ETV Bharat / sports

అనితర సాధ్యురాలు.. పీవీ సింధు

టోక్యోలో గెలిచేదెవరు..? పతకాలతో మెరిసేదెవరు..? దేశాన్ని ఆనందంలో ముంచేదెవరు..? కొంతకాలంగా ఇలా ఎన్నెన్నో చర్చలు.. ఆశలు.. అంచనాలు..! కచ్చితంగా పతకం తెచ్చేదెవరు అంటే మాత్రం అందరి నమ్మకం తెలుగమ్మాయి పి.వి. సింధుపైనే. ఆమె పసిడి ముద్దాడితే చూడాలని దేశమంతా ఎంతగానో ఎదురుచూసింది. ఆ మధుర స్వప్నం సాకారం కాలేదు కానీ.. 135 కోట్ల మంది తనపై పెట్టుకున్న నమ్మకాన్ని మాత్రం సింధు వమ్ముకానివ్వలేదు. కాంస్య పోరులో ఆధిపత్యం చలాయించి ఒలింపిక్స్‌లో రెండో పతకాన్ని ఖాతాలో వేసుకుంది. దేశానికి టోక్యో ఒలింపిక్స్‌లో రెండో పతకాన్ని అందించింది.

author img

By

Published : Aug 2, 2021, 7:27 AM IST

pv sindu
పీవీ సింధు

'నేను ట్రెండ్‌ ఫాలో అవ్వను.. ట్రెండ్‌ సెట్‌ చేస్తా' ఓ సినిమాలో కథానాయకుడి డైలాగ్‌ ఇది. సినిమాలో డైలాగ్‌ పేల్చడానికి బాగానే ఉంటుంది కానీ.. నిజ జీవితంలో ఈ మాటను నిజం చేయడం అంత తేలిక కాదు. అందులోనూ ఓ అమ్మాయి.. పైగా ఆటల్లో.. అంటే అది మరీ కష్టం. ఇక ఆ అమ్మాయి ఎంచుకున్న ఆటలో అప్పటికే ఓ క్రీడాకారిణి తిరుగులేని స్థాయిని అందుకుని ప్రపంచ వేదికపై అద్భుత విజయాలతో దూసుకెళ్తున్నపుడు.. ఆమెకు చేరువగా వెళ్లడమే మిగతా క్రీడాకారుల లక్ష్యం అయినపుడు.. ఆ అగ్రశ్రేణి ప్లేయర్‌ను దాటి ముందుకెళ్లడం.. ఊహకైనా అందని విజయాలందుకోవడం.. ఆటలో కొత్త ప్రమాణాలు నెలకొల్పడం.. తన ఆటను దాటి దేశ క్రీడా చరిత్రలోనే అత్యుత్తమ అథ్లెట్లలో ఒకరిగా పేరు తెచ్చుకోవడం సామాన్య విషయమా? ఇది కదా ట్రెండ్‌ సెట్‌ చేయడం అంటే. మన సింధు చేసిందదే.

pv sindu
ఒలింపిక్​లో పతకాలు సాధించిన ముగ్గురు క్రీడాకారిణులు

ప్రపంచ ఛాంపియన్‌ పూసర్ల వెంకట సింధు సాధించింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకాన్ని అందించింది. స్వర్ణం సాధ్యంకాకపోయినా కాంస్య పతకంతో సత్తాచాటింది. ఆదివారం ఏకపక్ష పోరులో ఆరో సీడ్‌ సింధు 21-13, 21-15తో 8వ సీడ్‌ బింగ్జియావో (చైనా)ను ఓడించింది. వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించింది

