ETV Bharat / sports

'అక్షర్‌.. నీ కళ్లద్దాలు ఎక్కడ దొరుకుతాయ్‌'

author img

By

Published : Mar 6, 2021, 7:20 PM IST

Updated : Mar 6, 2021, 7:51 PM IST

ఇంగ్లాండ్​తో జరిగిన టెస్ట్ సిరీస్​లో భారత్​ విజయం సాధించిన నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ఫన్నీ ట్వీట్ చేశారు. టీమ్​ విజయాన్ని ఆనందించేందుకు ఆయనకు అక్షర్​ లాంటి కళ్లద్దాలు కావాలని అన్నారు.

Anand Mahindra wants sunglasses worn by Axar Patel
'అక్షర్‌.. నీ కళ్లద్దాలు ఎక్కడ దొరుకుతాయ్‌'

సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా.. వర్తమాన వ్యవహారాలపై ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందిస్తుంటారు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో టీమిండియా ఘన విజయం సాధించడంపై అభినందనలు తెలిపిన ఆయన.. ఓ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. మ్యాచ్‌లో స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ పెట్టుకున్న సన్‌ గ్లాసెస్‌ చూసి ముచ్చటపడిన మహీంద్రా.. అవి ఎక్కడ దొరుకుతాయో చెప్పాలని కోరారు.

"ఓకే.. దుమ్ములేపారు. సిరీస్‌ను జేబులో వేసుకున్నారు. అభినందనలు. ఇప్పుడు ఈ విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకునేందుకు నాకు ఈ చలువ కళ్లద్దాలు(అక్షర్‌ పెట్టుకున్నవి) కావాలి. అవి ఏ బ్రాండ్‌? ఎక్కడ దొరుకుతాయ్‌?"అని మహీంద్రా ట్వీట్‌ చేశారు.

ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ తేడాతో గెలిచి 3-1తో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకోవడమేగాక, ఐసీసీ టెస్టు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో అక్షర్‌ మరోసారి ఐదు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు అహ్మదాబాద్‌లో జరిగిన మూడో టెస్టులో 11 వికెట్లు పడగొట్టి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఇదీ చదవండి:టీమ్​ఇండియా విజయంపై ప్రముఖులు, మాజీల ప్రశంసలు

సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా.. వర్తమాన వ్యవహారాలపై ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందిస్తుంటారు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో టీమిండియా ఘన విజయం సాధించడంపై అభినందనలు తెలిపిన ఆయన.. ఓ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. మ్యాచ్‌లో స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ పెట్టుకున్న సన్‌ గ్లాసెస్‌ చూసి ముచ్చటపడిన మహీంద్రా.. అవి ఎక్కడ దొరుకుతాయో చెప్పాలని కోరారు.

"ఓకే.. దుమ్ములేపారు. సిరీస్‌ను జేబులో వేసుకున్నారు. అభినందనలు. ఇప్పుడు ఈ విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకునేందుకు నాకు ఈ చలువ కళ్లద్దాలు(అక్షర్‌ పెట్టుకున్నవి) కావాలి. అవి ఏ బ్రాండ్‌? ఎక్కడ దొరుకుతాయ్‌?"అని మహీంద్రా ట్వీట్‌ చేశారు.

ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ తేడాతో గెలిచి 3-1తో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకోవడమేగాక, ఐసీసీ టెస్టు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో అక్షర్‌ మరోసారి ఐదు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు అహ్మదాబాద్‌లో జరిగిన మూడో టెస్టులో 11 వికెట్లు పడగొట్టి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఇదీ చదవండి:టీమ్​ఇండియా విజయంపై ప్రముఖులు, మాజీల ప్రశంసలు

Last Updated : Mar 6, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.