ETV Bharat / sports

'2023 ప్రపంచకప్​ వరకు ధోనీ జట్టులో ఉండాలి'

2023లో స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్​ వరకు ధోనీ ఆడాలని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు మాజీ క్రికెటర్ వేణుగోపాల్ రావు. మహీ అనుభవం జట్టుకు చాలా పనికొస్తుందని చెప్పాడు.

author img

By

Published : Feb 23, 2020, 6:45 PM IST

Updated : Mar 2, 2020, 7:55 AM IST

ms dhoni
మహేంద్ర సింగ్ ధోనీ

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. 9 నెలల నుంచి అంతర్జాతీయ క్రికెట్​కు దూరంగా ఉన్నాడు. గతేడాది ప్రపంచకప్​లోని సెమీస్​​ తర్వాత మళ్లీ మైదానంలో కనిపించలేదు. ఫలితంగా అతడి రిటైర్మెంట్​పై చాలా ఊహాగానాలు వచ్చాయి. అయినా పెదవి విప్పలేదు మహీ. తాజాగా ఇదే విషయమై మాట్లాడాడు తెలుగు క్రికెటర్ వేణుగోపాల్ రావు. 2023 వన్డే ప్రపంచకప్ వరకు​ ధోనీ జట్టులో ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.

ms dhoni
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ

"ధోనీ.. గత తొమ్మిది నెలల నుంచి క్రికెట్​ ఆడటం లేదని తెలుసు. పునరాగమనంలో సత్తా చాటడం అతడికి ఏమాత్రం కష్టం కాదు. ఐసీసీ లాంటి టోర్నీల్లో ధోనీ అనుభవం ఎంతో పనికొస్తుంది. మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఏకైక కెప్టెన్​ అతడే అనే విషయం మర్చిపోవద్దు. వికెట్​కీపర్​గా, బ్యాట్స్​మన్​గా మహీకి సాటిరాగల మరో ప్లేయర్ లేరు" -వేణుగోపాల్ రావు, భారత మాజీ క్రికెటర్

ప్రపంచకప్​ అనంతరం సైన్యంలో పనిచేసిన ధోనీ.. ఆ తర్వాత వివిధ ప్రైవేట్​ కార్యక్రమాలకు హాజరవుతున్నాడు. వచ్చే నెలలో జరిగే ఐపీఎల్ కొత్త సీజన్​ కోసం సిద్ధమవుతున్నాడు. ఇందులో సత్తా చాటితే టీ20 ప్రపంచకప్​ కోసం అతడి పేరును పరిగణలోకి తీసుకుంటామని టీమిండియా కోచ్ రవిశాస్త్రి గతంలోనే చెప్పాడు. ఈ విషయంపైనా స్పందించిన వేణుగోపాల్.. మహీకి కచ్చితంగా జట్టులో అవకాశం వస్తుందని అభిప్రాయపడ్డాడు.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. 9 నెలల నుంచి అంతర్జాతీయ క్రికెట్​కు దూరంగా ఉన్నాడు. గతేడాది ప్రపంచకప్​లోని సెమీస్​​ తర్వాత మళ్లీ మైదానంలో కనిపించలేదు. ఫలితంగా అతడి రిటైర్మెంట్​పై చాలా ఊహాగానాలు వచ్చాయి. అయినా పెదవి విప్పలేదు మహీ. తాజాగా ఇదే విషయమై మాట్లాడాడు తెలుగు క్రికెటర్ వేణుగోపాల్ రావు. 2023 వన్డే ప్రపంచకప్ వరకు​ ధోనీ జట్టులో ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.

ms dhoni
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ

"ధోనీ.. గత తొమ్మిది నెలల నుంచి క్రికెట్​ ఆడటం లేదని తెలుసు. పునరాగమనంలో సత్తా చాటడం అతడికి ఏమాత్రం కష్టం కాదు. ఐసీసీ లాంటి టోర్నీల్లో ధోనీ అనుభవం ఎంతో పనికొస్తుంది. మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఏకైక కెప్టెన్​ అతడే అనే విషయం మర్చిపోవద్దు. వికెట్​కీపర్​గా, బ్యాట్స్​మన్​గా మహీకి సాటిరాగల మరో ప్లేయర్ లేరు" -వేణుగోపాల్ రావు, భారత మాజీ క్రికెటర్

ప్రపంచకప్​ అనంతరం సైన్యంలో పనిచేసిన ధోనీ.. ఆ తర్వాత వివిధ ప్రైవేట్​ కార్యక్రమాలకు హాజరవుతున్నాడు. వచ్చే నెలలో జరిగే ఐపీఎల్ కొత్త సీజన్​ కోసం సిద్ధమవుతున్నాడు. ఇందులో సత్తా చాటితే టీ20 ప్రపంచకప్​ కోసం అతడి పేరును పరిగణలోకి తీసుకుంటామని టీమిండియా కోచ్ రవిశాస్త్రి గతంలోనే చెప్పాడు. ఈ విషయంపైనా స్పందించిన వేణుగోపాల్.. మహీకి కచ్చితంగా జట్టులో అవకాశం వస్తుందని అభిప్రాయపడ్డాడు.

Last Updated : Mar 2, 2020, 7:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.