అస్త్రాలన్నింటినీ..: స్వర్ణం సాధించే అవకాశాన్ని కోల్పోయిన సింధు కాంస్య పతకం కోసం ప్రాణం పెట్టింది. బింగ్జియావోతో పోరులో అన్ని అస్త్రాలను సంధించింది. పతకం తప్ప మరో ఆలోచన లేకుండా ఆడింది. 52 నిమిషాల పాటు సాగిన పోరులో అత్యుత్తమ ఫిట్‌నెస్‌తో అదరగొట్టింది. అటాకింగ్‌, నెట్‌ గేమ్‌లలో సింధుకు ప్రత్యర్థి పోటీగానే కనిపించలేదు. సింధు స్మాష్‌లు, క్రాస్‌కోర్ట్‌ షాట్‌లకు బింగ్జియావో దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ఎడమచేతి వాటం బింగ్జియావో బ్యాక్‌హ్యాండ్‌ను సింధు లక్ష్యంగా చేసుకుంది. ర్యాలీ గేమ్‌లోనూ వైవిధ్యం చూపించింది. సింధు నైపుణ్యం, ఫిట్‌నెస్‌ ముందు బింగ్జియావో పూర్తిగా తేలిపోయింది. మొదటి పాయింటు నుంచే పతకం సాధించాలన్న పట్టుదలను సింధు కనబరిచింది. తొలి గేమ్‌లో వరుసగా 4 పాయింట్లతో సత్తాచాటింది. అయితే సింధు అనవసర తప్పిదాలు ప్రత్యర్థికి లాభించాయి. షటిల్‌ను నెట్‌కు ఆడేయడం.. కోర్ట బయటకు కొట్టడంతో ప్రత్యర్థి రేసులోకి వచ్చింది. 6-6తో పాయింట్లను సమం చేసింది. వెంటనే తేరుకున్న సింధు ఒక్కసారిగా గేరు మార్చింది. స్మాష్‌లతో విరుచుకుపడింది. 11-8తో ఆధిక్యంలోకి వెళ్లిన భారత స్టార్‌ అక్కడ్నుంచి వెనుదిరిగి చూడలేదు. స్మాష్‌లు, క్రాస్‌కోర్ట్‌, డ్రాప్‌ షాట్లతో ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. తనపై 9-6తో మెరుగైన గెలుపోటముల రికార్డున్న బింగ్జియావోను సింధు అనామక క్రీడాకారిణిగా మార్చేసింది. షటిల్‌పై పూర్తి నియంత్రణతో కోర్టు నలువైపులా పాయింట్లు రాబట్టి 21-13తో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది.

రెండో గేమ్‌లోనూ బింగ్జియావో పోటీ ఇవ్వలేకపోయింది. రెట్టించిన దూకుడుతో కనిపించిన సింధు వరుస పాయింట్లతో హోరెత్తించింది. 5-2తో ముందంజ వేసిన సింధు క్రాస్‌కోర్ట్‌ స్మాష్‌ సంధించి 11-9 మరింత ముందుకెళ్లింది. ఈ సమయంలో సింధు 2 అనవసర తప్పిదాలు చేయడంతో 11-11తో స్కోరు సమమైంది. ఆ తర్వాత నుంచి ఆటంతా సింధుదే. స్మాష్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. 17-14తో ఆధిక్యం లభించినప్పుడు సింధు గర్జనతో స్టేడియం హోరెత్తింది. స్మాష్‌తో 20-15తో మ్యాచ్‌కు చేరువైన సింధు క్రాస్‌కోర్ట్‌ షాట్‌తో 21-15తో రెండో గేమ్‌ను, మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. అనంతరం రెండు చేతులు పైకెత్తి సింహనాదం చేసింది. కోచ్‌ పార్క్‌ను హత్తుకుని సంబరాలు చేసుకుంది.

