ETV Bharat / sitara

సింగీతం శ్రీనివాసరావు.. సెల్యూలాయిడ్ సైంటిస్ట్

కాలాన్ని కట్టేసి, లోకాలు చుట్టేసి.. ఊహాజగత్తు.. గమ్మత్తులు ఆవిష్కరించిన ఆధునికుడు, సినీ ప్రేక్షక లోకాన్ని త్రికాల యంత్రంతో మంత్రముగ్ధుల్ని చేసిన కాలజ్ఞాని. దశాబ్దాల తెలుగు సినిమా పరిణామ క్రమానికి ప్రత్యక్ష సాక్షి. టాకీ యుగంలో మూకీ సినిమా తీసిన సాహసి. ఆధునిక సాంకేతికతకు సహవాసి. నవ్యతను శ్వాసించి, ప్రయోగాలను ప్రేమించి, అద్భుతాలు ఆవిష్కరించిన సినీ తపస్వి. కళా యశస్వి. వెండితెర దరహాసం సింగీతం శ్రీనివాసరావు. ప్రతివారం సినీ ప్రముఖుల గురించి ఆసక్తికర విశేషాల చెప్పే ఈటీవీ భారత్.. ఈసారి స్టార్ దర్శకుడు సింగీతం గురించి బోలెడన్ని విషయాలతో మీ ముందుకొచ్చింది.

author img

By

Published : Jun 27, 2021, 11:00 AM IST

Updated : Jun 27, 2021, 11:27 AM IST

director singeetam srinivasa rao
సింగీతం శ్రీనివాసరావు

ఆయన సినిమాలు నవజీవన బృందావనాలు.. ఆ చలనచిత్రాలు చిట్టి కోయిలల కుహు కుహూ గానాలు. ఆశల రెక్కలతో పైకి ఎగసే పుష్పక విమానాలు. జాబిల్లిని అందించే జానపదాలు. సాంకేతిక అద్భుతాలు. ఆ సినిమాలు హరిచందనాల..కుందనాల బొమ్మలు. తెలుగు లోగిళ్ల వెలుగుపారాణులు. అలాంటి అపురూప కళాఖండాల సృష్టికర్త, అద్భుతాల ఆవిష్కర్త. కళాత్మక, కథాత్మక చిత్రాల దర్శకుడు, సంస్కృతికీ, శాస్త్రీయతకూ పట్టం కట్టి చిరస్మరణీయ సినిమాలు అందించిన సినీ మాంత్రికుడు సింగీతం శ్రీనివాసరావు.

