టీమిండియా సెలక్షన్ కమిటీ నూతన ఛైర్మన్గా కర్ణాటకకు చెందిన మాజీ ఆల్రౌండర్ సునీల్ జోషి ఎంపికయ్యాడు. ఈ నిర్ణయాన్ని బీసీసీఐ బుధవారం తీసుకుంది. జోషితో పాటు మాజీ పేస్ బౌలర్ హర్విందర్సింగ్కు సెలక్షన్ ప్యానెల్లో అవకాశం కల్పించింది. వీరితో పాటు జతిన్ పరంజపే, దేవాంగ్ గాంధీ, శరణ్ దీప్ సింగ్ కమిటీలో కొనసాగనున్నారు.
ఈ నేపథ్యంలో భారత జట్టుతో ధోనీ భవిష్యత్పై మీ అభిప్రాయమేంటి? అని సెలెక్టర్లను ప్రశ్నించింది మదన్ లాల్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ). మహీని టీ20 ప్రపంచకప్నకు ఎంపిక చేస్తారా? అనే ప్రశ్నలు వేసింది. దీనిపై ప్యానెల్ సభ్యులు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు.
ఏదేమైనప్పటికీ ధోనీ భవిష్యత్పై సెలక్టర్లు ఏమనుకుంటున్నారో స్పష్టంగా తెలుసుకోవాలనుకుంటోంది బీసీసీఐ. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత మైదానంలో కనబడలేదు ధోనీ. అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ చెన్నై చేరుకున్నాడు. ఈ నెల 29న ఆరంభమయ్యే ఐపీఎల్ కోసం సాధన మొదలుపెట్టాడు.
ఇదీ చూడండి : బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా సునీల్ జోషి