ఇంగ్లాండ్తో జరుగుతోన్న తొలి టెస్టులో టీమ్ఇండియా గెలవాలంటే చివరి రోజు 381 పరుగులు చేయాలి. నాలుగో రోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్లో వికెట్ కోల్పోయి 39 పరుగులు చేసింది భారత్.
ఇలా సాగింది..
ఓవరునైట్ స్కోరు 257/6తో ఆటను కొనసాగించిన టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో 337 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టును భారత బౌలర్లు దెబ్బతీశారు. ఫలితంగా 178 పరుగులకే కుప్పకూలిపోయి... భారత ముందు 420 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది ఇంగ్లాండ్. టీమ్ఇండియా బౌలర్లలో అశ్విన్ 6, నదీమ్ 2, ఇషాంత్ శర్మ, బుమ్రా తలో వికెట్ దక్కించుకున్నారు.
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ఇండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి ఇన్నింగ్స్లో నిరాశపరిచిన ఓపెనర్ రోహిత్ శర్మ.. రెండో ఇనింగ్స్లోనూ జాక్ లీచ్ బౌలింగ్లో కేవలం 12 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పూజారా మరో వికెట్ పడకుండా రోజు ముగించాడు. ప్రస్తుతం క్రీజులో పుజారా(12), గిల్(15) ఉన్నారు.