director singeetam srinivasa rao
సింగీతం శ్రీనివాసరావు

మేళకర్తల రాగాల సమ్మేళనమే సంగీతం. లలిత కళలన్నీ రాశులు పోస్తే సింగీతం. తొంభై వసంతాలు పలకరిస్తున్నా నిత్యయవ్వనుడిలా ఉన్న సింగీతం సినీజీవనయానం ఎంతో ఆసక్తిదాయకం. తన స్వస్థలం.. నెల్లూరు జిల్లా ఉదయగిరినే కళా హృదయగిరిగా చేసుకుని ముందుకు సాగారు. తల్లి శకుంతల వయొలిన్ విద్వాంసురాలు. తండ్రి ప్రధానోపాధ్యాయుడు. ఆ ఇంట సంగీత, సాహిత్య, సాంస్కృతిక స్పర్శతో సింగీతం... తను చదివే స్కూల్లో లవకుశ నాటకంలో లవ పాత్ర వేశారు. అదే సమయంలో టూరింగ్ టాకీస్ లో చూసిన 'సీతాకల్యాణం', 'శ్రీకృష్ణ లీలలు' సినిమాలు ప్రగాఢ ముద్రవేశాయి. అప్పుడే ఆకాశవాణిలో సాలూరి రాజేశ్వరరావు పాడిన లలితగీతం చల్లగా మనసు తాకింది. ఆ తీయని మధుర భావనలను సింగీతం హృదయంలో భద్రపర్చుకున్నారు. ఉదయగిరిలో పదోతరగతి, గూడూరులో ఇంటర్‌ పూర్తిచేశారు. యూనివర్శిటీ ఆఫ్ మద్రాస్​లో బీఎస్సీ ఫిజిక్స్. అటు తర్వాత సూళ్లూరు పేటలో కొంతకాలం టీచరుగా ఉద్యోగం. చిన్నప్పుడు చూసిన భక్తపోతన సినిమా హృద్యంగా వెంటాడేది. కేవీరెడ్డి దర్శక ప్రతిభ, ప్రతిఫ్రేములో తీసుకున్న శ్రద్ధ ఆకర్షించాయి. మనిషి పాఠం చెబుతున్నా మనసేమో మెగాఫోన్ పట్టాలని ఉవ్విళ్ల్లూరేది. సింగీతం ఈ క్రమంలో మద్రాసు వెళ్లి కష్టపడి కేవీ రెడ్డి దగ్గర అసిస్టెంటుగా చేరారు. అద్భుత కళాఖండం 'మాయాబజారు' చిత్రానికి సహాయ దర్శకుడయ్యారు. పెళ్లినాటి ప్రమాణాలు, జగదేకవీరుని కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం తదితర చిత్రాల్లో పనిచేస్తూ దర్శకత్వ నైపుణ్యాలు నేర్చారు.

director singeetam srinivasa rao
కీర్తి సురేశ్​ సింగీతం శ్రీనివాసరావు

దర్శకుడికి స్క్రీన్​ప్లే కూడా తెలిసి ఉంటే చేసే కృషి వెండితెరపై ప్రతిఫలిస్తుందని ప్రపంచ సినీ దిగ్గజం అకిరా కురసోవా నేర్చిన పాఠం సింగీతానికి స్ఫూర్తినిచ్చింది. తన దర్శకత్వ ప్రతిభను ప్రేక్షకలోకానికి చాటాలని వేయికళ్లతో ఎదురు చూస్తున్న సమయం అది. ఎట్టకేలకు ఆ అవకాశం రానే వచ్చింది. కృష్ణంరాజు-కాంచన కాంబినేషన్ తో 1972లో నీతి-నిజాయతీ సినిమా తీశారు. ఈ చిత్రంలో సింగీతం దర్శక ప్రతిభను గుర్తిస్తూ మరో అవకాశం వచ్చింది. అదే జమీందారుగారి అమ్మాయి. 1974లో సింగీతం తెరకెక్కించిన జమీందారు గారి అమ్మాయి సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ గీతాలు సంగీత ప్రియుల హృదయ తంత్రులు మీటాయి.

ప్రయోగాలు, సాహసాలు సినీమాంత్రికుడు సింగీతం శ్రీనివాసరావుకు ప్రాణప్రదం. మరీ చెప్పాలంటే అదే ఆయన పథం. ఆధునికతకు పట్టంకడుతూనే సంప్రదాయ చిత్రాలు, జనపదాలో, ‘గాన పదాలో’ తీయటం దృక్పథం. అది తను పాటించే రిథం.. టాకీ సినిమా రోజులలో మూకీ సినిమా తీసి.. భారతీయ ఛార్లీ చాప్లిన్​ను కమల హాసన్​లో చూపించారు. ఆయన సినీ దర్శక ప్రయాణంలో పుష్పక విమానం సహా, ఆదిత్య 369, భైరవ ద్వీపం వేటికవే విశిష్టమైనవి. ప్రశస్థమైనవి.

