ETV Bharat / sports

భారత షట్లర్ల కోసం బాయ్‌ ప్రత్యేక ఏర్పాట్లు

author img

By

Published : Apr 30, 2021, 8:13 AM IST

త్వరలో జరగబోయే మలేసియా, సింగపూర్​ టోర్నీల్లో భారత షట్లర్లు పాల్గొనేందుకు వీలుగా భారత బ్యాడ్మింటన్​ సంఘం(బాయ్​) ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది. భారత్​ నుంచి విమానాల రాకపోకలు ఆయా దేశాలు నిలిపేయడం వల్ల మరో దేశానికి వీరందర్ని పంపి.. అక్కడి నుంచి మలేసియా, సింగపూర్​ వెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది బాయ్​.

Saina, Srikanth likely to travel to Olympic qualifiers via Doha
భారత షట్లర్ల కోసం బాయ్‌ ప్రత్యేక ఏర్పాట్లు

అగ్రశ్రేణి షట్లర్లు సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌ల టోక్యో ఒలింపిక్స్‌ అర్హత అవకాశాలు దెబ్బతినకుండా భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) చర్యలు చేపట్టింది. మలేసియా, సింగపూర్‌ టోర్నీల్లో పాల్గొనేందుకు భారత క్రీడాకారుల కోసం బాయ్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది.

ఒలింపిక్స్‌ అర్హతకు ఈ రెండు టోర్నీలే చివరివి కావడం.. కరోనా తీవ్రత దృష్ట్యా భారత ప్రయాణికులపై రెండు దేశాలు నిషేధం విధించడం వల్ల సైనా, శ్రీకాంత్‌లలో ఆందోళన మొదలైంది. మే 25 నుంచి 30 వరకు మలేసియా ఓపెన్‌, జూన్‌ 1 నుంచి 6 వరకు సింగపూర్‌ ఓపెన్‌ జరుగనున్నాయి. భారత్‌ నుంచి పి.వి.సింధు, సైనా, సాయిప్రణీత్‌, శ్రీకాంత్‌, సాత్విక్‌ సాయిరాజు, చిరాగ్‌ శెట్టి, సిక్కిరెడ్డి, అశ్విని పొన్నప్ప ఈ టోర్నీల్లో బరిలో ఉన్నారు.

"ప్రస్తుత ఆంక్షల ప్రకారం భారత క్రీడాకారులు నేరుగా వెళ్లడానికి వీల్లేదు. శ్రీలంక, దోహా వంటి ఇతర ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్లొచ్చు. భారత క్రీడాకారులు ఖతార్‌ నుంచి వెళ్లే అవకాశముంది. నిబంధనల ప్రకారం భారత క్రీడాకారులు సింగపూర్‌లో అడుగుపెట్టాలంటే మరో దేశంలో 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. లేదంటే సింగపూర్‌లోనే 21 రోజులు క్వారంటైన్‌ తప్పనిసరి. మలేసియాలో 14 రోజుల క్వారంటైన్‌ నిబంధన ఉంది. ఈలెక్కన మే 10న భారత క్రీడాకారులు మలేసియా చేరుకోవాలి" అని బాయ్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇదీ చూడండి.. సీఎస్కే టీమ్​ మెంబర్​ అంత పనిచేశాడా?

అగ్రశ్రేణి షట్లర్లు సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌ల టోక్యో ఒలింపిక్స్‌ అర్హత అవకాశాలు దెబ్బతినకుండా భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) చర్యలు చేపట్టింది. మలేసియా, సింగపూర్‌ టోర్నీల్లో పాల్గొనేందుకు భారత క్రీడాకారుల కోసం బాయ్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది.

ఒలింపిక్స్‌ అర్హతకు ఈ రెండు టోర్నీలే చివరివి కావడం.. కరోనా తీవ్రత దృష్ట్యా భారత ప్రయాణికులపై రెండు దేశాలు నిషేధం విధించడం వల్ల సైనా, శ్రీకాంత్‌లలో ఆందోళన మొదలైంది. మే 25 నుంచి 30 వరకు మలేసియా ఓపెన్‌, జూన్‌ 1 నుంచి 6 వరకు సింగపూర్‌ ఓపెన్‌ జరుగనున్నాయి. భారత్‌ నుంచి పి.వి.సింధు, సైనా, సాయిప్రణీత్‌, శ్రీకాంత్‌, సాత్విక్‌ సాయిరాజు, చిరాగ్‌ శెట్టి, సిక్కిరెడ్డి, అశ్విని పొన్నప్ప ఈ టోర్నీల్లో బరిలో ఉన్నారు.

"ప్రస్తుత ఆంక్షల ప్రకారం భారత క్రీడాకారులు నేరుగా వెళ్లడానికి వీల్లేదు. శ్రీలంక, దోహా వంటి ఇతర ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్లొచ్చు. భారత క్రీడాకారులు ఖతార్‌ నుంచి వెళ్లే అవకాశముంది. నిబంధనల ప్రకారం భారత క్రీడాకారులు సింగపూర్‌లో అడుగుపెట్టాలంటే మరో దేశంలో 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. లేదంటే సింగపూర్‌లోనే 21 రోజులు క్వారంటైన్‌ తప్పనిసరి. మలేసియాలో 14 రోజుల క్వారంటైన్‌ నిబంధన ఉంది. ఈలెక్కన మే 10న భారత క్రీడాకారులు మలేసియా చేరుకోవాలి" అని బాయ్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇదీ చూడండి.. సీఎస్కే టీమ్​ మెంబర్​ అంత పనిచేశాడా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.