భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజు- చిరాగ్శెట్టి జోడీ.. చైనా ఓపెన్ నుంచి నిష్క్రమించింది. సెమీఫైనల్లో పోరాడి ఓడిపోయింది. టోర్నీ ఆసాంతం ఎంతో మందికి షాకిచ్చిన ఈ ద్వయం.. ప్రపంచ ఛాంపియన్లు మార్కస్- కెవిన్ (ఇండోనేసియా)లను నిలువరించ లేకపోయారు.
శనివారం జరిగిన సెమీస్లో సాత్విక్- చిరాగ్ జోడీ.. మార్కస్- కెవిన్ చేతిలో 16-21, 20-22 తేడాతో ఓటమి పాలైంది. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో వీరి చేతిలోనే ఓడిపోయి రజతంతో సరిపెట్టుకున్నారు సాత్విక్- చిరాగ్. ఇప్పటి వరకు వీరు ఎనిమిది సార్లు తలపడగా.. అన్నిసార్లు ప్రత్యర్థిదే పైచేయి.
ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్లో రన్నరప్గా నిలిచిన సాత్విక్- చిరాగ్.. వరుసగా రెండో టోర్నీలోనూ సెమీస్ చేరడం విశేషం. ఏడో ర్యాంక్లో ఉన్న ఈ జోడీ.. క్వార్టర్స్లో మూడో ర్యాంకు ద్వయానికి షాకిచ్చారు. ప్రపంచ టాప్-10లో చోటు దక్కించుకున్నారు.
గతేడాది జరిగిన థాయ్లాండ్ ఓపెన్లో గెలిచారు. వరల్డ్ టూర్-500లో విజేతగా నిలిచిన తొలి పురుషుల డబుల్స్ జోడీగా రికార్డు సృష్టించారు.