pv sindu
పీవీ సింధు

"ఒలింపిక్స్‌ కోసం ఎంతగానో కష్టపడ్డా. పతకం గెలిచినందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు నాలో భిన్నమైన భావోద్వేగాలు ఉన్నాయి. కాంస్య నెగ్గినందుకు ఆనంద పడాలో.. ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశం చేజారినందుకు బాధ పడాలో తెలియట్లేదు. ఈ మ్యాచ్‌కు ముందు నా భావోద్వేగాల్ని పక్కనబెట్టా. నూటికి నూరు శాతం ప్రదర్శన ఇవ్వాలని భావించా. శనివారం సెమీఫైనల్స్‌లో నేను, బింగ్జియావో ఓడిపోయాం. ఆదివారం కచ్చితంగా గెలవాలనే బరిలో దిగాం. ఒలింపిక్స్‌లో దేశానికి పతకం అందించడం ఇద్దరికీ ముఖ్యమే. అదంత సులువేమీ కాదు. మ్యాచ్‌లో బింగ్జియావో గట్టి పోటీనిచ్చింది. నేను ఓపికగా, ప్రశాంతంగా ఆడా. ఆధిక్యంలో ఉన్నా కూడా ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకోలేదు. నేను బాగా ఆడాననే అనుకుంటున్నా. దేశానికి పతకం అందించడం గర్వంగా ఉంది. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకం గెలవడంతో మేఘాల్లో తేలిపోతున్నట్లుగా ఉంది. ఈ క్షణాల్ని ఆస్వాదిస్తున్నా. నా కోసం కుటుంబమంతా చాలా కష్టపడింది. ఎన్నో త్యాగాలు చేశారు. వారికి ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటా. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో కచ్చితంగా బరిలో దిగుతా."

- సింధు

"2016 (రజతం), 2020 (కాంస్యం). సింధు.. భారత్‌కు రెండు ఒలింపిక్స్‌ పతకాలు అందించడం ఓ గొప్ప ఘనత. నువ్వు దేశాన్ని ఎంతో గర్వపడేలా చేశావు’"

- సచిన్‌

"వరుసగా రెండు ఒలింపిక్స్‌ల్లో పతకాలు గెలిచిన నీ (సింధు) పట్ల గర్వపడుతున్నా. కచ్చితంగా అద్భుత ప్రదర్శన చేశావ్‌. గొప్పగా ఆడావ్‌’"

- కరణం మల్లీశ్వరి

నాన్నకు బహుమతిగా ఇవ్వమన్నా..

pv sindu
నాన్నకు బహుమతిగా ఇవ్వమన్నా

ఒలింపిక్స్‌ సెమీఫైనల్లో ఓటమితో తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయిన సింధుకు తండ్రి రమణ స్ఫూర్తి వచనాలు ధైర్యం నింపాయట. నాన్నకు బహుమతి ఇస్తున్నా అనుకుని మ్యాచ్‌ ఆడమని తాను సింధుకు చెప్పినట్లు రమణ చెప్పారు. సింధు కాంస్యం నెగ్గిన సందర్భంగా రమణ మీడియాతో మాట్లాడారు. 'కోచ్‌ పార్క్‌ సాంగ్‌, కేంద్ర ప్రభుత్వం, బాయ్‌, సింధు మద్దతుదారులకు కృతజ్ఞతలు. ఒలింపిక్స్‌లో వరుసగా రెండు పతకాలు గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు రికార్డు సృష్టించడం ఆనందంగా ఉంది. ఎంత ఒత్తిడి ఉన్నా పతకం సాధించింది. 3, 4 స్థానాల కోసం జరిగే మ్యాచ్‌లో ఆడటం చాలా కష్టం. శనివారం సింధులో చాలాసేపు స్ఫూర్తినింపా. నీ అత్యుత్తమ ఆట ఆడావు. ఓడినా ఫర్వాలేదు. ఆదివారం మ్యాచ్‌పై దృష్టిసారించు. నాన్నకు బహుమతి ఇస్తున్నా అనుకుని మ్యాచ్‌ ఆడు. అందరం స్వర్ణం సాధించాలనే కోరుకున్నాం. నువ్వు బాగా ఆడావు. పతకం గెలిస్తే రికార్డు అవుతుంది' అని చెప్పా. ఒలింపిక్స్‌ అంటే చిన్న టోర్నీ కాదు. ఏ పతకమైనా గొప్పదే అని రమణ తెలిపారు.

