియా తరఫున తొలి టీ20 సెంచరీ చేసిన బ్యాట్స్​మన్​గా ఘనత సాధించాడు. ఈ పోరులో 14 పరుగుల తేడాతో భారత్​ విజయం సాధించింది.

ప్రస్తుతం టీమిండియా నుంచి టీ20ల్లో రోహిత్ శర్మ నాలుగు శతకాలు చేయగా, కేఎల్ రాహుల్ రెండు సెంచరీలతో ఉన్నారు.

పొట్టి ఫార్మాట్​లో అద్భుతంగా రాణించిన రైనా.. ఐపీఎల్​లోనూ ఆకట్టుకున్నాడు. అత్యధిక పరుగులు చేసిన వారిలో రెండో స్థానంలో ఉన్నాడు. కరోనా వల్ల ప్రస్తుత సీజన్ నిరవధిక వాయిదా పడింది.

సరిగ్గా పదేళ్ల క్రితం ఓ అంతర్జాతీయ టీ20 మ్యాచ్​లో సెంచరీ చేసి, ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్​గా నిలిచాడు సురేశ్ రైనా. ఈ నేపథ్యంలో ట్విట్టర్​లో అప్పటి ఫొటోలను పంచుకున్నాడు. తన జీవితంలోని మధురమైన జ్ఞాపకాల్లో ఇది ఒకటని, టీమిండియా తరఫున తొలి శతకం చేయడం ఎంతో గొప్పగా అనిపించిందని, ధైర్యాన్ని ఇచ్చిందని రాసుకొచ్చాడు.

  • One of the most memorable moments for me. Scoring a first ever T20i century for my country undoubtedly filled me with a lot of confidence, energy & a never ending zest of giving my 100% to my game every time I’m on the field. pic.twitter.com/1b7MdthbIP

    — Suresh Raina🇮🇳 (@ImRaina) May 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఈ మ్యాచ్​లో, టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగింది భారత్. తొలి ఓవర్​లోనే క్రీజులోకి వచ్చిన రైనా.. మ్యాచ్​ ఆసాంతం ఆకట్టుకుని 60 బంతుల్లో 101 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. టీమిండియా తరఫున తొలి టీ20 సెంచరీ చేసిన బ్యాట్స్​మన్​గా ఘనత సాధించాడు. ఈ పోరులో 14 పరుగుల తేడాతో భారత్​ విజయం సాధించింది.

ప్రస్తుతం టీమిండియా నుంచి టీ20ల్లో రోహిత్ శర్మ నాలుగు శతకాలు చేయగా, కేఎల్ రాహుల్ రెండు సెంచరీలతో ఉన్నారు.

పొట్టి ఫార్మాట్​లో అద్భుతంగా రాణించిన రైనా.. ఐపీఎల్​లోనూ ఆకట్టుకున్నాడు. అత్యధిక పరుగులు చేసిన వారిలో రెండో స్థానంలో ఉన్నాడు. కరోనా వల్ల ప్రస్తుత సీజన్ నిరవధిక వాయిదా పడింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.