ETV Bharat / sports

ధోనీ పాఠాలు.. దీపక్ మార్కులు.. హ్యాట్రిక్ రికార్డులు

author img

By

Published : Nov 12, 2019, 6:41 AM IST

Updated : Nov 12, 2019, 7:21 AM IST

బంగ్లాదేశ్​తో ఆదివారం జరిగిన మ్యాచ్​లో ఏడు పరుగులిచ్చి 6 వికెట్లు తీసిన దీపక్ చాహర్.. 2018 ఐపీఎల్​ నుంచి వెలుగులోకి వచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన ఈ ఆటగాడు ధోనీ పర్యవేక్షణలో రాటుదేలాడు.

దీపక్ చాహర్

2010-11 సీజన్​లో హైదరాబాద్ - రాజస్థాన్ జట్ల మధ్య రంజీ మ్యాచ్ జరుగుతోంది. మొదట హైదరాబాద్​ బ్యాటింగ్ చేస్తోంది. దేశవాళీలో పెద్దగా అనుభవం లేని 18 ఏళ్ల కుర్రాడు బౌలింగ్. ఒక్క పరుగుకే ఓపెనర్ వికెట్ పడింది..కాసేపటికే మరొకటి.. ఇంతటితో ఆగలేదు.. బ్యాట్స్​మెన్ వరుసగా అలా వచ్చి ఇలా పెవిలియన్​కు క్యూ కడుతూనే ఉన్నారు. ఫలితంగా హైదరాబాద్.. 21 పరుగులకే ఆలౌటై రంజీల్లో అతి తక్కువ పరుగులు చేసిన జట్టుగా అప్రతిష్ఠ మూట గట్టుకుంది. అందులో 8 వికెట్లు ఆ కుర్రాడే తీశాడు. అతడే దీపక్ చాహర్. ఆదివారం.. బంగ్లాదేశ్​తో మూడో టీ20లోనూ 6 వికెట్లు తీసి, టీ20ల్లో భారత్​ తరఫున అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.

బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన దీపక్ చాహర్ తండ్రి లోకేంద్ర సింగ్.. భారత వాయుదళంలో పనిచేసి రిటైరయ్యారు. చిన్నతనం నుంచే క్రికెట్ మీద ఆసక్తితో దీపక్ ఎంతో కష్టపడేవాడని, నెట్స్​లో లక్షసార్లుకు పైగా బౌలింగ్ చేసుంటాడని ఆయన చెప్పారు.

Deepak Chahar
బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో భారత బౌలర్ దీపక్ చాహర్

"మేమిద్దరం కన్న కల ఇప్పటికి తీరింది. ఈ స్థాయికి రావడం కోసం దీపక్ ఎంతో శ్రమించాడు. నెట్స్​లో దాదాపు లక్షసార్లు పైగా బౌలింగ్ చేసుంటాడు" - లోకేంద్ర సింగ్, దీపక్ చాహర్ తండ్రి

ధోనీ పర్యవేక్షణలో రాటు తేలిన చాహర్

Deepak Chahar-MS Dhoni
ఐపీఎల్​లో చెన్నై కెప్టెన్ ధోనీతో బౌలర్ దీపక్ చాహర్

ఎప్పటి నుంచో దేశవాళీల్లో ఆడుతున్నప్పటికీ 2018 ఐపీఎల్​ నుంచి వెలుగులోకి వచ్చాడు చాహర్​. రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నై జట్టు ఆ ఐపీఎల్​లో​ పునరాగామనం చేసింది. బౌలర్ దీపక్ చాహర్​​ను పట్టుబట్టి ఎంపిక చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. పుణె తరఫున ప్రాతినిధ్యం వహించినపుడు చాహర్ బౌలింగ్​ నచ్చి, ధోనీ అతడిని చెన్నై జట్టులోకి తీసుకున్నాడు.

తన మీద ధోనీ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టి చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు చాహర్​. గత సీజన్​లో 10 వికెట్లు తీయగా.. ఈ ఏడాది అతడు 22 వికెట్లతో దూసుకెళ్లాడు. స్వింగ్ బౌలరైన దీపక్​.. తనలోని నైపుణ్యాన్ని మెరుగుపర్చుకొని అన్ని రకాల బంతులు సంధించాడు. వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్​లో భారత్​ తరఫున కీలక బౌలర్ అవుతానడంలో సందేహం లేదు.

మహీ మార్గనిర్దేశం

గతేడాది ఐపీఎల్​లో చెన్నై - పంజాబ్ మధ్య మ్యాచ్​ జరుగుతోంది. పంజాబ్ గెలవాలంటే 12 బంతుల్లో 39 పరుగులు చేయాలి. మహీ.. చాహర్​కు బంతిచ్చాడు. వరుసగా రెండు నోబాల్స్​ వేశాడు చాహర్. వెంటనే మిస్టర్ కూల్ ధోనీ రంగంలోకి దిగి మార్గనిర్దేశం చేశాడు. మహీ ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో చివరి బంతికి బ్యాట్స్​మన్​ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఫలితంగా అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క నోబాల్ కూడా వేయలేదు దీపక్ చాహర్.