ఆమె వెనుక అతను..

pv sindu
కోచ్​ పార్క్‌ తే సంగ్​తో సింధు

ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ కాంస్య పతక పోరులో గెలవగానే ఒక్కసారిగా సింధు విజయ నాదం చేసింది. ఆ వెంటనే అక్కడున్న కెమెరాలన్నీ కోర్టు బయట ఓ మూల వైపు తిరిగాయి. అప్పటికే అక్కడ ఓ వ్యక్తి పట్టరాని సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నాడు. అతని దగ్గరికి వెళ్లిన సింధు.. ‘‘మనం సాధించాం’’ అనే అర్థం వచ్చేలా అతణ్ని హత్తుకుంది. అతనెవరో కాదు.. పార్క్‌ తే సంగ్‌.. సింధు కోచ్‌. కొన్నేళ్ల కష్టానికి తగిన ప్రతిఫలంగా ఈ పతకం ఆమెకు దక్కడంతో 42 ఏళ్ల పార్క్‌ ఆనందం పట్టలేకపోయాడు. సింధు విజయం వెనక అతనిది కీలక పాత్ర.

ప్రత్యేక శిక్షణ..

2019 నుంచి ఆమెకు శిక్షణ ఇస్తున్న అతను.. ఆమె ఆటలోని లోపాలను సరిచేస్తూ సాగుతున్నాడు. ఆమె డిఫెన్స్‌లో బలహీనంగా ఉండడంతో.. ఆ విభాగంలో ఎక్కువ దృష్టి పెట్టి కావాల్సిన మార్పులు తీసుకొచ్చాడు. కోర్టులో చురుగ్గా కదిలేలా ఆమెకు తర్ఫీదునిచ్చాడు. 2019లో ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో సింధును ఛాంపియన్‌గా నిలవడంలో ముఖ్య భూమిక పోషించాడు. కరోనా విరామంతో కోల్పోయిన లయను తిరిగి అందుకుని.. మునుపటిలా రాణించేలా ఆమెకు ప్రత్యేక శిక్షణ అందించాడు.

వ్యూహాల్లో దిట్ట..

ఒకప్పటి దక్షిణ కొరియా బ్యాడ్మింటన్‌ ఆటగాడైన పార్క్‌.. 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌ పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్స్‌ వరకూ వెళ్లగలిగాడు. అదే ఏడాది ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్యం గెలిచాడు. 2002 ఆసియా క్రీడల్లో పసిడి సాధించిన పురుషుల టీమ్‌లో అతనూ ఓ సభ్యుడు. ఆ తర్వాత కోచ్‌గా మారిన అతను వ్యూహాలు రచించడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నాడు. 2013 నుంచి 2018 వరకూ కొరియా జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. ఆ తర్వాత భారత క్రీడా ప్రాధికార సంస్థ అతడిని కోచ్‌గా నియమించింది. ఆటపై విస్తృతమైన జ్ఞానం, గొప్ప అవగాహన ఉన్న అతను.. ఆ తర్వాత సింధు ఆటను ఉత్తమంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్నాడు. ఎప్పటికప్పుడూ ఆమె ఆటలో మార్పులు తెస్తూ.. వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించాడు. ప్రత్యర్థుల ఆటతీరును పసిగట్టి.. పక్కా ప్రణాళికలు రూపొందించి సింధు విజయాల్లో కీలకంగా మారాడు. అతని శిక్షణలో తన ఆటతీరు కచ్చితంగా మెరుగవుతుందన్న సింధు నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు.

ఆ త్యాగానికి ఫలితం..

ఒలింపిక్స్‌కు సమర్థంగా సన్నద్ధమయ్యే దిశగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన గచ్చిబౌలి స్టేడియంలో పార్క్‌ పర్యవేక్షణలో సింధు ప్రాక్టీస్‌ సాగింది. ఒకేసారి ముగ్గురు లేదా నలుగురు కుర్రాళ్లను కోర్టులో మరో వైపు ఉంచి.. ఆమెతో ఆడించేవాడు. సింధును అయోమయంలోకి గురిచేసేలా వివిధ రకాల షాట్లు ఆడమని ఆ కుర్రాళ్లకు చెప్పి.. వాటిని తిప్పికొట్టేలా ఆమెకు మెళకువలు నేర్పాడు. నెట్‌ దగ్గర షటిల్‌ను సమర్థంగా ఆడేలా శిక్షణ ఇచ్చాడు. ఆమెకు శిక్షణ ఇవ్వడం కోసం ఇక్కడే ఉండిపోయిన అతను గతేడాది ఫిబ్రవరి నుంచి ఒక్కసారి కూడా తన కుటుంబాన్ని చూసేందుకు దక్షిణ కొరియా వెళ్లలేదు. తన నాలుగేళ్ల తనయనూ కలవలేదు. అయితే ఆ త్యాగాలకు ఇప్పుడు అతనికి ఫలితం దక్కింది.

