టీమ్ఇండియా మాజీ సారథి, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ.. ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఈ విషయమై స్పందించిన టీమ్ఇండియా కోచ్ రవిశాస్త్రి.. మహీ గొప్పతనం గురించి చెబుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. జేబుదొంగతనాలు చేసే వారి కన్నా ధోనీ పరుగెడతాడని ప్రశంసించాడు. అన్ని ఫార్మాట్లలోనూ చెరగని ముద్రవేసి, క్రికెట్ రూపురేఖల్ని మార్చేశాడని అన్నాడు. తన ప్రశాంత స్వభావమే మహీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని చెప్పాడు.
ధోనీ.. టీ20ల్లో ప్రపంచకప్లు సహా ఐపీఎల్ టైటిల్స్ను సాధించాడు. వన్డేల్లో ప్రపంచకప్ను భారత్కు అందించాడు.టెస్టుల్లోనూ టీమ్ఇండియాను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాడు. వికెట్కీపర్గా మహీ సరికొత్త ట్రెండ్ సృష్టించాడు. మొత్తంగా క్రికెట్ చరిత్రలోనే ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.-రవిశాస్త్రి, టీమ్ఇండియా కోచ్
గతేడాది వన్డే ప్రపంచకప్ న్యూజిలాండ్తో జరిగిన సెమీస్లో చివరగా కనిపించిన ధోనీ.. అనంతరం ఆటకు తాత్కాలిక విరామం ప్రకటించాడు. అనేక ఊహాగానాల మధ్య ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు.
ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మహీ ఒకడు
టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కూడా ధోనీపై ప్రశంసలు కురిపించాడు. క్రికెట్ చరిత్రలోనే ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మహీ ఒకడని అన్నాడు. అతడికంటూ ఓ ప్రత్యేక శైలి ఉందని, బలమైన జట్టును రూపొందించే సామర్థ్యం ఉన్న నాయకుడని ప్రశంసించాడు. జాతీయ జట్టులో మిస్ అయినప్పటికీ ఐపీఎల్లో తమతోనే ఉంటాడని అన్నాడు. సెప్టెంబరు 19ను ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లో కలుద్దాం మహీ అంటూ ట్వీట్ చేశాడు.
-
One of the most influential man in the history of Indian cricket👏His impact in & around cricket was massive. He was a man with vision and a master in knowing how to build a team. Will surely miss him in blue but we have him in yellow.
— Rohit Sharma (@ImRo45) August 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
See you on 19th at the toss @msdhoni 👍😁 pic.twitter.com/kR0Lt1QdhG
">One of the most influential man in the history of Indian cricket👏His impact in & around cricket was massive. He was a man with vision and a master in knowing how to build a team. Will surely miss him in blue but we have him in yellow.
— Rohit Sharma (@ImRo45) August 16, 2020
See you on 19th at the toss @msdhoni 👍😁 pic.twitter.com/kR0Lt1QdhGOne of the most influential man in the history of Indian cricket👏His impact in & around cricket was massive. He was a man with vision and a master in knowing how to build a team. Will surely miss him in blue but we have him in yellow.
— Rohit Sharma (@ImRo45) August 16, 2020
See you on 19th at the toss @msdhoni 👍😁 pic.twitter.com/kR0Lt1QdhG
దుబాయ్ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు బయోసెక్యూర్ వాతావరణంలో ఐపీఎల్ జరగనుంది. ఆగస్టు 21 యూఏఈకి బయలుదేరనుంది ధోనీ ప్రాతినిథ్యం వహిస్తోన్న సీఎస్కే బృందం. అనంతరం మిగతా జట్లు కూడా వెళ్లనున్నాయి.