ETV Bharat / sports

వాళ్లు లేకపోవచ్చు.. మేం రెచ్చిపోవడం పక్కా : కోహ్లీ

స్టేడియంలో అభిమానులు లేకపోయినా తమ ఆటగాళ్లు ఉత్సాహంతో ఆడతారని సారథి కోహ్లీ అన్నాడు. బయో బుడగ వాతావరణానికి బాగానే అలవాటు పడ్డామని తెలిపాడు.

author img

By

Published : Sep 17, 2020, 6:06 PM IST

IPL
కోహ్లీ

కరోనా ప్రభావంతో ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్​ నిర్వహణపై బెంగళూరు జట్టు కెప్టెన్ కోహ్లీ మరోసారి మాట్లాడాడు. స్టాండ్స్​లో అభిమానులు లేనంత మాత్రాన తమ జట్టులోని ఆటగాళ్లలో జోరు తగ్గదన్నాడు. మునుపటిలానే పోటీతత్వంతో ఆడతామని స్పష్టం చేశాడు.

ఆర్సీబీ ఛైర్మన్​ సంజీవ్​ చురీవాలా, కోహ్లీ, పార్థివ్​ పటేల్​, దేవదత్​ పడిక్కల్​ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా కరోనా వీరులకు గురువారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలు విషయాల్ని చెప్పాడు విరాట్.

"బయో బబుల్ వాతావరణానికి మేం అలవాటుపడ్డాం. ఇలా ఆడుతున్నందుకు మాకు బాధగా ఏమీ లేదు. ఇప్పటివరకు కరోనా నుంచి ఎన్నో అనుభవాలను నేర్చుకున్నాం" అని కోహ్లీ చెప్పాడు.

Kohli
కోహ్లీ

"ట్రైనింగ్​ సెషన్​లో అన్ని మార్గదర్శకాలను పాటిస్తూ ప్రస్తుత పరిస్థితులను అలవాటు చేసుకున్నాం. ఈ ఐపీఎల్​తో ప్రతిఒక్కరి ముఖాలపై చిరునవ్వులు చూడాలని ఆశిస్తున్నాం" అని వికెట్​ కీపర్​, బ్యాట్స్​మన్​ పార్థివ్​ పటేల్ చెప్పాడు. ​

సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ప్రస్తుత సీజన్​ జరగనుంది. తొలి మ్యాచ్​ చెన్నై సూపర్​కింగ్స్, ముంబయి ఇండియన్స్​ మధ్య జరగనుంది. సెప్టెంబరు 21న హైదరాబాద్​తో ఆర్సీబీ తన తొలి మ్యాచ్​లో అమీతుమీ తేల్చుకోనుంది.

ఇదీ చూడండి గంగూలీ బయోపిక్​లో హృతిక్.. కానీ ఒక్క షరతు

కరోనా ప్రభావంతో ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్​ నిర్వహణపై బెంగళూరు జట్టు కెప్టెన్ కోహ్లీ మరోసారి మాట్లాడాడు. స్టాండ్స్​లో అభిమానులు లేనంత మాత్రాన తమ జట్టులోని ఆటగాళ్లలో జోరు తగ్గదన్నాడు. మునుపటిలానే పోటీతత్వంతో ఆడతామని స్పష్టం చేశాడు.

ఆర్సీబీ ఛైర్మన్​ సంజీవ్​ చురీవాలా, కోహ్లీ, పార్థివ్​ పటేల్​, దేవదత్​ పడిక్కల్​ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా కరోనా వీరులకు గురువారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలు విషయాల్ని చెప్పాడు విరాట్.

"బయో బబుల్ వాతావరణానికి మేం అలవాటుపడ్డాం. ఇలా ఆడుతున్నందుకు మాకు బాధగా ఏమీ లేదు. ఇప్పటివరకు కరోనా నుంచి ఎన్నో అనుభవాలను నేర్చుకున్నాం" అని కోహ్లీ చెప్పాడు.

Kohli
కోహ్లీ

"ట్రైనింగ్​ సెషన్​లో అన్ని మార్గదర్శకాలను పాటిస్తూ ప్రస్తుత పరిస్థితులను అలవాటు చేసుకున్నాం. ఈ ఐపీఎల్​తో ప్రతిఒక్కరి ముఖాలపై చిరునవ్వులు చూడాలని ఆశిస్తున్నాం" అని వికెట్​ కీపర్​, బ్యాట్స్​మన్​ పార్థివ్​ పటేల్ చెప్పాడు. ​

సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ప్రస్తుత సీజన్​ జరగనుంది. తొలి మ్యాచ్​ చెన్నై సూపర్​కింగ్స్, ముంబయి ఇండియన్స్​ మధ్య జరగనుంది. సెప్టెంబరు 21న హైదరాబాద్​తో ఆర్సీబీ తన తొలి మ్యాచ్​లో అమీతుమీ తేల్చుకోనుంది.

ఇదీ చూడండి గంగూలీ బయోపిక్​లో హృతిక్.. కానీ ఒక్క షరతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.