ETV Bharat / sports

'ఇష్టమైన వ్యక్తితో గడిపేందుకు సమయం దొరికింది' - Harmanpreet kaur home

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని క్రీడాటోర్నీలు రద్దయ్యాయి. ఆటగాళ్లు, ప్రముఖులు బయటికి రాకుండా ఇంట్లోనే ఉంటున్నారు. ఎప్పుడూ బిజీగా ఉండే భారత క్రికెటర్లూ ప్రస్తుతం కుటుంబంతో గడుపుతున్నారు. ఇంట్లోనే ఉన్న మహిళా క్రికెట్ జట్టు సారథి హర్మన్​ ఓ ఆసక్తికర ట్వీట్​ చేసింది.

Harman preet kaur spending quality time with her precious person after corona outbreak
ఇష్టమైన వ్యక్తితో సమయం దొరికింది: హర్మన్​ప్రీత్​
author img

By

Published : Mar 17, 2020, 6:46 PM IST

మహమ్మారి కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో ప్రముఖులు, ప్రజలంతా ఇళ్లకే పరిమితమౌతున్నారు. భారత టీ20 జట్టు సారథి హర్మన్​ప్రీత్​ కౌర్ కూడా ఇంటి వద్దే ఉంది. తాజాగా తనకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెల్లడించింది.

"ప్రస్తుతం నా విలువైన సమయాన్ని నాకు ఇష్టమైన పెంపుడు జంతువుకు కేటాయిస్తున్నాను. ప్రభుత్వం, వైద్యాధికారులు చెప్పిన సూచనలను ప్రజలంతా పాటించాలి. అందరూ జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ప్రేమించుకోండి"

- హర్మన్​ప్రీత్​ కౌర్​, టీమిండియా సారథి

Harman preet kaur spending quality time with her precious person after corona outbreak
కుక్కపిల్లతో ఆడుకుంటున్న హర్మన్​

కరోనా వైరస్​ విజృంభించడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా పలు క్రీడాటోర్నీలు రద్దయ్యాయి. మరికొన్ని వాయిదా పడ్డాయి. తాజాగా భారత్​-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్​తో పాటు ఐపీఎల్​ వాయిదా పడింది. భారత ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన నివేదిక ప్రకారం కరోనా బాధితుల సంఖ్య 126కు చేరింది.

మహమ్మారి కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో ప్రముఖులు, ప్రజలంతా ఇళ్లకే పరిమితమౌతున్నారు. భారత టీ20 జట్టు సారథి హర్మన్​ప్రీత్​ కౌర్ కూడా ఇంటి వద్దే ఉంది. తాజాగా తనకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెల్లడించింది.

"ప్రస్తుతం నా విలువైన సమయాన్ని నాకు ఇష్టమైన పెంపుడు జంతువుకు కేటాయిస్తున్నాను. ప్రభుత్వం, వైద్యాధికారులు చెప్పిన సూచనలను ప్రజలంతా పాటించాలి. అందరూ జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ప్రేమించుకోండి"

- హర్మన్​ప్రీత్​ కౌర్​, టీమిండియా సారథి

Harman preet kaur spending quality time with her precious person after corona outbreak
కుక్కపిల్లతో ఆడుకుంటున్న హర్మన్​

కరోనా వైరస్​ విజృంభించడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా పలు క్రీడాటోర్నీలు రద్దయ్యాయి. మరికొన్ని వాయిదా పడ్డాయి. తాజాగా భారత్​-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్​తో పాటు ఐపీఎల్​ వాయిదా పడింది. భారత ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన నివేదిక ప్రకారం కరోనా బాధితుల సంఖ్య 126కు చేరింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.