కరోనాపై ప్రజల్లో నెలకొన్న ఆందోళనను తొలగించేందుకు ప్రముఖ దర్శకుడు బాబ్జీ రచించిన 'కరోనా రక్కసి' పాటను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ఆవిష్కరించారు. ఈ పాటను ప్రజా నాట్యమండలి గాయకుడు లక్ష్మణ్ పూడి ఆలపించగా యువ సంగీత దర్శకుడు ప్రేమ్ స్వరాలు అందించారు. ఈ సందర్భంగా పాటను ఆసాంతం వీక్షించిన వినాయక్.. బాబ్జీ, లక్ష్మణ్, ప్రేమ్లను అభినందించారు. దీంతో పాటు ప్రస్తుత పరిస్థితుల్లో పారిశుద్ధ్య కార్మికులను చులకనభావంతో చూడొద్దని విజ్ఞప్తి చేశారు.
"కరోనా విపత్తు సమయంలో లేదా ఇంకెప్పుడైనా.. పారిశుద్ధ్య కార్మికులను చులకనభావంతో చూడొద్దు. వైరస్కు ధనికులు, పేదలనే తేడా లేదని ప్రతిఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఉపాధి లేక అల్లాడుతున్న వారిని ఆర్థికంగా ఆదుకొని మానవత్వాన్ని చాటండి. ప్రజలు ఈ మహమ్మారికి భయపడాల్సిన అవసరం లేదు. తగిన జాగ్రతలు పాటించండి."
-వి.వి.వినాయక్, ప్రముఖ దర్శకుడు.
ప్రస్తుతం 'సీనయ్య' చిత్రంతో హీరోగా మారబోతున్నారు వినాయక్. లాక్డౌన్ తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చూడండి : 'సుశాంత్ పరిస్థితి నాకూ ఎదురైంది.. కానీ!'