ETV Bharat / sitara

కరోనా బాధితులకు అండగా విజయ్​సేతుపతి

author img

By

Published : Jun 15, 2021, 12:58 PM IST

Updated : Jun 15, 2021, 1:21 PM IST

కరోనా కట్టడిలో భాగంగా తమిళనాడు ప్రభుత్వానికి అండగా నిలిచారు విలక్షణ నటుడు విజయ్​సేతుపతి​. రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25లక్షల విరాళం ప్రకటించారు.

vijay sethupathi
విజయ్​సేతుపతి

కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు సెలబ్రిటీలు. వారికి తోచిన సాయం చేస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే విలక్షణ నటుడు విజయ్​సేతుపతి​ కూడా బాధితులకు అండగా నిలిచారు. తమిళనాడు ప్రభుత్వ సహాయనిధికి రూ. 25లక్షల విరాళం ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో సీఎంను కలిసి ఈ విరాళాన్ని అందించారు. ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు సహా ప్రభుత్వం విధించిన నిబంధనలను పాటించాలని కోరారు.

అంతకు ముందు సూపర్​స్టార్​ రజనీకాంత్​ రూ.50లక్షలు, ఆయన కుమార్తె సౌందర్య ఫ్యామిలీ రూ. కోటి విరాళం, సూర్య, ఆయన సోదరుడు కార్తి రూ.కోటి, చియాన్ విక్రమ్ రూ.30 లక్షలు, హీరోలు అజిత్‌, దర్శకుడు మురుగదాస్‌ చెరో రూ.25 లక్షలు తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చారు.

కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు సెలబ్రిటీలు. వారికి తోచిన సాయం చేస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే విలక్షణ నటుడు విజయ్​సేతుపతి​ కూడా బాధితులకు అండగా నిలిచారు. తమిళనాడు ప్రభుత్వ సహాయనిధికి రూ. 25లక్షల విరాళం ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో సీఎంను కలిసి ఈ విరాళాన్ని అందించారు. ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు సహా ప్రభుత్వం విధించిన నిబంధనలను పాటించాలని కోరారు.

అంతకు ముందు సూపర్​స్టార్​ రజనీకాంత్​ రూ.50లక్షలు, ఆయన కుమార్తె సౌందర్య ఫ్యామిలీ రూ. కోటి విరాళం, సూర్య, ఆయన సోదరుడు కార్తి రూ.కోటి, చియాన్ విక్రమ్ రూ.30 లక్షలు, హీరోలు అజిత్‌, దర్శకుడు మురుగదాస్‌ చెరో రూ.25 లక్షలు తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చారు.

ఇదీ చూడండి: రజనీ​ రూ.50లక్షలు.. విక్రమ్ రూ.30 లక్షల విరాళం

Last Updated : Jun 15, 2021, 1:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.