ఇదీ చదవండి:నా మెడల్.. తర్వాతి జనరేషన్​కు ఇన్​స్పిరేషన్: పీవీ సింధు

ఒలింపిక్స్​లో పీవీ సింధుకు కాంస్యం

'నేను ట్రెండ్‌ ఫాలో అవ్వను.. ట్రెండ్‌ సెట్‌ చేస్తా' ఓ సినిమాలో కథానాయకుడి డైలాగ్‌ ఇది. సినిమాలో డైలాగ్‌ పేల్చడానికి బాగానే ఉంటుంది కానీ.. నిజ జీవితంలో ఈ మాటను నిజం చేయడం అంత తేలిక కాదు. అందులోనూ ఓ అమ్మాయి.. పైగా ఆటల్లో.. అంటే అది మరీ కష్టం. ఇక ఆ అమ్మాయి ఎంచుకున్న ఆటలో అప్పటికే ఓ క్రీడాకారిణి తిరుగులేని స్థాయిని అందుకుని ప్రపంచ వేదికపై అద్భుత విజయాలతో దూసుకెళ్తున్నపుడు.. ఆమెకు చేరువగా వెళ్లడమే మిగతా క్రీడాకారుల లక్ష్యం అయినపుడు.. ఆ అగ్రశ్రేణి ప్లేయర్‌ను దాటి ముందుకెళ్లడం.. ఊహకైనా అందని విజయాలందుకోవడం.. ఆటలో కొత్త ప్రమాణాలు నెలకొల్పడం.. తన ఆటను దాటి దేశ క్రీడా చరిత్రలోనే అత్యుత్తమ అథ్లెట్లలో ఒకరిగా పేరు తెచ్చుకోవడం సామాన్య విషయమా? ఇది కదా ట్రెండ్‌ సెట్‌ చేయడం అంటే. మన సింధు చేసిందదే.

pv sindu
ఒలింపిక్​లో పతకాలు సాధించిన ముగ్గురు క్రీడాకారిణులు

ప్రపంచ ఛాంపియన్‌ పూసర్ల వెంకట సింధు సాధించింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకాన్ని అందించింది. స్వర్ణం సాధ్యంకాకపోయినా కాంస్య పతకంతో సత్తాచాటింది. ఆదివారం ఏకపక్ష పోరులో ఆరో సీడ్‌ సింధు 21-13, 21-15తో 8వ సీడ్‌ బింగ్జియావో (చైనా)ను ఓడించింది. వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించింది

