ETV Bharat / sports

ఆస్ట్రేలియా ఆటగాళ్ల క్రికెట్ కిట్ దొంగలు ఎత్తుకుపోయారట! - ఆస్ట్రేలియా క్రికెట్ వార్తలు

ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఎదురైన సంఘటన వింటే.. ముక్కుపై వేలేసుకోవాల్సిందే!. మ్యాచ్​కు ముందే ఆటగాళ్ల ఆటసామగ్రిని దొంగలు ఎత్తుకుపోయారట. క్వీన్స్​లాండ్ ఆటగాళ్లకు సంబంధించిన క్రికెట్ కిట్లను దోచుకున్నారట.

cricket news
ఆస్ట్రేలియా క్రికెట్ న్యూస్
author img

By

Published : Oct 5, 2021, 2:11 PM IST

ఆస్ట్రేలియా క్రికెట్​ ఆటగాళ్లకు వింత సంఘటన ఎదురైంది. మ్యాచ్​ ఆడటానికి వెళ్లగా.. వారి క్రికెట్ కిట్​ను కొందరు దొంగలు దొంగిలించారట!. వినడానికి కాస్త హాస్యాస్పదంగా ఉన్నా ఇది నిజమేనట. తమ బ్యాట్, బంతుల్ని కోల్పోయిన జట్టు కీపర్​ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

క్వీన్స్​లాండ్​ దక్షిణ ఆస్ట్రేలియాలోని ఓ రాష్ట్రం. ఈ స్టేట్​కు చెందిన ఆటగాళ్లకు టస్మేనియా అనే మరో రాష్ట్ర ఆటగాళ్లకు మధ్య పోరు జరగాల్సి ఉంది. మ్యాచ్​ నేపథ్యంలో ఆ ప్రాంతానికి చేరిన క్వీన్స్​లాండ్ ఆటగాళ్లు తాము బసచేసే హోటల్ ముందు ఆట సామగ్రి ఉన్న వ్యాన్​ను నిలిపి ఉంచారు. అంతలోనే కొందరు దొంగలు వ్యాన్ కిటికీలను పగులగొట్టి కొన్ని ఆట వస్తువులతో పరారయ్యారు. మ్యాచ్ ప్రారంభానికి కాస్త ముందు జరిగిన ఈ సంఘటన ఆటగాళ్లను కలవరపెట్టింది.

ఆటగాళ్ల ఫిర్యాదుతో.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు. గతవారం జరగాల్సిన మ్యాచ్​ కరోనా కేసుల కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం కూడా అవాంతరాలు ఎదురవటం వల్ల క్రీడాకారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇదీ చదవండి:అద్భుత విజయం: పంత్.. ధాటిగా ఆడలేకపోయాం: ధోనీ

ఆస్ట్రేలియా క్రికెట్​ ఆటగాళ్లకు వింత సంఘటన ఎదురైంది. మ్యాచ్​ ఆడటానికి వెళ్లగా.. వారి క్రికెట్ కిట్​ను కొందరు దొంగలు దొంగిలించారట!. వినడానికి కాస్త హాస్యాస్పదంగా ఉన్నా ఇది నిజమేనట. తమ బ్యాట్, బంతుల్ని కోల్పోయిన జట్టు కీపర్​ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

క్వీన్స్​లాండ్​ దక్షిణ ఆస్ట్రేలియాలోని ఓ రాష్ట్రం. ఈ స్టేట్​కు చెందిన ఆటగాళ్లకు టస్మేనియా అనే మరో రాష్ట్ర ఆటగాళ్లకు మధ్య పోరు జరగాల్సి ఉంది. మ్యాచ్​ నేపథ్యంలో ఆ ప్రాంతానికి చేరిన క్వీన్స్​లాండ్ ఆటగాళ్లు తాము బసచేసే హోటల్ ముందు ఆట సామగ్రి ఉన్న వ్యాన్​ను నిలిపి ఉంచారు. అంతలోనే కొందరు దొంగలు వ్యాన్ కిటికీలను పగులగొట్టి కొన్ని ఆట వస్తువులతో పరారయ్యారు. మ్యాచ్ ప్రారంభానికి కాస్త ముందు జరిగిన ఈ సంఘటన ఆటగాళ్లను కలవరపెట్టింది.

ఆటగాళ్ల ఫిర్యాదుతో.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు. గతవారం జరగాల్సిన మ్యాచ్​ కరోనా కేసుల కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం కూడా అవాంతరాలు ఎదురవటం వల్ల క్రీడాకారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇదీ చదవండి:అద్భుత విజయం: పంత్.. ధాటిగా ఆడలేకపోయాం: ధోనీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.