Deepak Chahar-MS Dhoni
ఐపీఎల్​లో చెన్నై కెప్టెన్ ధోనీతో బౌలర్ దీపక్ చాహర్

ఆరంభంలోనే ఎదురుదెబ్బ

2008లో రాజస్థాన్ తరఫున ఆడేందుకు టాప్ 50 మంది బౌలర్లను ఎంపిక చేసింది ఆ రాష్ట క్రికెట్ అకాడమీ. అయితే అప్పుడు దీపక్ చాహర్​ను తీసుకోలేదు. నిరాశ చెందని చాహర్ తన బౌలింగ్​కు మెరుగుపర్చుకొని రాజస్థాన్​ జట్టులో చోటు సంపాదించాడు. హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో ఆకట్టుకున్నాడు. నిరంతర గాయాలు, ఫిట్​నెస్ లేమితో అడపాదడపా దేశవాళీ మ్యాచ్​లు ఆడుతూ వచ్చాడు దీపక్.

అంతర్జాతీయ మ్యాచ్​ల్లో అరంగేట్రం

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చక్కటి ప్రదర్శన చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. అనంతరం భారత్-ఏలో చోటు దక్కించుకొని ఇంగ్లాండ్, వెస్టిండీస్​తో మ్యాచ్​లు ఆడాడు. చివరికి గత ఏడాది జస్ప్రీత్ బుమ్రా గాయంతో జట్టుకు దూరం కాగా.. దీపక్ చాహర్​కు అవకాశమొచ్చింది. ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో టీ20లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 7 అంతర్జాతీయ టీ20 మ్యాచ్​లాడిన చాహర్ 14 వికెట్లు తీశాడు.

2010-11 సీజన్​లో హైదరాబాద్ - రాజస్థాన్ జట్ల మధ్య రంజీ మ్యాచ్ జరుగుతోంది. మొదట హైదరాబాద్​ బ్యాటింగ్ చేస్తోంది. దేశవాళీలో పెద్దగా అనుభవం లేని 18 ఏళ్ల కుర్రాడు బౌలింగ్. ఒక్క పరుగుకే ఓపెనర్ వికెట్ పడింది..కాసేపటికే మరొకటి.. ఇంతటితో ఆగలేదు.. బ్యాట్స్​మెన్ వరుసగా అలా వచ్చి ఇలా పెవిలియన్​కు క్యూ కడుతూనే ఉన్నారు. ఫలితంగా హైదరాబాద్.. 21 పరుగులకే ఆలౌటై రంజీల్లో అతి తక్కువ పరుగులు చేసిన జట్టుగా అప్రతిష్ఠ మూట గట్టుకుంది. అందులో 8 వికెట్లు ఆ కుర్రాడే తీశాడు. అతడే దీపక్ చాహర్. ఆదివారం.. బంగ్లాదేశ్​తో మూడో టీ20లోనూ 6 వికెట్లు తీసి, టీ20ల్లో భారత్​ తరఫున అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.

బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన దీపక్ చాహర్ తండ్రి లోకేంద్ర సింగ్.. భారత వాయుదళంలో పనిచేసి రిటైరయ్యారు. చిన్నతనం నుంచే క్రికెట్ మీద ఆసక్తితో దీపక్ ఎంతో కష్టపడేవాడని, నెట్స్​లో లక్షసార్లుకు పైగా బౌలింగ్ చేసుంటాడని ఆయన చెప్పారు.

Deepak Chahar
బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో భారత బౌలర్ దీపక్ చాహర్

"మేమిద్దరం కన్న కల ఇప్పటికి తీరింది. ఈ స్థాయికి రావడం కోసం దీపక్ ఎంతో శ్రమించాడు. నెట్స్​లో దాదాపు లక్షసార్లు పైగా బౌలింగ్ చేసుంటాడు" - లోకేంద్ర సింగ్, దీపక్ చాహర్ తండ్రి

ధోనీ పర్యవేక్షణలో రాటు తేలిన చాహర్

Deepak Chahar-MS Dhoni
ఐపీఎల్​లో చెన్నై కెప్టెన్ ధోనీతో బౌలర్ దీపక్ చాహర్

ఎప్పటి నుంచో దేశవాళీల్లో ఆడుతున్నప్పటికీ 2018 ఐపీఎల్​ నుంచి వెలుగులోకి వచ్చాడు చాహర్​. రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నై జట్టు ఆ ఐపీఎల్​లో​ పునరాగామనం చేసింది. బౌలర్ దీపక్ చాహర్​​ను పట్టుబట్టి ఎంపిక చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. పుణె తరఫున ప్రాతినిధ్యం వహించినపుడు చాహర్ బౌలింగ్​ నచ్చి, ధోనీ అతడిని చెన్నై జట్టులోకి తీసుకున్నాడు.