director singeetam srinivasa rao
ఆదిత్య 369 సెట్​లో సింగీతం శ్రీనివాసరావు

టాకీయుగం లో మూకీ సినిమా తీయటం సాహసం. సాహసాలను ప్రేమించిన సింగీతం శ్రీనివాసరావు. వెండితెరపై సంచలనం సృష్టించిన నిశ్శబ్ద చిత్రం పుష్పక విమానం. ఘోషతోనే తప్ప, భాషతో సంబంధం లేని ఈ సినిమా..దేశ ప్రజలను అమితంగా ఆకట్టుకుంది. ఇందులో కమలహాసన్ నటన నభూతో నభవిష్యతి. నిరుద్యోగి చిత్త ప్రవృత్తికి చిత్రం. నిరుద్యోగి కంటే యాచకుడి బ్రతుకే నయం అన్న అర్ధంలో తీసిన ఈ దృశ్యంలో కమలహాసన్, సీనియర్ నటుడు పీఎల్ నారాయణ అపూర్వంగా నటించారు. అదే నిరుద్యోగి అతడికి జవాబివ్వటం దర్శక ప్రతిభకు నిదర్శనం.

director singeetam srinivasa rao
పుష్పకవిమానం సినిమాలో సన్నివేశం

తెలుగు చిత్రసీమలో ఓ అపూర్వ ప్రయోగం, తొలి పూర్తిస్థాయి సైన్స్ ఫిక్షన్ చిత్రం ఆదిత్య 369. టెక్నాలజీ అంతగా లేని కాలంలో సెల్యులాయిడ్ సైంటిస్ట్‌ సింగీతం సృష్టి ఈ సినిమా. వెండితెరపై వైజ్ఞానిక అద్భుతం. సినీ ప్రేక్షకులను రాయల కాలానికి తీసుకెళ్లింది. సాఫ్ట్ ‌వేర్ ఇంజనీర్ గా, శ్రీకృష్ణదేవరాయలుగా బాలకృష్ణ అభినయం భళాభళి అన్పించింది. స్వర మాంత్రికుడు ఇళయరాజా, తెరమాంత్రికుడు సింగీతం కలిశారు. ఇక వరవీణల నృత్యగానాలే మరి. పెళ్లిని టీవీలో చూసి ఆనందించాలని భర్తతో ఇల్లాలు చెబుతున్న మాటలు ఈ కాలనికీ వర్తించటం యాదృచ్ఛికం. ఇంజనీర్ కృష్ణమోహన్ చెబుతున్న ప్రజాస్వామ్య కబుర్లకు ఆశ్చర్యపోవటం రాయలవారి వంతైంది.

మూడో ప్రపంచ యుద్ధమే వస్తే ఏం మిగులుతుందో నాడు ఐన్‌స్టీన్ చెప్పిన అంశాన్ని సింగీతం వెండితెరపై చూపారు. ప్రేక్షకులపై సింగీతం శ్రీనివాసరావు సమ్మోహనాస్త్రం భైరవద్వీపం. విజయ-చందమామ కంబైన్స్ నిర్మించిన ఈ చిత్రం ఒక జానపద కళాఖండం. ఇందులో సింగీతం శ్రీనివాసరావు ఒక గీతాన్ని రచించారు. అదే విరిసినదీ వసంతగానం.

సింగీతం దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన మూడో చిత్రం ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’. శ్రీకృష్ణుడి వేషంలో బాలయ్య తండ్రిని తలపించారు. అర్జునుడిగానూ ఆయన నటనకు ప్రశంసలు లభించాయి.

సింగీతానికి, సంగీతానికి సంబంధం ఏమిటి? కొత్తవాళ్లు వింటే ఇంటిపేరు తప్పు పలికారేమో అన్పిస్తుంది. అమర గాయకుడు పీబీ శ్రీనివాస్ మాటల్లో చెప్పాలంటే సంగీతమంతా రాశిగా పోస్తే 'సింగీతం'. అందుకే కాబోలు ఆయన సినిమాల్లో కుదిరితే ఒక వీణపాట. వీలయితే వేణుగానం. లేదంటే వాయులీనం. సాలూరి వారి సాహచర్యం వల్ల కావచ్చు.. వీణలు వేణువుల సరిగమలు, నారద వీణలతోనో, శారద వీణలతోనో స్వరమధురిమలు, సయ్యాటలు..యాంత్రిక జీవన శైలి నుంచి.. కాసేపు సేదతీరుస్తాయి.

