ETV Bharat / sports

గురువారం నుంచే చివరి టెస్టు.. దృష్టంతా పిచ్​ పైనే!

author img

By

Published : Mar 3, 2021, 6:38 AM IST

ఇంగ్లాండ్​తో చివరి టెస్టుకు మరొక్క రోజే మిగిలి ఉంది. ఆటగాళ్లతో సహా అందరి దృష్టి పిచ్​ పైనే ఉంది. ఈ సారి స్పిన్​ తిరుగుతుందా? పేస్​కు సహకరిస్తుందా? అనేది ఆసక్తి రేపుతోంది. పింక్​ బాల్​ టెస్టులా కాకున్నా.. ఓ మాదిరి బ్యాటింగ్​కూ సహకరించే అవకాశముందని క్రికెట్ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం మరి.

india vs england final test
రేపే చివరి టెస్టు.. దృష్టంతా పిచ్​ పైనే!

భారత్‌-ఇంగ్లాండ్‌ మూడో టెస్టు ముగిసి ఆరు రోజులవుతోంది. ఆ మ్యాచ్‌ జరుగుతున్నపుడు.. ఆ తర్వాత చర్చలన్నీ పిచ్‌ చుట్టూనే తిరిగాయి. గురువారం ఆరంభమయ్యే నాలుగో టెస్టు ముంగిట కూడా మార్పేమీ లేదు. అందరి దృష్టీ పిచ్‌ మీదే ఉంది. ఈ మ్యాచ్‌కు వికెట్‌ ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ అంతకంతకూ పెరిగిపోతోంది.

పరిమిత ఓవర్ల క్రికెట్‌కు పిచ్‌లు ఎలా ఉన్నా పర్వాలేదు. కానీ టెస్టు సిరీస్‌ అంటే మాత్రం సాధారణంగా ఆతిథ్య జట్టుకు అనుకూలంగా పిచ్‌ సిద్ధం కావడం మామూలే. ఉపఖండ జట్లు ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ దేశాలకు వెళ్లినపుడు పేస్‌ పిచ్‌లే స్వాగతం పలుకుతాయి. ఆ జట్లు ఉపఖండానికి వస్తే స్పిన్‌ వికెట్లు పలకరించడమూ మామూలే. అయితే ఈ సానుకూలత ఏమేరకు ఉంటుందన్నది ఆయా జట్ల విచక్షణ మేరకు ఆధారపడి ఉంటుంది. చెన్నైలో తొలి టెస్టుకు ఎక్కువగా బ్యాటింగ్‌కు సహకరిస్తూ, చివరి రెండు మూడు రోజుల్లో స్పిన్‌కు సహకరించే పిచ్‌ను సిద్ధం చేశాడు క్యురేటర్‌. అయితే టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ తొలి రెండు రోజుల్లో పరుగుల పండుగ చేసుకుంది. తర్వాత స్పిన్‌తో భారత్‌ను దెబ్బ తీసింది. కోహ్లీసేనను అనూహ్య పరాజయం పలకరించింది. దీంతో తర్వాతి మ్యాచ్‌కు భారత్‌ తన బలాన్ని నమ్ముకుంది. స్పిన్‌ పిచ్‌తో పర్యటక జట్టును దెబ్బకు దెబ్బ తీసింది.

ఇక మొతేరాలో ఏం జరిగిందో తెలిసిందే. మళ్లీ స్పిన్‌ వికెట్టే సిద్ధమైంది. గులాబి బంతితో స్పిన్నర్లు మరింతగా విజృంభించారు. భారత బ్యాట్స్‌మెన్‌ సైతం తడబడ్డప్పటికీ.. మన జట్టులో నాణ్యమైన స్పిన్నర్లుండటం కలిసొచ్చి ఇంగ్లిష్‌ జట్టుకు పరాభవం తప్పలేదు. అయితే సొంతగడ్డపై పేస్‌, స్వింగ్‌కు అనుకూలించే పిచ్‌లతో ఇంగ్లాండ్‌ ఉపఖండ జట్లను దెబ్బ తీస్తున్నపుడు మహ బాగా ఆస్వాదించే ఆ జట్టు మద్దతుదారులు మొతేరా పిచ్‌పై గగ్గోలు పెట్టేశారు. ఇలా అయితే టెస్టు క్రికెట్‌ చచ్చిపోతుందన్నట్లుగా మాట్లాడేశారు. ఈ వ్యాఖ్యలకు మన వాళ్లు దీటుగానే స్పందించారు. పేస్‌ పిచ్‌లపై రెండు మూడు రోజుల్లో ముగిసిన మ్యాచ్‌ల మాటేంటి అన్నారు. భారత జట్టు ఎప్పుడైనా పేస్‌ పిచ్‌లపై ఫిర్యాదులు చేసిందా అని ప్రశ్నించారు. దీనికి అటు వైపు నుంచి సమాధానం లేదు. అయితే గత మ్యాచ్‌ సంగతలా వదిలేస్తే.. చివరి టెస్టుకు పిచ్‌ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు అమితాసక్తిని రేకెత్తిస్తున్న విషయం.

