ETV Bharat / sports

కేకేఆర్​ సందడి షురూ.. ముంబయికి చేరిన​ ప్లేయర్లు

ఇండియన్ ప్రీమియర్ లీగ్​ కోసం కోల్​కతా నైట్ రైడర్స్​ ఆటగాళ్లు ముంబయికి చేరుకున్నారు. ఈ విషయాన్ని కేకేఆర్ ధ్రువీకరించింది. ప్రాక్టీస్​ సెషన్లలో పాల్గొనడానికి ముందు వారం రోజుల పాటు తప్పనిసరి కఠిన క్వారంటైన్​లో క్రికెటర్లు ఉండనున్నారు.

author img

By

Published : Mar 22, 2021, 7:25 PM IST

IPL 2021: KKR players assemble in Mumbai for quarantine
ఐపీఎల్​ సందడి షురూ.! ముంబయికి చేరిన కేకేఆర్​ ప్లేయర్లు

ఐపీఎల్​ 14వ సీజన్ కోసం కోల్​కతా నైట్ రైడర్స్​ ఆటగాళ్లు ముంబయికి చేరుకున్నారు. లీగ్​కు ముందు క్రికెటర్లంతా వారం రోజుల పాటు తప్పనిసరి కఠిన క్వారంటైన్​లో ఉండాల్సి ఉంది. అయితే ఇంగ్లాండ్​తో సిరీస్​లో పాల్గొన్న ప్లేయర్లను మాత్రం నేరుగా బబుల్​లోకి ప్రవేశించే అవకాశం కల్పించింది బీసీసీఐ.

మాజీ కెప్టెన్ దినేశ్​ కార్తీక్​, వరుణ్​ చక్రవర్తి, రాహుల్​ త్రిపాఠి, కమలేష్​ నాగర్​కోటి, సందీప్ వారియర్, వైభవ్​ అరోరాతో పాటు సహాయ కోచ్​ అభిషేక్​ నాయర్​, సహాయ బౌలింగ్ కోచ్ ఓంకార్ సాల్విలు ముంబయికి చేరుకున్నారు.

"ఇది క్వారంటైన్ సమయం. ఐపీఎల్​ కోసం కేకేఆర్​ ముంబయికి చేరుకుంది. మరి కొద్ది రోజుల్లో క్యాంప్​​ ప్రారంభం కానుంది." అని కేకేఆర్​ తన అధికారిక ట్విట్టర్​లో పేర్కొంది.

విండీస్​ ఆటగాళ్లు సునీల్​ నరైన్, ఆండ్రూ రసెల్​లు త్వరలోనే జట్టుతో కలుస్తారని కేకేఆర్​ ట్వీట్​ చేసింది. "ఇండియాకు వచ్చే విమానంలో ఎవరున్నారో చూడండి! త్వరలోనే పెద్ద క్రికెటర్​ను చూస్తారు. కరీబియన్ ధీరులు మరి కొద్ది గంటల్లో చేరుకోనున్నారు," అని ట్విట్టర్​లో పేర్కొంది.

యూఏఈలో గత ఐపీఎల్​ సందర్భంగా అనుసరించిన నిబంధనలే ప్రస్తుతం కూడా అమలవుతాయి. ప్రతి ఆటగాడిని హోటల్​ రూమ్​ల్లోకి అనుమతించే ముందు పలుమార్లు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తారు. నెగెటివ్ నివేదిక వస్తేనే వారిని ప్రాక్టీస్​ సెషన్లకు అనుమతిస్తారు.

ఇదీ చదవండి: 'సూర్య ఇలాగే ఆడితే నేను ఏ స్థానానికైనా రెడీ'

ఐపీఎల్​ 14వ సీజన్ కోసం కోల్​కతా నైట్ రైడర్స్​ ఆటగాళ్లు ముంబయికి చేరుకున్నారు. లీగ్​కు ముందు క్రికెటర్లంతా వారం రోజుల పాటు తప్పనిసరి కఠిన క్వారంటైన్​లో ఉండాల్సి ఉంది. అయితే ఇంగ్లాండ్​తో సిరీస్​లో పాల్గొన్న ప్లేయర్లను మాత్రం నేరుగా బబుల్​లోకి ప్రవేశించే అవకాశం కల్పించింది బీసీసీఐ.

మాజీ కెప్టెన్ దినేశ్​ కార్తీక్​, వరుణ్​ చక్రవర్తి, రాహుల్​ త్రిపాఠి, కమలేష్​ నాగర్​కోటి, సందీప్ వారియర్, వైభవ్​ అరోరాతో పాటు సహాయ కోచ్​ అభిషేక్​ నాయర్​, సహాయ బౌలింగ్ కోచ్ ఓంకార్ సాల్విలు ముంబయికి చేరుకున్నారు.

"ఇది క్వారంటైన్ సమయం. ఐపీఎల్​ కోసం కేకేఆర్​ ముంబయికి చేరుకుంది. మరి కొద్ది రోజుల్లో క్యాంప్​​ ప్రారంభం కానుంది." అని కేకేఆర్​ తన అధికారిక ట్విట్టర్​లో పేర్కొంది.

విండీస్​ ఆటగాళ్లు సునీల్​ నరైన్, ఆండ్రూ రసెల్​లు త్వరలోనే జట్టుతో కలుస్తారని కేకేఆర్​ ట్వీట్​ చేసింది. "ఇండియాకు వచ్చే విమానంలో ఎవరున్నారో చూడండి! త్వరలోనే పెద్ద క్రికెటర్​ను చూస్తారు. కరీబియన్ ధీరులు మరి కొద్ది గంటల్లో చేరుకోనున్నారు," అని ట్విట్టర్​లో పేర్కొంది.

యూఏఈలో గత ఐపీఎల్​ సందర్భంగా అనుసరించిన నిబంధనలే ప్రస్తుతం కూడా అమలవుతాయి. ప్రతి ఆటగాడిని హోటల్​ రూమ్​ల్లోకి అనుమతించే ముందు పలుమార్లు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తారు. నెగెటివ్ నివేదిక వస్తేనే వారిని ప్రాక్టీస్​ సెషన్లకు అనుమతిస్తారు.

ఇదీ చదవండి: 'సూర్య ఇలాగే ఆడితే నేను ఏ స్థానానికైనా రెడీ'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.