ETV Bharat / sports

టెస్టు ఛాంపియన్​షిప్ పట్టికలో అగ్రస్థానానికి ఆసీస్​

author img

By

Published : Nov 19, 2020, 10:10 PM IST

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​ ముంగిట భారత్​కు షాక్​ తగిలింది. ఐసీసీ టెస్టు ఛాంపియన్​షిప్​ పాయింట్ల పట్టికలో భారత్​ రెండోస్థానానికి చేరింది. గెలుపు శాతం ఆధారంగా ఆసీస్​ అగ్రపీఠం దక్కించుకుంది. ఈ మేరకు తాజాగా ఐసీసీ అధికారిక ప్రకటన చేసింది.

ICC World Test Championship Trophy
టెస్టు ఛాంపియన్​షిప్ పాయింట్ల​లో ఆసీస్​కే అగ్రపీఠం

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ పాయింట్ల పట్టికలో టాపర్​గా నిలిచింది ఆస్ట్రేలియా. తాజాగా ఐసీసీ ప్రకటించిన జాబితాలో భారత్​ రెండోస్థానానికి పడిపోయింది. భారత్​కు ఎక్కువ పాయింట్లు ఉన్నప్పటికీ విజయాల శాతం ఆధారంగా కంగారూ జట్టుకే అగ్రపీఠం దక్కింది. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న ఆసీస్​-భారత్​ సిరీస్​ మరింత రసవత్తరంగా మారనుంది.

ICC World Test Championship Trophy
భారత జట్టు

ప్రస్తుతం ఆస్ట్రేలియా (296 పాయింట్లు, గెలుపు శాతం 82.22 ), భారత్‌ (360 పాయింట్లు, 75%), ఇంగ్లాండ్‌ (292 పాయింట్లు, 60.83%), న్యూజిలాండ్ (180 పాయింట్లు, 50%), పాకిస్థాన్‌ (166 పాయింట్లు, 39.52%) తొలి అయిదు స్థానాల్లో ఉన్నాయి. విజయాల శాతం ఆధారంగానే ఫైనల్‌కు జట్లు అర్హత సాధించనున్నాయి.

టెస్టుల ర్యాంకింగ్​లో తొమ్మిది అగ్రశ్రేణి జట్లు, రెండేళ్లలో ఆరు సిరీస్​లు ఆడాల్సి ఉంది. ప్రతి సిరీస్​కు గరిష్టంగా 120 పాయింట్లను లెక్కిస్తారు. సిరీస్​లోని మ్యాచ్​ల సంఖ్య ఆధారంగా పాయింట్ల పంపిణీ జరిగేది. అయితే కరోనా నేపథ్యంలో పలు సిరీస్​లు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో నిబంధనల్లో మార్పుల ప్రకారం అధిక విజయాల శాతం కలిగిన టాప్​-2 జట్లే.. వచ్చే ఏడాది జూన్​లో లార్డ్స్​ వేదికగా ఫైనల్​ ఆడనున్నాయి. గెలిచిన జట్టు ప్రపంచ ఛాంపియన్‌షిప్ విజేత‌గా నిలుస్తుంది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ పాయింట్ల పట్టికలో టాపర్​గా నిలిచింది ఆస్ట్రేలియా. తాజాగా ఐసీసీ ప్రకటించిన జాబితాలో భారత్​ రెండోస్థానానికి పడిపోయింది. భారత్​కు ఎక్కువ పాయింట్లు ఉన్నప్పటికీ విజయాల శాతం ఆధారంగా కంగారూ జట్టుకే అగ్రపీఠం దక్కింది. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న ఆసీస్​-భారత్​ సిరీస్​ మరింత రసవత్తరంగా మారనుంది.

ICC World Test Championship Trophy
భారత జట్టు

ప్రస్తుతం ఆస్ట్రేలియా (296 పాయింట్లు, గెలుపు శాతం 82.22 ), భారత్‌ (360 పాయింట్లు, 75%), ఇంగ్లాండ్‌ (292 పాయింట్లు, 60.83%), న్యూజిలాండ్ (180 పాయింట్లు, 50%), పాకిస్థాన్‌ (166 పాయింట్లు, 39.52%) తొలి అయిదు స్థానాల్లో ఉన్నాయి. విజయాల శాతం ఆధారంగానే ఫైనల్‌కు జట్లు అర్హత సాధించనున్నాయి.

టెస్టుల ర్యాంకింగ్​లో తొమ్మిది అగ్రశ్రేణి జట్లు, రెండేళ్లలో ఆరు సిరీస్​లు ఆడాల్సి ఉంది. ప్రతి సిరీస్​కు గరిష్టంగా 120 పాయింట్లను లెక్కిస్తారు. సిరీస్​లోని మ్యాచ్​ల సంఖ్య ఆధారంగా పాయింట్ల పంపిణీ జరిగేది. అయితే కరోనా నేపథ్యంలో పలు సిరీస్​లు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో నిబంధనల్లో మార్పుల ప్రకారం అధిక విజయాల శాతం కలిగిన టాప్​-2 జట్లే.. వచ్చే ఏడాది జూన్​లో లార్డ్స్​ వేదికగా ఫైనల్​ ఆడనున్నాయి. గెలిచిన జట్టు ప్రపంచ ఛాంపియన్‌షిప్ విజేత‌గా నిలుస్తుంది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.