ETV Bharat / sports

డిసెంబరు 9 నుంచి​ 'యాషెస్​'.. కానీ!

author img

By

Published : May 13, 2021, 3:36 PM IST

'యాషెస్​'.. ఈ ఏడాది డిసెంబరు 9 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. అయితే ఈ సిరీస్​లోని ఫైనల్​ మ్యాచ్​ వేదిక ఈసారి మారనున్నట్లు తెలుస్తోంది.

ashes
యాషెస్​

ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్​ మధ్య జరిగే యాషెస్​ టెస్టు​(2021-22) సిరీస్.. ఈ ఏడాది డిసెంబరు 9 నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. సాధారణంగా సిడ్నీ వేదికగా జరిగే ఈ సిరీస్​ ఫైనల్(ఐదో టెస్టు)​ ఈ సారి పెర్త్​లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఈ మ్యాచ్​ ప్రారంభమవచ్చు. ఒకవేళ ఇలా జరిగితే 26 ఏళ్ల యాషెస్ చరిత్రలో ఐదో మ్యాచ్​ వేదిక మారడం ఇదే తొలిసారి అవుతుంది.

ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య ప్రతి రెండేళ్లకొకసారి జరిగే సిరీస్​ను యాషెస్​గా అభివర్ణిస్తారు. దీనికి క్రికెట్ చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉంది. దేశ ప్రతిష్ఠగా భావించే ఈ సిరీస్​లో ఇరుజట్లు ఐదు టెస్టులు ఆడతాయి. ఈ సీజన్​లో తొలి మ్యాచ్​(గబ్బా), రెండోది(అడిలైడ్​), మూడు(మెల్​బోర్న్), నాలుగు(సిడ్నీ)లో జరగనున్నాయి. ​

ఈ ఏడాది నవంబరులో ఆస్ట్రేలియా అప్ఘానిస్థాన్​తో సొంతగడ్డపై సిరీస్​ ఆడనుంది. కాబట్టి యాషెస్​కు ముందు ఈ సిరీస్ వారికి వార్మప్​​గా ఉపయోగపడుతుంది. 2019 యాషెస్​ 2-2 తేడాతో డ్రాగా ముగిసింది. గత 47 ఏళ్లలో యాషెస్ డ్రా కావడం అదే తొలిసారి.

ఇదీ చూడండి: 'ధ్యాస మళ్లించడంలో టీమ్​ఇండియా దిట్ట'

ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్​ మధ్య జరిగే యాషెస్​ టెస్టు​(2021-22) సిరీస్.. ఈ ఏడాది డిసెంబరు 9 నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. సాధారణంగా సిడ్నీ వేదికగా జరిగే ఈ సిరీస్​ ఫైనల్(ఐదో టెస్టు)​ ఈ సారి పెర్త్​లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఈ మ్యాచ్​ ప్రారంభమవచ్చు. ఒకవేళ ఇలా జరిగితే 26 ఏళ్ల యాషెస్ చరిత్రలో ఐదో మ్యాచ్​ వేదిక మారడం ఇదే తొలిసారి అవుతుంది.

ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య ప్రతి రెండేళ్లకొకసారి జరిగే సిరీస్​ను యాషెస్​గా అభివర్ణిస్తారు. దీనికి క్రికెట్ చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉంది. దేశ ప్రతిష్ఠగా భావించే ఈ సిరీస్​లో ఇరుజట్లు ఐదు టెస్టులు ఆడతాయి. ఈ సీజన్​లో తొలి మ్యాచ్​(గబ్బా), రెండోది(అడిలైడ్​), మూడు(మెల్​బోర్న్), నాలుగు(సిడ్నీ)లో జరగనున్నాయి. ​

ఈ ఏడాది నవంబరులో ఆస్ట్రేలియా అప్ఘానిస్థాన్​తో సొంతగడ్డపై సిరీస్​ ఆడనుంది. కాబట్టి యాషెస్​కు ముందు ఈ సిరీస్ వారికి వార్మప్​​గా ఉపయోగపడుతుంది. 2019 యాషెస్​ 2-2 తేడాతో డ్రాగా ముగిసింది. గత 47 ఏళ్లలో యాషెస్ డ్రా కావడం అదే తొలిసారి.

ఇదీ చూడండి: 'ధ్యాస మళ్లించడంలో టీమ్​ఇండియా దిట్ట'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.