ETV Bharat / sports

టీ విరామానికి భారత్​ 183/3- పంత్​ రికార్డు

author img

By

Published : Jan 19, 2021, 10:23 AM IST

Updated : Jan 19, 2021, 11:59 AM IST

గబ్బా టెస్టు రెండో ఇన్నింగ్స్​లో టీ బ్రేక్ సమయానికి టీమ్ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. క్రీజులో పుజారా(43), పంత్​(10) ఉన్నారు. ఈ మ్యాచ్​తో పంత్..​ టెస్టుల్లో అతి తక్కువ (27) ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన భారత్‌ వికెట్​కీపర్​గా రికార్డుకెక్కాడు.

rahwny
రహానె

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో(చివరి) టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఆచితూచి ఆడుతోంది. ఐదో రోజు ఆటలో టీ బ్రేక్ సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. విజయానికి 145 పరుగులు దూరంలో ఉంది. క్రీజులో పుజారా(43), పంత్​(10) ఉన్నారు.

భోజన విరామం తర్వాత 132 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. సెంచరీకి చేరువవుతున్న గిల్(91)ను బోల్తా కొట్టించాడు లైయన్​. ఆ తర్వాత 167 పరుగుల వద్ద రహానె (24).. కమిన్స్ బౌలింగ్​లో మూడో వికెట్​గా వెనుదిరిగాడు. దీంతో 63 ఓవర్లలో భారత్​ ​183/3గా స్కోరు నమోదు చేసింది.

పంత్​ రికార్డు

ఈ క్రమంలోనే పంత్‌ టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. భారత్‌ తరఫున అతి తక్కువ (27) ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించిన వికెట్​కీపర్​గా రికార్డు నెలకొల్పాడు. ధోనీ 32 ఇన్నింగ్స్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో(చివరి) టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఆచితూచి ఆడుతోంది. ఐదో రోజు ఆటలో టీ బ్రేక్ సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. విజయానికి 145 పరుగులు దూరంలో ఉంది. క్రీజులో పుజారా(43), పంత్​(10) ఉన్నారు.

భోజన విరామం తర్వాత 132 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. సెంచరీకి చేరువవుతున్న గిల్(91)ను బోల్తా కొట్టించాడు లైయన్​. ఆ తర్వాత 167 పరుగుల వద్ద రహానె (24).. కమిన్స్ బౌలింగ్​లో మూడో వికెట్​గా వెనుదిరిగాడు. దీంతో 63 ఓవర్లలో భారత్​ ​183/3గా స్కోరు నమోదు చేసింది.

పంత్​ రికార్డు

ఈ క్రమంలోనే పంత్‌ టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. భారత్‌ తరఫున అతి తక్కువ (27) ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించిన వికెట్​కీపర్​గా రికార్డు నెలకొల్పాడు. ధోనీ 32 ఇన్నింగ్స్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు.

Last Updated : Jan 19, 2021, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.