తన మీద ధోనీ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టి చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు చాహర్​. గత సీజన్​లో 10 వికెట్లు తీయగా.. ఈ ఏడాది అతడు 22 వికెట్లతో దూసుకెళ్లాడు. స్వింగ్ బౌలరైన దీపక్​.. తనలోని నైపుణ్యాన్ని మెరుగుపర్చుకొని అన్ని రకాల బంతులు సంధించాడు. వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్​లో భారత్​ తరఫున కీలక బౌలర్ అవుతానడంలో సందేహం లేదు.

మహీ మార్గనిర్దేశం

గతేడాది ఐపీఎల్​లో చెన్నై - పంజాబ్ మధ్య మ్యాచ్​ జరుగుతోంది. పంజాబ్ గెలవాలంటే 12 బంతుల్లో 39 పరుగులు చేయాలి. మహీ.. చాహర్​కు బంతిచ్చాడు. వరుసగా రెండు నోబాల్స్​ వేశాడు చాహర్. వెంటనే మిస్టర్ కూల్ ధోనీ రంగంలోకి దిగి మార్గనిర్దేశం చేశాడు. మహీ ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో చివరి బంతికి బ్యాట్స్​మన్​ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఫలితంగా అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క నోబాల్ కూడా వేయలేదు దీపక్ చాహర్.

Deepak Chahar-MS Dhoni
ఐపీఎల్​లో చెన్నై కెప్టెన్ ధోనీతో బౌలర్ దీపక్ చాహర్

ఆరంభంలోనే ఎదురుదెబ్బ

2008లో రాజస్థాన్ తరఫున ఆడేందుకు టాప్ 50 మంది బౌలర్లను ఎంపిక చేసింది ఆ రాష్ట క్రికెట్ అకాడమీ. అయితే అప్పుడు దీపక్ చాహర్​ను తీసుకోలేదు. నిరాశ చెందని చాహర్ తన బౌలింగ్​కు మెరుగుపర్చుకొని రాజస్థాన్​ జట్టులో చోటు సంపాదించాడు. హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో ఆకట్టుకున్నాడు. నిరంతర గాయాలు, ఫిట్​నెస్ లేమితో అడపాదడపా దేశవాళీ మ్యాచ్​లు ఆడుతూ వచ్చాడు దీపక్.

అంతర్జాతీయ మ్యాచ్​ల్లో అరంగేట్రం

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చక్కటి ప్రదర్శన చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. అనంతరం భారత్-ఏలో చోటు దక్కించుకొని ఇంగ్లాండ్, వెస్టిండీస్​తో మ్యాచ్​లు ఆడాడు. చివరికి గత ఏడాది జస్ప్రీత్ బుమ్రా గాయంతో జట్టుకు దూరం కాగా.. దీపక్ చాహర్​కు అవకాశమొచ్చింది. ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో టీ20లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 7 అంతర్జాతీయ టీ20 మ్యాచ్​లాడిన చాహర్ 14 వికెట్లు తీశాడు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
FILE: China - Exact Date and Location Unknown (CCTV - No access Chinese mainland)
1. Various of vehicles of China Post driving, deliverymen unloading packages
2. Advertisement of worldwide express mail service
3. Various of staff sorting out packages
Beijing, China - Nov 11, 2019 (CCTV - No access Chinese mainland)
4. SOUNDBITE (Chinese) Feng Lihu, director of Market Supervision Department, State Post Bureau (starting with shot 3):
"As the workload increases, potential safety hazard will be certain to grow. In particular, the temporary employees who are hired for the peak period must receive pre-job training so that they can operate according to rules. The drivers must be educated to avoid fatigue driving arising from huge workload and long working hours."
FILE: China - Exact Date and Location Unknown (CCTV - No access Chinese mainland)
5. Various of staff checking packages of goods
6. Various of staff putting boxes onto conveyor belt
China's logistics industry is expected to handle 2.8 billion pieces of package for the "Double 11" or "Singles' Day" annual online shopping spree which fell on Nov 11, the State Post Bureau (SPB) said on Monday.
From Nov 11 to 18, about 350 million packages will be handled every day, more than twice the normal daily amount. The maximum daily amount may reach 520 million pieces, according to the SPB.
Nov 11 to 13 will be the peak period for collecting goods, and the pressure of delivery will mainly be seen from Nov 13 to 18. The entire industry will return to normal after Nov 21.
Among Chinese cities, Yiwu County of east China's Zhejiang Province will have the largest amount of packages for collection while Shanghai will see the largest delivery workload.
"As the workload increases, potential safety hazard will be certain to grow. In particular, the temporary employees who are hired for the peak period must receive pre-job training so that they can operate according to rules. The drivers must be educated to avoid fatigue driving arising from huge workload and long working hours," said Feng Lihu, director of the Market Supervision Department at SPB.
According to Feng, nearly 400,000 people and 120,000 vehicles have been temporarily hired for the peak period.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Nov 12, 2019, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.