భారత సైనిక దళం 2016 లో జరిపిన మెరుపు దాడుల నేపథ్యంతో తెరకెక్కిన చిత్రం 'ఉరీ- ద సర్జికల్ స్ట్రైక్'. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. ఈ ఏడాది కార్గిల్ దివస్ సందర్భంగా మహారాష్ట్రవ్యాప్తంగా 500 థియేటర్లలో మరోసారి విడుదల చేయనున్నారు.
"కార్గిల్ దివస్లో 'ఉరీ' భాగమైనందుకు నాకు ఆనందంగా ఉంది. భారతీయులందరిలోనూ ఈ చిత్రం స్ఫూర్తి కలిగిస్తుందని అనుకుంటున్నాను. మమ్మల్ని ప్రశంసిస్తూ చాలా సందేశాలు వచ్చాయి. చిత్రం చూసి సైనిక దళాల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని ఎందరో యువకులు మాకు ఈమెయిల్స్, మెసేజ్ల రూపంలో తెలిపారు." -ఆదిత్య, దర్శకుడు
'ఉరీ' చిత్రం 2019 జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటివరకు సుమారు రూ. 342 కోట్లు వసూలుచేసింది. ఇదే చిత్రబృందం 'అశ్వత్థామ' పేరుతో ప్రస్తుతం ఓ సినిమా రూపొందిస్తోంది.
ఇది సంగతి: రజనీ 'దర్బార్' పిక్ లీక్.. అభిమానులు ఫిదా