అలా అయితే ఉండదు..

గత మ్యాచ్‌ మాదిరి చివరి టెస్టు రెండు రోజుల్లో అయితే ముగిసిపోదన్నది స్పష్టం. ఎందుకంటే ఈ మ్యాచ్‌కు ఎప్పట్లాగే ఎరుపు బంతి వాడుతున్నారు. కాబట్టి బ్యాటింగ్‌ మరీ కష్టం కాకపోవచ్చు. బౌలర్ల ఆధిపత్యం తగ్గొచ్చు. కానీ భారత వైస్​ కెప్టెన్‌ అజింక్య రహానె సహా కొందరు చెబుతున్నదాన్ని బట్టి చూస్తే.. ఈ మ్యాచ్‌కూ వికెట్‌ స్పిన్నర్లకు అనుకూలంగానే ఉంటుంది. కానీ బ్యాటింగ్‌ అంత కష్టంగా ఉండదు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పిచ్‌ స్పిన్నర్ల దాసోహం అంటే.. ఇంగ్లిష్‌ జట్టు ఐసీసీకి ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు రాకున్నా ఐసీసీ.. మ్యాచ్‌ రిఫరీని పిచ్‌పై నివేదిక కోరవచ్చు. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా అవతరించిన మొతేరాకు ఆరంభంలోనే ఇది ఒక మచ్చగా మారొచ్చు.

ఇక్కడ ఫ్రాంఛైజీ లేకపోయినా బీసీసీఐ.. ఐపీఎల్‌ మ్యాచ్‌లకు వేదికగా ఎంపిక చేయడం, అలాగే టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లనూ నిర్వహించాలని భావిస్తుండటం వల్ల మొతేరా ప్రతికూల కారణాలతో వార్తల్లో నిలవాలని కోరుకోదు. కాబట్టి చివరి టెస్టుకు సమతూకం ఉన్న పిచ్‌నే ఎంపిక చేసే అవకాశాలున్నాయి. అలాగని ఒకేసారి బ్యాటింగ్‌కు పూర్తి అనుకూలంగా మార్చేందుకూ ఆస్కారం లేదు. అలా చేస్తే ఇంతలో అంత మార్పా అన్న ప్రశ్నలు తలెత్తుతాయి. టీమ్​ఇండియా.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడాలంటే ఈ మ్యాచ్‌ను కనీసం డ్రా చేసుకోవాలి. కాబట్టి ఇంగ్లిష్‌ జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదనే భారత్‌ భావిస్తుంది. ఆ జట్టును మరోసారి స్పిన్‌తో దెబ్బ తీసేలా ఉంటూనే.. గత మ్యాచ్‌తో పోలిస్తే బ్యాట్స్‌మెన్‌కు అవకాశం ఉండేలా సమతూకం ఉన్న వికెట్టే మొతేరాలో సిద్ధమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: ఫీల్డింగ్​పై దృష్టిపెట్టిన కోహ్లీ సేన!

భారత్‌-ఇంగ్లాండ్‌ మూడో టెస్టు ముగిసి ఆరు రోజులవుతోంది. ఆ మ్యాచ్‌ జరుగుతున్నపుడు.. ఆ తర్వాత చర్చలన్నీ పిచ్‌ చుట్టూనే తిరిగాయి. గురువారం ఆరంభమయ్యే నాలుగో టెస్టు ముంగిట కూడా మార్పేమీ లేదు. అందరి దృష్టీ పిచ్‌ మీదే ఉంది. ఈ మ్యాచ్‌కు వికెట్‌ ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ అంతకంతకూ పెరిగిపోతోంది.

పరిమిత ఓవర్ల క్రికెట్‌కు పిచ్‌లు ఎలా ఉన్నా పర్వాలేదు. కానీ టెస్టు సిరీస్‌ అంటే మాత్రం సాధారణంగా ఆతిథ్య జట్టుకు అనుకూలంగా పిచ్‌ సిద్ధం కావడం మామూలే. ఉపఖండ జట్లు ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ దేశాలకు వెళ్లినపుడు పేస్‌ పిచ్‌లే స్వాగతం పలుకుతాయి. ఆ జట్లు ఉపఖండానికి వస్తే స్పిన్‌ వికెట్లు పలకరించడమూ మామూలే. అయితే ఈ సానుకూలత ఏమేరకు ఉంటుందన్నది ఆయా జట్ల విచక్షణ మేరకు ఆధారపడి ఉంటుంది. చెన్నైలో తొలి టెస్టుకు ఎక్కువగా బ్యాటింగ్‌కు సహకరిస్తూ, చివరి రెండు మూడు రోజుల్లో స్పిన్‌కు సహకరించే పిచ్‌ను సిద్ధం చేశాడు క్యురేటర్‌. అయితే టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ తొలి రెండు రోజుల్లో పరుగుల పండుగ చేసుకుంది. తర్వాత స్పిన్‌తో భారత్‌ను దెబ్బ తీసింది. కోహ్లీసేనను అనూహ్య పరాజయం పలకరించింది. దీంతో తర్వాతి మ్యాచ్‌కు భారత్‌ తన బలాన్ని నమ్ముకుంది. స్పిన్‌ పిచ్‌తో పర్యటక జట్టును దెబ్బకు దెబ్బ తీసింది.