unknown facts of director singeetam srinivasa rao
సింగీతం శ్రీనివాసరావు

సింగీతం..సంగీతం. అవినాభావసంబంధం. సంగీత సంగతులు, భాషలు, మేళకర్తల రాగాలన్నీ గుదిగుచ్చి, సమ్మేళనం మార్చి, సింఫనీలుగా ఘోషపలికిస్తే... ఆయన సింగీతం శ్రీనివాసరావు. అందుకే ఆయన దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాలలో వీణ వేణువుల సమ్మేళనాలు, వాయులీనాలు..గంగా,యమునా, సరస్వతుల్లా, ..స్వర..స్వతుల్లా.. మంద్రంగా, మధురంగా, సుమధురంగా ప్రవహిస్తాయి. చిట్టి కోయిలలు శృతి చేసుకొని శృతిపక్వగీతం కోసమో, సంగీతం కోసమో ఎదురు చూస్తాయి.

సింగీతం కన్నడంలో 'భాగ్యద లక్ష్మి బారమ్మ', 'సంయుక్త' అనే రెండు సినిమాలకు సంగీతం సమకూర్చారు. కన్నడలో సంస్కార్ చిత్రం తెరకెక్కడానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా కీలక భూమిక పోషించారు. ఆ చిత్రం ఉత్తమ చిత్రంగా బంగారు పతకం సాధించింది. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కథానాయకుడుగా కన్నడంలో తొలి సినిమా 'హాలు జీను'ను తెరకెక్కించారు. సింగీతం శ్రీనివాసరావు రాజ్ కుమార్ ముగ్గురు కుమారులు పునీత్ రాజ్ కుమార్, శివరాజ్ రాజ్‌ కుమార్‌, రాఘవేంద్ర రాజ్ కుమార్ లతో సినిమాలు చేశారు. ఎనభై మూడేళ్ల వయసులో యానిమేషన్ నేర్చుకుని ఘటోత్కచ్ సినిమా తీశారు. మాయాబజారులోని వివాహభోజనంబు పాటను అవే బాణీలలో ఎస్పీ బాలు వీనులవిందు చేస్తే సింగీతం శ్రీనివాసరావు కనువిందు చేశారు.

సింగీతం అక్కినేని నాగేశ్వరరావు నటించిన పిల్ల జమీందార్, సంగీత సామ్రాట్ సినిమాలకు దర్శకత్వం చేశారు. సెంచరీలు కొట్టే వయస్సులో సింగీతం శ్రీనివాసరావుది బౌండరీలు దాటే ఉత్సాహం. ఆయన దర్శకత్వం వహించిన ఆదిత్య 369 పాటలో యువకుడిలా నేటికీ ఉత్సాహంగా, ఉల్లాసంగా కన్పిస్తారు. పల్లె పదాలయినా, జానపదాలైనా, శాస్త్ర సాంకేతిక అద్భుత చిత్రాలయినా.. సినీకళాఖండాల సృష్టిలో ఆయనది అందెవేసిన చేయి. తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మళయాళం, ఆంగ్లభాషతో కలిపి దాదాపు 60 సినిమాలకు దర్శకత్వం వహించారు.

