ETV Bharat / sports

భారత్​ లక్ష్యం 161

ఓపెనర్ బేమౌంట్ అర్థశతకంతో రాణించగా, చివర్లో వరుస బౌండరీలతో మెరుపులు మెరిపించింది ఇంగ్లీష్ కెప్టెన్ హెథర్ నైట్.

author img

By

Published : Mar 4, 2019, 12:35 PM IST

Updated : Mar 5, 2019, 12:40 AM IST

మహిళలు

భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మహిళల టీ 20లో ఇంగ్లండ్ నాలుగు వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. అసోం గువహటి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో భారత్ టాస్​ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బేమౌంట్ అర్థశతకంతో రాణించగా మరో ఓపెనర్ వ్యాట్ 35 పరుగులతో ఆకట్టుకుంది. వీరిద్దరూ తొలి వికెట్​కు 89 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదుచేశారు. వ్యాట్​ని ఔట్​చేసి శిఖాపాండే ఈ జంటను విడదీసింది. రాధ రెండు వికెట్లు తీయగా, దీప్తి ఓ వికెట్ తన ఖాతాలో వేసుకుంది.

కాసేపటికే వన్డౌన్ బ్యాట్స్​ఉమన్ నటాలీ రాధ బౌలింగ్​లో ఔట్​ అవ్వగా ఇంగ్లీష్ కెప్టెన్ హెథర్ నైట్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడింది. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న బేమౌంట్ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరును ముందుకు కదిలించింది. వ్యాట్​తో కలిసి విలువైన భాగస్వామ్యన్ని నమోదు చేసింది.

చివర్లో మెరుపులు..
కెప్టెన్ హెథర్ నైట్​ ధాటిగా ఆడి జట్టుకు భారీ స్కోరును అందించింది. అరుంధతి రెడ్డి వేసిన 18ఓవర్లో వరసగా 5 ఫోర్లు కొట్టి చివర్లో మెరుపులు మెరిపించింది హెథర్. 20 బంతుల్లో 40 పరుగులు చేసి దీప్తి శర్మ బౌలింగ్​లో ఔటైంది. చివరి మూడు ఓవర్లలో 37 పరుగులు రాబట్టుకుంది ఇంగ్లీష్ జట్టు.

భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మహిళల టీ 20లో ఇంగ్లండ్ నాలుగు వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. అసోం గువహటి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో భారత్ టాస్​ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బేమౌంట్ అర్థశతకంతో రాణించగా మరో ఓపెనర్ వ్యాట్ 35 పరుగులతో ఆకట్టుకుంది. వీరిద్దరూ తొలి వికెట్​కు 89 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదుచేశారు. వ్యాట్​ని ఔట్​చేసి శిఖాపాండే ఈ జంటను విడదీసింది. రాధ రెండు వికెట్లు తీయగా, దీప్తి ఓ వికెట్ తన ఖాతాలో వేసుకుంది.

కాసేపటికే వన్డౌన్ బ్యాట్స్​ఉమన్ నటాలీ రాధ బౌలింగ్​లో ఔట్​ అవ్వగా ఇంగ్లీష్ కెప్టెన్ హెథర్ నైట్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడింది. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న బేమౌంట్ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరును ముందుకు కదిలించింది. వ్యాట్​తో కలిసి విలువైన భాగస్వామ్యన్ని నమోదు చేసింది.

చివర్లో మెరుపులు..
కెప్టెన్ హెథర్ నైట్​ ధాటిగా ఆడి జట్టుకు భారీ స్కోరును అందించింది. అరుంధతి రెడ్డి వేసిన 18ఓవర్లో వరసగా 5 ఫోర్లు కొట్టి చివర్లో మెరుపులు మెరిపించింది హెథర్. 20 బంతుల్లో 40 పరుగులు చేసి దీప్తి శర్మ బౌలింగ్​లో ఔటైంది. చివరి మూడు ఓవర్లలో 37 పరుగులు రాబట్టుకుంది ఇంగ్లీష్ జట్టు.

AP Video Delivery Log - 2200 GMT News
Sunday, 3 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2133: Internet Trump SKorea Drills AP Clients Only 4198995
Trump: nixed drills to save money, ease tensions
AP-APTN-2042: Italy Oranges AP Clients Only 4198994
Italian town holds annual Battle of the Oranges
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 5, 2019, 12:40 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.