ఇక మొతేరాలో ఏం జరిగిందో తెలిసిందే. మళ్లీ స్పిన్‌ వికెట్టే సిద్ధమైంది. గులాబి బంతితో స్పిన్నర్లు మరింతగా విజృంభించారు. భారత బ్యాట్స్‌మెన్‌ సైతం తడబడ్డప్పటికీ.. మన జట్టులో నాణ్యమైన స్పిన్నర్లుండటం కలిసొచ్చి ఇంగ్లిష్‌ జట్టుకు పరాభవం తప్పలేదు. అయితే సొంతగడ్డపై పేస్‌, స్వింగ్‌కు అనుకూలించే పిచ్‌లతో ఇంగ్లాండ్‌ ఉపఖండ జట్లను దెబ్బ తీస్తున్నపుడు మహ బాగా ఆస్వాదించే ఆ జట్టు మద్దతుదారులు మొతేరా పిచ్‌పై గగ్గోలు పెట్టేశారు. ఇలా అయితే టెస్టు క్రికెట్‌ చచ్చిపోతుందన్నట్లుగా మాట్లాడేశారు. ఈ వ్యాఖ్యలకు మన వాళ్లు దీటుగానే స్పందించారు. పేస్‌ పిచ్‌లపై రెండు మూడు రోజుల్లో ముగిసిన మ్యాచ్‌ల మాటేంటి అన్నారు. భారత జట్టు ఎప్పుడైనా పేస్‌ పిచ్‌లపై ఫిర్యాదులు చేసిందా అని ప్రశ్నించారు. దీనికి అటు వైపు నుంచి సమాధానం లేదు. అయితే గత మ్యాచ్‌ సంగతలా వదిలేస్తే.. చివరి టెస్టుకు పిచ్‌ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు అమితాసక్తిని రేకెత్తిస్తున్న విషయం.

అలా అయితే ఉండదు..

గత మ్యాచ్‌ మాదిరి చివరి టెస్టు రెండు రోజుల్లో అయితే ముగిసిపోదన్నది స్పష్టం. ఎందుకంటే ఈ మ్యాచ్‌కు ఎప్పట్లాగే ఎరుపు బంతి వాడుతున్నారు. కాబట్టి బ్యాటింగ్‌ మరీ కష్టం కాకపోవచ్చు. బౌలర్ల ఆధిపత్యం తగ్గొచ్చు. కానీ భారత వైస్​ కెప్టెన్‌ అజింక్య రహానె సహా కొందరు చెబుతున్నదాన్ని బట్టి చూస్తే.. ఈ మ్యాచ్‌కూ వికెట్‌ స్పిన్నర్లకు అనుకూలంగానే ఉంటుంది. కానీ బ్యాటింగ్‌ అంత కష్టంగా ఉండదు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పిచ్‌ స్పిన్నర్ల దాసోహం అంటే.. ఇంగ్లిష్‌ జట్టు ఐసీసీకి ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు రాకున్నా ఐసీసీ.. మ్యాచ్‌ రిఫరీని పిచ్‌పై నివేదిక కోరవచ్చు. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా అవతరించిన మొతేరాకు ఆరంభంలోనే ఇది ఒక మచ్చగా మారొచ్చు.

ఇక్కడ ఫ్రాంఛైజీ లేకపోయినా బీసీసీఐ.. ఐపీఎల్‌ మ్యాచ్‌లకు వేదికగా ఎంపిక చేయడం, అలాగే టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లనూ నిర్వహించాలని భావిస్తుండటం వల్ల మొతేరా ప్రతికూల కారణాలతో వార్తల్లో నిలవాలని కోరుకోదు. కాబట్టి చివరి టెస్టుకు సమతూకం ఉన్న పిచ్‌నే ఎంపిక చేసే అవకాశాలున్నాయి. అలాగని ఒకేసారి బ్యాటింగ్‌కు పూర్తి అనుకూలంగా మార్చేందుకూ ఆస్కారం లేదు. అలా చేస్తే ఇంతలో అంత మార్పా అన్న ప్రశ్నలు తలెత్తుతాయి. టీమ్​ఇండియా.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడాలంటే ఈ మ్యాచ్‌ను కనీసం డ్రా చేసుకోవాలి. కాబట్టి ఇంగ్లిష్‌ జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదనే భారత్‌ భావిస్తుంది. ఆ జట్టును మరోసారి స్పిన్‌తో దెబ్బ తీసేలా ఉంటూనే.. గత మ్యాచ్‌తో పోలిస్తే బ్యాట్స్‌మెన్‌కు అవకాశం ఉండేలా సమతూకం ఉన్న వికెట్టే మొతేరాలో సిద్ధమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: ఫీల్డింగ్​పై దృష్టిపెట్టిన కోహ్లీ సేన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.