ETV Bharat / sports

'బీసీసీఐ.. నాకు కూడా బాకీ ఉంది' - kochi tuskers kerala

క్రికెటర్లకు చెల్లింపుల వ్యవహారంలో బీసీసీఐ ఆలస్యం చేస్తుందంటూ ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆసీస్ మాజీ క్రికెటర్​ బ్రాడ్ హాగ్​ స్పందించాడు. ఐపీఎల్​లో భాగంగా తమకు కూడా పదేళ్ల క్రితం నాటి డబ్బులు రావాల్సి ఉందని ట్విట్టర్​ వేదికగా పేర్కొన్నాడు.

Brad Hodge, former australia cricketer
బ్రాడ్ హాగ్​, ఆసీస్ మాజీ క్రికెటర్
author img

By

Published : May 24, 2021, 9:10 PM IST

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్​​.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై సంచలనాత్మక వ్యాఖ్యలు చేశాడు. "ఐపీఎల్​లో భాగంగా నాకు పదేళ్ల క్రితం నాటి బకాయిలు రావాల్సి ఉంది.. అవి రావడానికి ప్రస్తుతానికి ఏదైనా అవకాశం ఉందా? బీసీసీఐ" అంటూ ట్వీట్ చేశాడు. 2011లో కొచ్చి టస్కర్స్ కేరళకు ప్రాతినిధ్యం వహించాడు హాగ్​.

భారత మహిళా క్రికెటర్లకు గతేడాది ప్రపంచకప్​కు సంబంధించి రన్నరప్ ప్రైజ్​మనీ రావాల్సి ఉందని ఓ ప్రముఖ ఛానల్ కథనం ప్రచురించింది. చెల్లింపుల విషయంలో మహిళా, పురుష క్రికెటర్ల మధ్య అసమానతలు ఉన్నాయంటూ అందులో వెల్లడించింది. ఈ విషయం వైరల్​గా మారింది. దీంతో త్వరలోనే వారికి ఆ ప్రైజ్​మనీని చెల్లిస్తామని బోర్డు అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆసీస్ ఆటగాడు తాజాగా ఈ వ్యాఖ్యలు చేశాడు.

  • Players are still owed 35% of their money earned from ten years ago from the @IPL representing Kochi tuskers. Any chance @BCCI could locate that money?

    — Brad Hodge (@bradhodge007) May 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఐపీఎల్​ ప్రారంభ సీజన్ నుంచి వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు హాగ్​​. 2011లో కొచ్చి టస్కర్స్​ కేరళకు ఆడిన అతడు​.. అప్పుడు కొచ్చి జట్టుకు ఆడిన ఆటగాళ్లకు చెల్లించాల్సిన మొత్తంలో 35 శాతం రావాల్సి ఉందని ట్విట్టర్​ వేదికగా స్పందించాడు. కోల్​కతాతో పాటు బెంగళూరు, కొచ్చి జట్లకు ఆడిన హడ్జ్.. మొత్తం 66 మ్యాచ్​లాడాడు. 1400 పరుగులు సాధించడమే కాకుండా 17 వికెట్లు తీశాడు.

ఇదీ చదవండి: ఫస్ట్​ క్లాస్​ ప్లేయర్లకు 'రంజీ' పరిహారం ఎప్పుడో?

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్​​.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై సంచలనాత్మక వ్యాఖ్యలు చేశాడు. "ఐపీఎల్​లో భాగంగా నాకు పదేళ్ల క్రితం నాటి బకాయిలు రావాల్సి ఉంది.. అవి రావడానికి ప్రస్తుతానికి ఏదైనా అవకాశం ఉందా? బీసీసీఐ" అంటూ ట్వీట్ చేశాడు. 2011లో కొచ్చి టస్కర్స్ కేరళకు ప్రాతినిధ్యం వహించాడు హాగ్​.

భారత మహిళా క్రికెటర్లకు గతేడాది ప్రపంచకప్​కు సంబంధించి రన్నరప్ ప్రైజ్​మనీ రావాల్సి ఉందని ఓ ప్రముఖ ఛానల్ కథనం ప్రచురించింది. చెల్లింపుల విషయంలో మహిళా, పురుష క్రికెటర్ల మధ్య అసమానతలు ఉన్నాయంటూ అందులో వెల్లడించింది. ఈ విషయం వైరల్​గా మారింది. దీంతో త్వరలోనే వారికి ఆ ప్రైజ్​మనీని చెల్లిస్తామని బోర్డు అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆసీస్ ఆటగాడు తాజాగా ఈ వ్యాఖ్యలు చేశాడు.

  • Players are still owed 35% of their money earned from ten years ago from the @IPL representing Kochi tuskers. Any chance @BCCI could locate that money?

    — Brad Hodge (@bradhodge007) May 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఐపీఎల్​ ప్రారంభ సీజన్ నుంచి వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు హాగ్​​. 2011లో కొచ్చి టస్కర్స్​ కేరళకు ఆడిన అతడు​.. అప్పుడు కొచ్చి జట్టుకు ఆడిన ఆటగాళ్లకు చెల్లించాల్సిన మొత్తంలో 35 శాతం రావాల్సి ఉందని ట్విట్టర్​ వేదికగా స్పందించాడు. కోల్​కతాతో పాటు బెంగళూరు, కొచ్చి జట్లకు ఆడిన హడ్జ్.. మొత్తం 66 మ్యాచ్​లాడాడు. 1400 పరుగులు సాధించడమే కాకుండా 17 వికెట్లు తీశాడు.

ఇదీ చదవండి: ఫస్ట్​ క్లాస్​ ప్లేయర్లకు 'రంజీ' పరిహారం ఎప్పుడో?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.