ETV Bharat / sports

ఆపత్కాలంలో దేశానికి అండగా క్రికెటర్లు!

author img

By

Published : Apr 30, 2021, 10:44 PM IST

కొవిడ్​తో అల్లాడుతున్న భారత్​కు పలువురు క్రికెటర్లు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ ఆపత్కాల సమయంలో తమ వంతు సాయం ప్రకటిస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ మీడియా అసోసియేషన్, భారత ఓపెనర్​ ధావన్​తో పాటు జైదేవ్​ ఉనద్కత్​ తమ పెద్ద మనసును చాటుకున్నారు.

jaydev unadkat, shikhar dhawan, australia cricket association
జైదేవ్ ఉనద్కత్, శిఖర్ ధావన్, ఆస్ట్రేలియా క్రికెట్ మీడియా అసోసియేషన్

కరోనాతో పోరాడుతున్న భారత్​కు పలువురు క్రికెటర్లు విరాళాలు అందిస్తూ.. తమ వంతు సాయం చేస్తున్నారు. తాజాగా టీమ్​ఇండియా ఓపెనర్​ శిఖర్​ ధావన్​తో పాటు బౌలర్​ జైదేవ్​ ఉనద్కత్ సాయం ప్రకటించారు. వీరితో పాటు ఆస్ట్రేలియా క్రికెట్ మీడియా అసోసియేషన్ కూడా విరాళం ఇచ్చింది.

  • దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా కోసం ఉద్దేశించిన 'మిషన్​ ఆక్సిజన్'కు.. శిఖర్​ రూ.20 లక్షలతో పాటు మ్యాచ్​ల అనంతరం వచ్చే అవార్డుల మొత్తాన్ని సాయంగా ఇస్తున్నట్లు తెలిపాడు.
  • మరో ఆటగాడు జైదేవ్ ఉనద్కత్​ తన ఐపీఎల్​ జీతంలో 10 శాతాన్ని దేశంలోని వైద్య నిత్యవసరాలకు ఇవ్వనున్నట్లు పేర్కొన్నాడు.
  • ఆస్ట్రేలియా క్రికెట్​ మీడియా అసోసియేషన్​ కూడా దేశానికి బాసటగా నిలిచింది. రూ.31 లక్షలను విరాళంగా ప్రకటించింది.
  • 250లకుపైగా యువకులు ఈ మిషన్​ ఆక్సిజన్​ను స్థాపించారు. ఇందులో వచ్చిన విరాళాలను దేశవ్యాప్తంగా కావాల్సిన ఆక్సిజన్ కాన్సన్రేటర్స్​ కోసం వెచ్చించనున్నారు. ​ ​

కరోనాతో పోరాడుతున్న భారత్​కు పలువురు క్రికెటర్లు విరాళాలు అందిస్తూ.. తమ వంతు సాయం చేస్తున్నారు. తాజాగా టీమ్​ఇండియా ఓపెనర్​ శిఖర్​ ధావన్​తో పాటు బౌలర్​ జైదేవ్​ ఉనద్కత్ సాయం ప్రకటించారు. వీరితో పాటు ఆస్ట్రేలియా క్రికెట్ మీడియా అసోసియేషన్ కూడా విరాళం ఇచ్చింది.

  • దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా కోసం ఉద్దేశించిన 'మిషన్​ ఆక్సిజన్'కు.. శిఖర్​ రూ.20 లక్షలతో పాటు మ్యాచ్​ల అనంతరం వచ్చే అవార్డుల మొత్తాన్ని సాయంగా ఇస్తున్నట్లు తెలిపాడు.
  • మరో ఆటగాడు జైదేవ్ ఉనద్కత్​ తన ఐపీఎల్​ జీతంలో 10 శాతాన్ని దేశంలోని వైద్య నిత్యవసరాలకు ఇవ్వనున్నట్లు పేర్కొన్నాడు.
  • ఆస్ట్రేలియా క్రికెట్​ మీడియా అసోసియేషన్​ కూడా దేశానికి బాసటగా నిలిచింది. రూ.31 లక్షలను విరాళంగా ప్రకటించింది.
  • 250లకుపైగా యువకులు ఈ మిషన్​ ఆక్సిజన్​ను స్థాపించారు. ఇందులో వచ్చిన విరాళాలను దేశవ్యాప్తంగా కావాల్సిన ఆక్సిజన్ కాన్సన్రేటర్స్​ కోసం వెచ్చించనున్నారు. ​ ​

ఇవీ చదవండి: 'భారత్​లోనే టీ20 ప్రపంచ కప్.. వేదికలు నాలుగే​!'

డబ్ల్యూబీసీ ఛాంపియన్​షిప్ పోటీలు వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.