బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'తలైవి'. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపుదిద్దుకుంది. సెప్టెంబర్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నటి కంగన శనివారం ఉదయం చెన్నైకు చేరుకుని జయలలిత సమాధి వద్ద నివాళులర్పించారు. 'తలైవి' సినిమా అందరికీ చేరువ కావాలని కోరుకున్నారు. ఎంజీఆర్ సమాధి వద్ద కూడా నివాళులర్పించి.. కొంత సమయంపాటు అక్కడే మౌనం పాటించారు. ఇకపై ఆమె ‘తలైవి’ ప్రమోషన్స్లో ఫుల్ యాక్టివ్గా పాల్గొననున్నారు.
![Kangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12967872_kan-3.jpg)