అస్త్రాలన్నింటినీ..: స్వర్ణం సాధించే అవకాశాన్ని కోల్పోయిన సింధు కాంస్య పతకం కోసం ప్రాణం పెట్టింది. బింగ్జియావోతో పోరులో అన్ని అస్త్రాలను సంధించింది. పతకం తప్ప మరో ఆలోచన లేకుండా ఆడింది. 52 నిమిషాల పాటు సాగిన పోరులో అత్యుత్తమ ఫిట్‌నెస్‌తో అదరగొట్టింది. అటాకింగ్‌, నెట్‌ గేమ్‌లలో సింధుకు ప్రత్యర్థి పోటీగానే కనిపించలేదు. సింధు స్మాష్‌లు, క్రాస్‌కోర్ట్‌ షాట్‌లకు బింగ్జియావో దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ఎడమచేతి వాటం బింగ్జియావో బ్యాక్‌హ్యాండ్‌ను సింధు లక్ష్యంగా చేసుకుంది. ర్యాలీ గేమ్‌లోనూ వైవిధ్యం చూపించింది. సింధు నైపుణ్యం, ఫిట్‌నెస్‌ ముందు బింగ్జియావో పూర్తిగా తేలిపోయింది. మొదటి పాయింటు నుంచే పతకం సాధించాలన్న పట్టుదలను సింధు కనబరిచింది. తొలి గేమ్‌లో వరుసగా 4 పాయింట్లతో సత్తాచాటింది. అయితే సింధు అనవసర తప్పిదాలు ప్రత్యర్థికి లాభించాయి. షటిల్‌ను నెట్‌కు ఆడేయడం.. కోర్ట బయటకు కొట్టడంతో ప్రత్యర్థి రేసులోకి వచ్చింది. 6-6తో పాయింట్లను సమం చేసింది. వెంటనే తేరుకున్న సింధు ఒక్కసారిగా గేరు మార్చింది. స్మాష్‌లతో విరుచుకుపడింది. 11-8తో ఆధిక్యంలోకి వెళ్లిన భారత స్టార్‌ అక్కడ్నుంచి వెనుదిరిగి చూడలేదు. స్మాష్‌లు, క్రాస్‌కోర్ట్‌, డ్రాప్‌ షాట్లతో ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. తనపై 9-6తో మెరుగైన గెలుపోటముల రికార్డున్న బింగ్జియావోను సింధు అనామక క్రీడాకారిణిగా మార్చేసింది. షటిల్‌పై పూర్తి నియంత్రణతో కోర్టు నలువైపులా పాయింట్లు రాబట్టి 21-13తో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది.

రెండో గేమ్‌లోనూ బింగ్జియావో పోటీ ఇవ్వలేకపోయింది. రెట్టించిన దూకుడుతో కనిపించిన సింధు వరుస పాయింట్లతో హోరెత్తించింది. 5-2తో ముందంజ వేసిన సింధు క్రాస్‌కోర్ట్‌ స్మాష్‌ సంధించి 11-9 మరింత ముందుకెళ్లింది. ఈ సమయంలో సింధు 2 అనవసర తప్పిదాలు చేయడంతో 11-11తో స్కోరు సమమైంది. ఆ తర్వాత నుంచి ఆటంతా సింధుదే. స్మాష్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. 17-14తో ఆధిక్యం లభించినప్పుడు సింధు గర్జనతో స్టేడియం హోరెత్తింది. స్మాష్‌తో 20-15తో మ్యాచ్‌కు చేరువైన సింధు క్రాస్‌కోర్ట్‌ షాట్‌తో 21-15తో రెండో గేమ్‌ను, మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. అనంతరం రెండు చేతులు పైకెత్తి సింహనాదం చేసింది. కోచ్‌ పార్క్‌ను హత్తుకుని సంబరాలు చేసుకుంది.

pv sindu
పీవీ సింధు

"ఒలింపిక్స్‌ కోసం ఎంతగానో కష్టపడ్డా. పతకం గెలిచినందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు నాలో భిన్నమైన భావోద్వేగాలు ఉన్నాయి. కాంస్య నెగ్గినందుకు ఆనంద పడాలో.. ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశం చేజారినందుకు బాధ పడాలో తెలియట్లేదు. ఈ మ్యాచ్‌కు ముందు నా భావోద్వేగాల్ని పక్కనబెట్టా. నూటికి నూరు శాతం ప్రదర్శన ఇవ్వాలని భావించా. శనివారం సెమీఫైనల్స్‌లో నేను, బింగ్జియావో ఓడిపోయాం. ఆదివారం కచ్చితంగా గెలవాలనే బరిలో దిగాం. ఒలింపిక్స్‌లో దేశానికి పతకం అందించడం ఇద్దరికీ ముఖ్యమే. అదంత సులువేమీ కాదు. మ్యాచ్‌లో బింగ్జియావో గట్టి పోటీనిచ్చింది. నేను ఓపికగా, ప్రశాంతంగా ఆడా. ఆధిక్యంలో ఉన్నా కూడా ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకోలేదు. నేను బాగా ఆడాననే అనుకుంటున్నా. దేశానికి పతకం అందించడం గర్వంగా ఉంది. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకం గెలవడంతో మేఘాల్లో తేలిపోతున్నట్లుగా ఉంది. ఈ క్షణాల్ని ఆస్వాదిస్తున్నా. నా కోసం కుటుంబమంతా చాలా కష్టపడింది. ఎన్నో త్యాగాలు చేశారు. వారికి ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటా. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో కచ్చితంగా బరిలో దిగుతా."