ఫ్యాషను, ప్యాషను కలగలిపిన సింగీతం 90 వసంతాల నవయువకుడు. వయసు శరీరానికే. మనసుకు కాదు. ఇప్పటికీ కళ్లలో అదే మెరుపు. సినిమానే ఈయన భాష. శ్వాస. రేడియోలు, ఆడియోలు, వీడియోలు, ఇంటర్ నెట్ యుగంలో సీడీలు, పెన్ డ్రైవుల కాలం వరకు ఎన్నో మార్పులను చూసిన ప్రత్యక్షసాక్షి. తొలి టాకీ రూపశిల్పి హెచ్ ఎం రెడ్డి తర్వాత, మూకీలకు టాకీలకు దర్శకత్వం వహించిన ఒకే ఒక్క దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ఆయన జీవితం భారతీయ సినిమా పరిణామక్రమాలకు ఒక రిఫరెన్సు పుస్తకం. టాకీ యుగంలో మూకీ యుగం సినిమా తీసినా, మూడు కాలాలలో ఏడేడు లోకాలు చుట్టి వచ్చే కాలయంత్రంతో చిత్రం తీసినా సింగీతానికి సింగీతమే సాటి. ఆయన భారతీయ సినీరంగ ఖ్యాతి.

.
.

ఆయన సినిమాలు నవజీవన బృందావనాలు.. ఆ చలనచిత్రాలు చిట్టి కోయిలల కుహు కుహూ గానాలు. ఆశల రెక్కలతో పైకి ఎగసే పుష్పక విమానాలు. జాబిల్లిని అందించే జానపదాలు. సాంకేతిక అద్భుతాలు. ఆ సినిమాలు హరిచందనాల..కుందనాల బొమ్మలు. తెలుగు లోగిళ్ల వెలుగుపారాణులు. అలాంటి అపురూప కళాఖండాల సృష్టికర్త, అద్భుతాల ఆవిష్కర్త. కళాత్మక, కథాత్మక చిత్రాల దర్శకుడు, సంస్కృతికీ, శాస్త్రీయతకూ పట్టం కట్టి చిరస్మరణీయ సినిమాలు అందించిన సినీ మాంత్రికుడు సింగీతం శ్రీనివాసరావు.

director singeetam srinivasa rao
సింగీతం శ్రీనివాసరావు

మేళకర్తల రాగాల సమ్మేళనమే సంగీతం. లలిత కళలన్నీ రాశులు పోస్తే సింగీతం. తొంభై వసంతాలు పలకరిస్తున్నా నిత్యయవ్వనుడిలా ఉన్న సింగీతం సినీజీవనయానం ఎంతో ఆసక్తిదాయకం. తన స్వస్థలం.. నెల్లూరు జిల్లా ఉదయగిరినే కళా హృదయగిరిగా చేసుకుని ముందుకు సాగారు. తల్లి శకుంతల వయొలిన్ విద్వాంసురాలు. తండ్రి ప్రధానోపాధ్యాయుడు. ఆ ఇంట సంగీత, సాహిత్య, సాంస్కృతిక స్పర్శతో సింగీతం... తను చదివే స్కూల్లో లవకుశ నాటకంలో లవ పాత్ర వేశారు. అదే సమయంలో టూరింగ్ టాకీస్ లో చూసిన 'సీతాకల్యాణం', 'శ్రీకృష్ణ లీలలు' సినిమాలు ప్రగాఢ ముద్రవేశాయి. అప్పుడే ఆకాశవాణిలో సాలూరి రాజేశ్వరరావు పాడిన లలితగీతం చల్లగా మనసు తాకింది. ఆ తీయని మధుర భావనలను సింగీతం హృదయంలో భద్రపర్చుకున్నారు. ఉదయగిరిలో పదోతరగతి, గూడూరులో ఇంటర్‌ పూర్తిచేశారు. యూనివర్శిటీ ఆఫ్ మద్రాస్​లో బీఎస్సీ ఫిజిక్స్. అటు తర్వాత సూళ్లూరు పేటలో కొంతకాలం టీచరుగా ఉద్యోగం. చిన్నప్పుడు చూసిన భక్తపోతన సినిమా హృద్యంగా వెంటాడేది. కేవీరెడ్డి దర్శక ప్రతిభ, ప్రతిఫ్రేములో తీసుకున్న శ్రద్ధ ఆకర్షించాయి. మనిషి పాఠం చెబుతున్నా మనసేమో మెగాఫోన్ పట్టాలని ఉవ్విళ్ల్లూరేది. సింగీతం ఈ క్రమంలో మద్రాసు వెళ్లి కష్టపడి కేవీ రెడ్డి దగ్గర అసిస్టెంటుగా చేరారు. అద్భుత కళాఖండం 'మాయాబజారు' చిత్రానికి సహాయ దర్శకుడయ్యారు. పెళ్లినాటి ప్రమాణాలు, జగదేకవీరుని కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం తదితర చిత్రాల్లో పనిచేస్తూ దర్శకత్వ నైపుణ్యాలు నేర్చారు.

