మెగాహీరో వరుణ్ తేజ్.. 'వాల్మీకి'లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రతినాయక లక్షణాలున్న పాత్రలో కనిపించనున్నాడీ కథానాయకుడు. ఈ సినిమాలోని అతిథి పాత్రలో ప్రముఖ దర్శకుడు సుకుమార్ కనిపించనున్నాడని సమాచారం. లేదు లేదు అతడు వాయిస్ ఓవర్ మాత్రమే ఇచ్చాడని కొన్ని వదంతులు వస్తున్నాయి. ఏదేమైనా వీటిపై స్పష్టత రావాలంటే విడుదల వరకు ఆగాల్సిందే.


వరుణ్కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. శ్రీదేవి అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుందీ భామ. అధర్వ మురళి, మృణాళిని రవి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నాడు. హరీశ్ శంకర్ దర్శకుడు. ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి: రాజ్కుమార్ రావుతో తొలిసారిగా ప్రియాంక చోప్రా