- సింధు

"2016 (రజతం), 2020 (కాంస్యం). సింధు.. భారత్‌కు రెండు ఒలింపిక్స్‌ పతకాలు అందించడం ఓ గొప్ప ఘనత. నువ్వు దేశాన్ని ఎంతో గర్వపడేలా చేశావు’"

- సచిన్‌

"వరుసగా రెండు ఒలింపిక్స్‌ల్లో పతకాలు గెలిచిన నీ (సింధు) పట్ల గర్వపడుతున్నా. కచ్చితంగా అద్భుత ప్రదర్శన చేశావ్‌. గొప్పగా ఆడావ్‌’"

- కరణం మల్లీశ్వరి

నాన్నకు బహుమతిగా ఇవ్వమన్నా..

pv sindu
నాన్నకు బహుమతిగా ఇవ్వమన్నా

ఒలింపిక్స్‌ సెమీఫైనల్లో ఓటమితో తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయిన సింధుకు తండ్రి రమణ స్ఫూర్తి వచనాలు ధైర్యం నింపాయట. నాన్నకు బహుమతి ఇస్తున్నా అనుకుని మ్యాచ్‌ ఆడమని తాను సింధుకు చెప్పినట్లు రమణ చెప్పారు. సింధు కాంస్యం నెగ్గిన సందర్భంగా రమణ మీడియాతో మాట్లాడారు. 'కోచ్‌ పార్క్‌ సాంగ్‌, కేంద్ర ప్రభుత్వం, బాయ్‌, సింధు మద్దతుదారులకు కృతజ్ఞతలు. ఒలింపిక్స్‌లో వరుసగా రెండు పతకాలు గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు రికార్డు సృష్టించడం ఆనందంగా ఉంది. ఎంత ఒత్తిడి ఉన్నా పతకం సాధించింది. 3, 4 స్థానాల కోసం జరిగే మ్యాచ్‌లో ఆడటం చాలా కష్టం. శనివారం సింధులో చాలాసేపు స్ఫూర్తినింపా. నీ అత్యుత్తమ ఆట ఆడావు. ఓడినా ఫర్వాలేదు. ఆదివారం మ్యాచ్‌పై దృష్టిసారించు. నాన్నకు బహుమతి ఇస్తున్నా అనుకుని మ్యాచ్‌ ఆడు. అందరం స్వర్ణం సాధించాలనే కోరుకున్నాం. నువ్వు బాగా ఆడావు. పతకం గెలిస్తే రికార్డు అవుతుంది' అని చెప్పా. ఒలింపిక్స్‌ అంటే చిన్న టోర్నీ కాదు. ఏ పతకమైనా గొప్పదే అని రమణ తెలిపారు.

ఆమె వెనుక అతను..

pv sindu
కోచ్​ పార్క్‌ తే సంగ్​తో సింధు

ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ కాంస్య పతక పోరులో గెలవగానే ఒక్కసారిగా సింధు విజయ నాదం చేసింది. ఆ వెంటనే అక్కడున్న కెమెరాలన్నీ కోర్టు బయట ఓ మూల వైపు తిరిగాయి. అప్పటికే అక్కడ ఓ వ్యక్తి పట్టరాని సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నాడు. అతని దగ్గరికి వెళ్లిన సింధు.. ‘‘మనం సాధించాం’’ అనే అర్థం వచ్చేలా అతణ్ని హత్తుకుంది. అతనెవరో కాదు.. పార్క్‌ తే సంగ్‌.. సింధు కోచ్‌. కొన్నేళ్ల కష్టానికి తగిన ప్రతిఫలంగా ఈ పతకం ఆమెకు దక్కడంతో 42 ఏళ్ల పార్క్‌ ఆనందం పట్టలేకపోయాడు. సింధు విజయం వెనక అతనిది కీలక పాత్ర.