director singeetam srinivasa rao
కీర్తి సురేశ్​ సింగీతం శ్రీనివాసరావు

దర్శకుడికి స్క్రీన్​ప్లే కూడా తెలిసి ఉంటే చేసే కృషి వెండితెరపై ప్రతిఫలిస్తుందని ప్రపంచ సినీ దిగ్గజం అకిరా కురసోవా నేర్చిన పాఠం సింగీతానికి స్ఫూర్తినిచ్చింది. తన దర్శకత్వ ప్రతిభను ప్రేక్షకలోకానికి చాటాలని వేయికళ్లతో ఎదురు చూస్తున్న సమయం అది. ఎట్టకేలకు ఆ అవకాశం రానే వచ్చింది. కృష్ణంరాజు-కాంచన కాంబినేషన్ తో 1972లో నీతి-నిజాయతీ సినిమా తీశారు. ఈ చిత్రంలో సింగీతం దర్శక ప్రతిభను గుర్తిస్తూ మరో అవకాశం వచ్చింది. అదే జమీందారుగారి అమ్మాయి. 1974లో సింగీతం తెరకెక్కించిన జమీందారు గారి అమ్మాయి సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ గీతాలు సంగీత ప్రియుల హృదయ తంత్రులు మీటాయి.

ప్రయోగాలు, సాహసాలు సినీమాంత్రికుడు సింగీతం శ్రీనివాసరావుకు ప్రాణప్రదం. మరీ చెప్పాలంటే అదే ఆయన పథం. ఆధునికతకు పట్టంకడుతూనే సంప్రదాయ చిత్రాలు, జనపదాలో, ‘గాన పదాలో’ తీయటం దృక్పథం. అది తను పాటించే రిథం.. టాకీ సినిమా రోజులలో మూకీ సినిమా తీసి.. భారతీయ ఛార్లీ చాప్లిన్​ను కమల హాసన్​లో చూపించారు. ఆయన సినీ దర్శక ప్రయాణంలో పుష్పక విమానం సహా, ఆదిత్య 369, భైరవ ద్వీపం వేటికవే విశిష్టమైనవి. ప్రశస్థమైనవి.

director singeetam srinivasa rao
ఆదిత్య 369 సెట్​లో సింగీతం శ్రీనివాసరావు

టాకీయుగం లో మూకీ సినిమా తీయటం సాహసం. సాహసాలను ప్రేమించిన సింగీతం శ్రీనివాసరావు. వెండితెరపై సంచలనం సృష్టించిన నిశ్శబ్ద చిత్రం పుష్పక విమానం. ఘోషతోనే తప్ప, భాషతో సంబంధం లేని ఈ సినిమా..దేశ ప్రజలను అమితంగా ఆకట్టుకుంది. ఇందులో కమలహాసన్ నటన నభూతో నభవిష్యతి. నిరుద్యోగి చిత్త ప్రవృత్తికి చిత్రం. నిరుద్యోగి కంటే యాచకుడి బ్రతుకే నయం అన్న అర్ధంలో తీసిన ఈ దృశ్యంలో కమలహాసన్, సీనియర్ నటుడు పీఎల్ నారాయణ అపూర్వంగా నటించారు. అదే నిరుద్యోగి అతడికి జవాబివ్వటం దర్శక ప్రతిభకు నిదర్శనం.

