ఇంగ్లాండ్తో జరుగుతోన్న తొలి టెస్టు నాలుగో రోజు భారత బౌలర్లు చెలరేగిపోయారు. తొలి టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన ప్రత్యర్థి జట్టు బ్యాట్స్మెన్కు చుక్కలు చూపించారు. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 178 పరుగలకే కుప్పకూలింది. రూట్(40) జట్టులో టాప్ స్కోరర్. ఓలీ పాప్(28), జాస్ బట్లర్(24), డొమినిర్ బెస్(25) ఫర్వాలేదనిపించగా.. మిగతా వారు తేలిపోయారు. భారత్ మ్యాచ్ గెలవాలంటే 420 పరుగులు చేయాలి.
భారత బౌలర్లలో అశ్విన్ ఆరు వికెట్లు తీసి సత్తా చాటాడు, నదీమ్(2), ఇషాంత్ శర్మ, బుమ్రా తలో వికెట్ దక్కించుకున్నారు.
అంతకముందు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 558 పరుగులు చేయగా.. భారత్ 337 పరుగులకు ఆలౌట్ అయింది.