శనివారం విండీస్పై భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమిండియా బౌలర్ సైనీ మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఈ యువ ఆటగాడిని జట్టులోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన బేడీ, చేతన్లను ట్విట్టర్ వేదికగా మాజీ ఓపెనర్ గంభీర్ విమర్శించాడు.
"సైనీ.. నువ్వు బౌలింగ్ చేయకముందే బేడీ, చేతన్ల వికెట్లు తీశావు. నీ అరంగేట్ర మ్యాచ్ చూసి వారిద్దరి మిడిల్ స్టంప్స్ ఎగిరిపడ్డాయి" అని గంభీర్ ట్వీట్ చేశాడు.

రంజీ జట్టులోకి సైనీని తీసుకురావడానికి గంభీర్ నిర్ణయించుకున్నాక, హరియాణాకు చెందిన వ్యక్తిని ఎలా ఆడిస్తారంటూ బేడీ, చేతన్ వ్యతిరేకించారు. దిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులుగా ఉన్న వారిద్దరూ బయటి వ్యక్తిని దిల్లీ జట్టులోకి తీసుకురావడాన్ని ప్రశ్నించారు.
బేడీ, చౌహాన్లను గంభీర్ వ్యతిరేకించడం ఇదే మెుదటిసారి కాదు. గతేడాది అఫ్గాన్తో జరిగిన టెస్టుకు సైనీ భారత జట్టులో చేరినప్పుడు ఇదే విధంగా వ్యాఖ్యానించాడు. ఈ టెస్టులో సైనీ ఆడలేదు.
తన విజయానికి కారణమైన గంభీర్, మరికొందరు సీనియర్ ఆటగాళ్లకు రుణపడి ఉంటానని సైనీ ఇంతకు ముందే చెప్పాడు.
ఇది సంగతి: సచిన్-కాంబ్లీ ఫ్రెండ్షిప్ డే థియరీ సూపర్