ETV Bharat / sports

ప్రతిష్ఠాత్మక కోట్లా మైదానంలో విరాట్​ కోహ్లీ స్టాండ్​

author img

By

Published : Aug 18, 2019, 8:39 PM IST

Updated : Sep 27, 2019, 10:45 AM IST

భారత జట్టు సారథి విరాట్​ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కనుంది. దిల్లీలోని ప్రతిష్ఠాత్మక ఫిరోజ్​ షా కోట్లా మైదానంలోని ఓ స్టాండ్​కు అతడి ​పేరు పెట్టనుంది దిల్లీ క్రికెట్​ సంఘం.

'కోట్లా మైదానంలో విరాట్​ కోహ్లీ స్టాండ్​'

ప్రపంచ క్రికెట్​లో ప్రస్తుతం ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లలో భారత జట్టు సారథి విరాట్​ కోహ్లీ ముందుంటాడు. అతడు ఆటతో దేశానికి తెస్తున్న పేరును గుర్తించి.. సత్కారం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది దిల్లీ జిల్లా​ క్రికెట్​ అసోసియేషన్​(డీడీసీఏ). కోట్లా మైదానంలోని ఓ స్టాండ్​కు విరాట్​ పేరు పెట్టనుంది.

Kotla to have Virat Kohli stand soon: DDCA
దిల్లీలోని ఫిరోజ్​ షా కోట్లా మైదానం

"ప్రపంచ క్రికెట్​లో కోహ్లీ చూపిస్తోన్న అసమాన ప్రతిభ అమోఘం. డీడీసీఏ ఈ విషయంపై చాలా ఆనందంగా ఉంది. విరాట్​ ఎన్నో మైలురాళ్లు ఛేదించాడు. అతడి సారథ్య బాధ్యతలు సూపర్​. విరాట్​ ప్రతిభ​ను మెచ్చుకుంటూ మైదానంలోని ఓ స్టాండ్​కు కోహ్లీ పేరు పెడుతున్నాం. ఇది యువ క్రికెటర్లకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఆశిస్తున్నాం."
-- రజత్​ శర్మ, డీడీసీఏ ప్రెసిడెంట్​

సెప్టెంబర్​ 12న జవహర్​లాల్​ నెహ్రూ స్టేడియం వేదికగా.. భారత జట్టును సత్కరించనుంది దిల్లీ క్రికెట్​ అసోసియేషన్​.

గతంలో భారత మాజీ క్రికెటర్లు, దిల్లీ క్రీడాకారులైన బిషన్​ సింగ్​, మొహిందర్​ అమర్​నాథ్​కు​ ఇదే విధంగా గౌరవం దక్కింది. వీరేందర్​ సెహ్వాగ్​, అంజుమ్​ చోప్రాల పేర్లను మైదానంలోని స్వాగత ద్వారాలకు పెట్టిందీ సంఘం.

ప్రపంచ క్రికెట్​లో ప్రస్తుతం ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లలో భారత జట్టు సారథి విరాట్​ కోహ్లీ ముందుంటాడు. అతడు ఆటతో దేశానికి తెస్తున్న పేరును గుర్తించి.. సత్కారం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది దిల్లీ జిల్లా​ క్రికెట్​ అసోసియేషన్​(డీడీసీఏ). కోట్లా మైదానంలోని ఓ స్టాండ్​కు విరాట్​ పేరు పెట్టనుంది.

Kotla to have Virat Kohli stand soon: DDCA
దిల్లీలోని ఫిరోజ్​ షా కోట్లా మైదానం

"ప్రపంచ క్రికెట్​లో కోహ్లీ చూపిస్తోన్న అసమాన ప్రతిభ అమోఘం. డీడీసీఏ ఈ విషయంపై చాలా ఆనందంగా ఉంది. విరాట్​ ఎన్నో మైలురాళ్లు ఛేదించాడు. అతడి సారథ్య బాధ్యతలు సూపర్​. విరాట్​ ప్రతిభ​ను మెచ్చుకుంటూ మైదానంలోని ఓ స్టాండ్​కు కోహ్లీ పేరు పెడుతున్నాం. ఇది యువ క్రికెటర్లకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఆశిస్తున్నాం."
-- రజత్​ శర్మ, డీడీసీఏ ప్రెసిడెంట్​

సెప్టెంబర్​ 12న జవహర్​లాల్​ నెహ్రూ స్టేడియం వేదికగా.. భారత జట్టును సత్కరించనుంది దిల్లీ క్రికెట్​ అసోసియేషన్​.

గతంలో భారత మాజీ క్రికెటర్లు, దిల్లీ క్రీడాకారులైన బిషన్​ సింగ్​, మొహిందర్​ అమర్​నాథ్​కు​ ఇదే విధంగా గౌరవం దక్కింది. వీరేందర్​ సెహ్వాగ్​, అంజుమ్​ చోప్రాల పేర్లను మైదానంలోని స్వాగత ద్వారాలకు పెట్టిందీ సంఘం.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 27, 2019, 10:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.