director singeetam srinivasa rao
పుష్పకవిమానం సినిమాలో సన్నివేశం

తెలుగు చిత్రసీమలో ఓ అపూర్వ ప్రయోగం, తొలి పూర్తిస్థాయి సైన్స్ ఫిక్షన్ చిత్రం ఆదిత్య 369. టెక్నాలజీ అంతగా లేని కాలంలో సెల్యులాయిడ్ సైంటిస్ట్‌ సింగీతం సృష్టి ఈ సినిమా. వెండితెరపై వైజ్ఞానిక అద్భుతం. సినీ ప్రేక్షకులను రాయల కాలానికి తీసుకెళ్లింది. సాఫ్ట్ ‌వేర్ ఇంజనీర్ గా, శ్రీకృష్ణదేవరాయలుగా బాలకృష్ణ అభినయం భళాభళి అన్పించింది. స్వర మాంత్రికుడు ఇళయరాజా, తెరమాంత్రికుడు సింగీతం కలిశారు. ఇక వరవీణల నృత్యగానాలే మరి. పెళ్లిని టీవీలో చూసి ఆనందించాలని భర్తతో ఇల్లాలు చెబుతున్న మాటలు ఈ కాలనికీ వర్తించటం యాదృచ్ఛికం. ఇంజనీర్ కృష్ణమోహన్ చెబుతున్న ప్రజాస్వామ్య కబుర్లకు ఆశ్చర్యపోవటం రాయలవారి వంతైంది.

మూడో ప్రపంచ యుద్ధమే వస్తే ఏం మిగులుతుందో నాడు ఐన్‌స్టీన్ చెప్పిన అంశాన్ని సింగీతం వెండితెరపై చూపారు. ప్రేక్షకులపై సింగీతం శ్రీనివాసరావు సమ్మోహనాస్త్రం భైరవద్వీపం. విజయ-చందమామ కంబైన్స్ నిర్మించిన ఈ చిత్రం ఒక జానపద కళాఖండం. ఇందులో సింగీతం శ్రీనివాసరావు ఒక గీతాన్ని రచించారు. అదే విరిసినదీ వసంతగానం.

సింగీతం దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన మూడో చిత్రం ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’. శ్రీకృష్ణుడి వేషంలో బాలయ్య తండ్రిని తలపించారు. అర్జునుడిగానూ ఆయన నటనకు ప్రశంసలు లభించాయి.

సింగీతానికి, సంగీతానికి సంబంధం ఏమిటి? కొత్తవాళ్లు వింటే ఇంటిపేరు తప్పు పలికారేమో అన్పిస్తుంది. అమర గాయకుడు పీబీ శ్రీనివాస్ మాటల్లో చెప్పాలంటే సంగీతమంతా రాశిగా పోస్తే 'సింగీతం'. అందుకే కాబోలు ఆయన సినిమాల్లో కుదిరితే ఒక వీణపాట. వీలయితే వేణుగానం. లేదంటే వాయులీనం. సాలూరి వారి సాహచర్యం వల్ల కావచ్చు.. వీణలు వేణువుల సరిగమలు, నారద వీణలతోనో, శారద వీణలతోనో స్వరమధురిమలు, సయ్యాటలు..యాంత్రిక జీవన శైలి నుంచి.. కాసేపు సేదతీరుస్తాయి.

unknown facts of director singeetam srinivasa rao
సింగీతం శ్రీనివాసరావు

సింగీతం..సంగీతం. అవినాభావసంబంధం. సంగీత సంగతులు, భాషలు, మేళకర్తల రాగాలన్నీ గుదిగుచ్చి, సమ్మేళనం మార్చి, సింఫనీలుగా ఘోషపలికిస్తే... ఆయన సింగీతం శ్రీనివాసరావు. అందుకే ఆయన దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాలలో వీణ వేణువుల సమ్మేళనాలు, వాయులీనాలు..గంగా,యమునా, సరస్వతుల్లా, ..స్వర..స్వతుల్లా.. మంద్రంగా, మధురంగా, సుమధురంగా ప్రవహిస్తాయి. చిట్టి కోయిలలు శృతి చేసుకొని శృతిపక్వగీతం కోసమో, సంగీతం కోసమో ఎదురు చూస్తాయి.