ప్రత్యేక శిక్షణ..

2019 నుంచి ఆమెకు శిక్షణ ఇస్తున్న అతను.. ఆమె ఆటలోని లోపాలను సరిచేస్తూ సాగుతున్నాడు. ఆమె డిఫెన్స్‌లో బలహీనంగా ఉండడంతో.. ఆ విభాగంలో ఎక్కువ దృష్టి పెట్టి కావాల్సిన మార్పులు తీసుకొచ్చాడు. కోర్టులో చురుగ్గా కదిలేలా ఆమెకు తర్ఫీదునిచ్చాడు. 2019లో ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో సింధును ఛాంపియన్‌గా నిలవడంలో ముఖ్య భూమిక పోషించాడు. కరోనా విరామంతో కోల్పోయిన లయను తిరిగి అందుకుని.. మునుపటిలా రాణించేలా ఆమెకు ప్రత్యేక శిక్షణ అందించాడు.

వ్యూహాల్లో దిట్ట..

ఒకప్పటి దక్షిణ కొరియా బ్యాడ్మింటన్‌ ఆటగాడైన పార్క్‌.. 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌ పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్స్‌ వరకూ వెళ్లగలిగాడు. అదే ఏడాది ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్యం గెలిచాడు. 2002 ఆసియా క్రీడల్లో పసిడి సాధించిన పురుషుల టీమ్‌లో అతనూ ఓ సభ్యుడు. ఆ తర్వాత కోచ్‌గా మారిన అతను వ్యూహాలు రచించడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నాడు. 2013 నుంచి 2018 వరకూ కొరియా జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. ఆ తర్వాత భారత క్రీడా ప్రాధికార సంస్థ అతడిని కోచ్‌గా నియమించింది. ఆటపై విస్తృతమైన జ్ఞానం, గొప్ప అవగాహన ఉన్న అతను.. ఆ తర్వాత సింధు ఆటను ఉత్తమంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్నాడు. ఎప్పటికప్పుడూ ఆమె ఆటలో మార్పులు తెస్తూ.. వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించాడు. ప్రత్యర్థుల ఆటతీరును పసిగట్టి.. పక్కా ప్రణాళికలు రూపొందించి సింధు విజయాల్లో కీలకంగా మారాడు. అతని శిక్షణలో తన ఆటతీరు కచ్చితంగా మెరుగవుతుందన్న సింధు నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు.

ఆ త్యాగానికి ఫలితం..

ఒలింపిక్స్‌కు సమర్థంగా సన్నద్ధమయ్యే దిశగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన గచ్చిబౌలి స్టేడియంలో పార్క్‌ పర్యవేక్షణలో సింధు ప్రాక్టీస్‌ సాగింది. ఒకేసారి ముగ్గురు లేదా నలుగురు కుర్రాళ్లను కోర్టులో మరో వైపు ఉంచి.. ఆమెతో ఆడించేవాడు. సింధును అయోమయంలోకి గురిచేసేలా వివిధ రకాల షాట్లు ఆడమని ఆ కుర్రాళ్లకు చెప్పి.. వాటిని తిప్పికొట్టేలా ఆమెకు మెళకువలు నేర్పాడు. నెట్‌ దగ్గర షటిల్‌ను సమర్థంగా ఆడేలా శిక్షణ ఇచ్చాడు. ఆమెకు శిక్షణ ఇవ్వడం కోసం ఇక్కడే ఉండిపోయిన అతను గతేడాది ఫిబ్రవరి నుంచి ఒక్కసారి కూడా తన కుటుంబాన్ని చూసేందుకు దక్షిణ కొరియా వెళ్లలేదు. తన నాలుగేళ్ల తనయనూ కలవలేదు. అయితే ఆ త్యాగాలకు ఇప్పుడు అతనికి ఫలితం దక్కింది.

ఇదీ చదవండి:నా మెడల్.. తర్వాతి జనరేషన్​కు ఇన్​స్పిరేషన్: పీవీ సింధు

ఒలింపిక్స్​లో పీవీ సింధుకు కాంస్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.