ETV Bharat / sports

'అదే జరిగితే టీ20 ప్రపంచకప్​లో సందడి మిస్'

author img

By

Published : Jun 5, 2020, 6:50 PM IST

టీ20 ప్రపంచకప్​ను తలుపులు మూసేసి నిర్వహించడం వల్ల స్టేడియాల్లో సందడి కోల్పోతామని అంటున్నాడు మాజీ పేసర్​ వసీం అక్రమ్​. వీలైతే కొంతసమయం వేచిచూసి, పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత టోర్నీని నిర్వహించాలని అభిప్రాయపడ్డాడు.

ICC should wait for a suitable time to host T20 World Cup: Akram
పాక్ మాజీ బౌలర్ వసీమ్ అక్రమ్

ప్రేక్షకుల్లేకుండా టీ20 ప్రపంచకప్​ జరిపే విషయాన్ని తాను ఊహించలేకపోతున్నామని చెప్పాడు పాకిస్థాన్​ మాజీ పేసర్​ వసీం అక్రమ్​. ఈ టోర్నీని నిర్వహించేందుకు సరైన సమయం కోసం అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) వేచి చూడాలని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్​ను వాయిదా వేయడం లేదంటే ఖాళీ స్టేడియాల్లో జరపనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్రమ్ ఈ విధంగా స్పందించాడు.

"ప్రేక్షకుల లేకుండా టోర్నీ జరపడం సరైన ఆలోచన కాదు. ప్రపంచకప్​లో తమ జట్లకు మద్దతుగా తెలిపేందుకు దేశవిదేశాల నుంచి వేలాది మంది అభిమానులు వస్తారు. వేదిక సందడిగా ఉంటుంది. తలుపులు మూసేసి టోర్నీ నిర్వహిస్తే అలాంటి వాతావరణం కనిపించదు. అందువల్ల ఐసీసీ, కొంత సమయం ఎదురుచూసి టీ20 ప్రపంచకప్​ జరిపితే బాగుంటుందని నా అభిప్రాయం"

- వసీం అక్రమ్​, పాక్ మాజీ పేసర్​

టీ20 ప్రపంచకప్​ నిర్వహణ విషయమై మే 28న ఐసీసీ సమావేశమైంది. కానీ, ఆ భేటీ తర్వాత ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. జూన్ 10 వరకు ఉన్న పరిస్థితులను అంచనా వేసుకొని, అదే రోజున టోర్నీపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశముంది.

T20 World Cup
టీ20 ప్రపంచకప్-2020

బౌలర్లకు నచ్చదు

బంతిపై లాలాజలం వినియోగం నిషేధించడంపై అక్రమ్​ స్పందిస్తూ.. "నాకు తెలిసి ఈ నిబంధన ఫాస్ట్​ బౌలర్లకు నచ్చకపోవచ్చు. బంతిని స్వింగ్​ చేసేందుకు లాలాజలం లేదా చెమటను వాడటం వారికి అలవాటుగా మారింది. అందువల్ల ఈ సమస్యకు ఓ సరైన మార్గం కావాలి. ఎంత తొందరగా దీనికి పరిష్కారం వెతికితే అంత మంచిది" అని చెప్పాడు.

ఇదీ చూడండి... వివాదాస్పద వ్యాఖ్యలపై యువరాజ్ క్షమాపణ

ప్రేక్షకుల్లేకుండా టీ20 ప్రపంచకప్​ జరిపే విషయాన్ని తాను ఊహించలేకపోతున్నామని చెప్పాడు పాకిస్థాన్​ మాజీ పేసర్​ వసీం అక్రమ్​. ఈ టోర్నీని నిర్వహించేందుకు సరైన సమయం కోసం అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) వేచి చూడాలని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్​ను వాయిదా వేయడం లేదంటే ఖాళీ స్టేడియాల్లో జరపనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్రమ్ ఈ విధంగా స్పందించాడు.

"ప్రేక్షకుల లేకుండా టోర్నీ జరపడం సరైన ఆలోచన కాదు. ప్రపంచకప్​లో తమ జట్లకు మద్దతుగా తెలిపేందుకు దేశవిదేశాల నుంచి వేలాది మంది అభిమానులు వస్తారు. వేదిక సందడిగా ఉంటుంది. తలుపులు మూసేసి టోర్నీ నిర్వహిస్తే అలాంటి వాతావరణం కనిపించదు. అందువల్ల ఐసీసీ, కొంత సమయం ఎదురుచూసి టీ20 ప్రపంచకప్​ జరిపితే బాగుంటుందని నా అభిప్రాయం"

- వసీం అక్రమ్​, పాక్ మాజీ పేసర్​

టీ20 ప్రపంచకప్​ నిర్వహణ విషయమై మే 28న ఐసీసీ సమావేశమైంది. కానీ, ఆ భేటీ తర్వాత ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. జూన్ 10 వరకు ఉన్న పరిస్థితులను అంచనా వేసుకొని, అదే రోజున టోర్నీపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశముంది.

T20 World Cup
టీ20 ప్రపంచకప్-2020

బౌలర్లకు నచ్చదు

బంతిపై లాలాజలం వినియోగం నిషేధించడంపై అక్రమ్​ స్పందిస్తూ.. "నాకు తెలిసి ఈ నిబంధన ఫాస్ట్​ బౌలర్లకు నచ్చకపోవచ్చు. బంతిని స్వింగ్​ చేసేందుకు లాలాజలం లేదా చెమటను వాడటం వారికి అలవాటుగా మారింది. అందువల్ల ఈ సమస్యకు ఓ సరైన మార్గం కావాలి. ఎంత తొందరగా దీనికి పరిష్కారం వెతికితే అంత మంచిది" అని చెప్పాడు.

ఇదీ చూడండి... వివాదాస్పద వ్యాఖ్యలపై యువరాజ్ క్షమాపణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.