సింగీతం కన్నడంలో 'భాగ్యద లక్ష్మి బారమ్మ', 'సంయుక్త' అనే రెండు సినిమాలకు సంగీతం సమకూర్చారు. కన్నడలో సంస్కార్ చిత్రం తెరకెక్కడానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా కీలక భూమిక పోషించారు. ఆ చిత్రం ఉత్తమ చిత్రంగా బంగారు పతకం సాధించింది. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కథానాయకుడుగా కన్నడంలో తొలి సినిమా 'హాలు జీను'ను తెరకెక్కించారు. సింగీతం శ్రీనివాసరావు రాజ్ కుమార్ ముగ్గురు కుమారులు పునీత్ రాజ్ కుమార్, శివరాజ్ రాజ్‌ కుమార్‌, రాఘవేంద్ర రాజ్ కుమార్ లతో సినిమాలు చేశారు. ఎనభై మూడేళ్ల వయసులో యానిమేషన్ నేర్చుకుని ఘటోత్కచ్ సినిమా తీశారు. మాయాబజారులోని వివాహభోజనంబు పాటను అవే బాణీలలో ఎస్పీ బాలు వీనులవిందు చేస్తే సింగీతం శ్రీనివాసరావు కనువిందు చేశారు.

సింగీతం అక్కినేని నాగేశ్వరరావు నటించిన పిల్ల జమీందార్, సంగీత సామ్రాట్ సినిమాలకు దర్శకత్వం చేశారు. సెంచరీలు కొట్టే వయస్సులో సింగీతం శ్రీనివాసరావుది బౌండరీలు దాటే ఉత్సాహం. ఆయన దర్శకత్వం వహించిన ఆదిత్య 369 పాటలో యువకుడిలా నేటికీ ఉత్సాహంగా, ఉల్లాసంగా కన్పిస్తారు. పల్లె పదాలయినా, జానపదాలైనా, శాస్త్ర సాంకేతిక అద్భుత చిత్రాలయినా.. సినీకళాఖండాల సృష్టిలో ఆయనది అందెవేసిన చేయి. తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మళయాళం, ఆంగ్లభాషతో కలిపి దాదాపు 60 సినిమాలకు దర్శకత్వం వహించారు.

ఫ్యాషను, ప్యాషను కలగలిపిన సింగీతం 90 వసంతాల నవయువకుడు. వయసు శరీరానికే. మనసుకు కాదు. ఇప్పటికీ కళ్లలో అదే మెరుపు. సినిమానే ఈయన భాష. శ్వాస. రేడియోలు, ఆడియోలు, వీడియోలు, ఇంటర్ నెట్ యుగంలో సీడీలు, పెన్ డ్రైవుల కాలం వరకు ఎన్నో మార్పులను చూసిన ప్రత్యక్షసాక్షి. తొలి టాకీ రూపశిల్పి హెచ్ ఎం రెడ్డి తర్వాత, మూకీలకు టాకీలకు దర్శకత్వం వహించిన ఒకే ఒక్క దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ఆయన జీవితం భారతీయ సినిమా పరిణామక్రమాలకు ఒక రిఫరెన్సు పుస్తకం. టాకీ యుగంలో మూకీ యుగం సినిమా తీసినా, మూడు కాలాలలో ఏడేడు లోకాలు చుట్టి వచ్చే కాలయంత్రంతో చిత్రం తీసినా సింగీతానికి సింగీతమే సాటి. ఆయన భారతీయ సినీరంగ ఖ్యాతి.

.
.
Last Updated : Jun 27, 2021, 11:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.