ETV Bharat / sports

ఆఖరి క్షణంలో అపజయం

నామమాత్రపు మూడో టీ 20లోనూ​ పరాజయం పాలైంది భారత మహిళల జట్టు. స్మృతి మంధాన అర్ధశతకం వృథా అయింది.

author img

By

Published : Mar 9, 2019, 2:14 PM IST

మ్యాచ్ పరాజయం

మూడో టీ 20లోనూ పరాజయం పాలైంది స్మృతి సేన. చివర్లో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్​లో అమ్మాయిల జట్టు ఒక్క పరుగు తేడాతో ఓటమి చవిచూసింది. చివరి ఓవర్లో ఒకే ఒక్క పరుగిచ్చి రెండు వికెట్లు తీసింది ఇంగ్లీష్ బౌలర్ కేట్ క్రాస్. మూడు టీ 20ల టోర్నీలో ఇప్పటికే సిరీస్ కోల్పోయిన అమ్మాయిల జట్టు ఈ మ్యాచ్​లోనూ ఓడిపోయింది. ఆఖరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన కేట్ కే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.

చివరి ఓవర్లో మూడు పరుగులు అవసరం కాగా భారతి నాలుగు బంతులాడి పరుగు చేయకుండా వెనుదిరిగింది. ఐదో బంతికి అనుజా పాటిల్ కీపర్​కి క్యాచ్​ ఇచ్చి పెవిలియన్​ చేరింది. చివరి బంతికి మూడు పరుగులు రావాల్సి ఉండగా ఒక్క పరుగే లభించింది. ఆఖరు ఓవర్ వేసిన కేట్ క్రాస్ రెండు వికెట్లు తీసి భారత్​ను దెబ్బతీసింది.

మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 119 పరుగులు చేసింది. బేమౌంట్(29), వ్యాట్​(24), జోన్స్(26)రాణించారు. భారత బౌలర్ల అద్భుత బౌలింగ్​తో ఇంగ్లీష్ జట్టు మోస్తరు స్కోరుకే పరిమితం చేశారు. అనుజా పాటిల్, హర్లీన్ డియోల్ చెరో రెండు వికెట్లు తీశారు.

అనంతరం భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(58) అర్ధ సెంచరీతో చెలరేగింది. ఆరంభంలోనే హర్లీన్ వికెట్ కోల్పోయినా నిలకడగా ఆడింది భారత సారథి. మిథాలీ రాజ్ (30) రాణించినప్పటికీ మ్యాచ్​ గెలిపించలేకపోయింది. చివరి ఓవర్లో స్ట్రైక్ దొరకలేదు ఈ స్టార్ ​బ్యాట్స్​ఉమెన్​కి.

మూడో టీ 20లోనూ పరాజయం పాలైంది స్మృతి సేన. చివర్లో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్​లో అమ్మాయిల జట్టు ఒక్క పరుగు తేడాతో ఓటమి చవిచూసింది. చివరి ఓవర్లో ఒకే ఒక్క పరుగిచ్చి రెండు వికెట్లు తీసింది ఇంగ్లీష్ బౌలర్ కేట్ క్రాస్. మూడు టీ 20ల టోర్నీలో ఇప్పటికే సిరీస్ కోల్పోయిన అమ్మాయిల జట్టు ఈ మ్యాచ్​లోనూ ఓడిపోయింది. ఆఖరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన కేట్ కే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.

చివరి ఓవర్లో మూడు పరుగులు అవసరం కాగా భారతి నాలుగు బంతులాడి పరుగు చేయకుండా వెనుదిరిగింది. ఐదో బంతికి అనుజా పాటిల్ కీపర్​కి క్యాచ్​ ఇచ్చి పెవిలియన్​ చేరింది. చివరి బంతికి మూడు పరుగులు రావాల్సి ఉండగా ఒక్క పరుగే లభించింది. ఆఖరు ఓవర్ వేసిన కేట్ క్రాస్ రెండు వికెట్లు తీసి భారత్​ను దెబ్బతీసింది.

మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 119 పరుగులు చేసింది. బేమౌంట్(29), వ్యాట్​(24), జోన్స్(26)రాణించారు. భారత బౌలర్ల అద్భుత బౌలింగ్​తో ఇంగ్లీష్ జట్టు మోస్తరు స్కోరుకే పరిమితం చేశారు. అనుజా పాటిల్, హర్లీన్ డియోల్ చెరో రెండు వికెట్లు తీశారు.

అనంతరం భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(58) అర్ధ సెంచరీతో చెలరేగింది. ఆరంభంలోనే హర్లీన్ వికెట్ కోల్పోయినా నిలకడగా ఆడింది భారత సారథి. మిథాలీ రాజ్ (30) రాణించినప్పటికీ మ్యాచ్​ గెలిపించలేకపోయింది. చివరి ఓవర్లో స్ట్రైక్ దొరకలేదు ఈ స్టార్ ​బ్యాట్స్​ఉమెన్​కి.

AP Video Delivery Log - 0500 GMT News
Saturday, 9 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0437: Brazil Protest Actor AP Clients Only 4199943
Supporters in Brazil greet actor 'president'
AP-APTN-0400: US Colombia Aid AP Clients Only 4199942
US sends 7th plane loaded with aid to Colombia
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.