ETV Bharat / sitara

జ్ఞాపకార్థంగా సుశాంత్​ సింగ్ ఇన్​స్టా​ ఖాతా

author img

By

Published : Jun 19, 2020, 9:27 PM IST

సుశాంత్​సింగ్​ జ్ఞాపకార్థంగా అతడి ఖాతాను మార్పు చేసిందీ ఇన్​స్టా సంస్థ. అందులో సుశాంత్ పోస్టులు ఎప్పటికీ కనిపిస్తాయని పేర్కొంది. ఈ అకౌంట్​లోకి మరో వ్యక్తి లాగిన్​ కావడం, సమాచారం మార్చడం జరగదని తెలిపింది.

Sushant Singh Rajput's Instgaram account memorialized
సుశాంత్​ జ్ఞాపకార్థంగా మారిన ఇన్​స్టాగ్రామ్​ ఖాతా

బాలీవుడ్​ నటుడు సుశాంత్​సింగ్ రాజ్​పుత్​ ఇన్​స్టా​ ఖాతా ఇకపై జ్ఞాపకార్థంగా ఉండనుంది. అతడి బయోలో రిమెంబర్​ను జోడించిన ఇన్​స్టాగ్రామ్ సంస్థ.. ఎప్పటికీ సుశాంత్ ఖాతా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇన్​స్టా​ నిబంధనల ప్రకారం ఈ జ్ఞాపకార్థ ఖాతాలోకి ఎవరూ లాగిన్​ కాలేరు. అతడు షేర్ చేసిన ఫొటోలు, వీడియోలతోపాటు ట్యాగ్​ చేసిన వినియోగదారులకు పోస్టులు నెటిజన్లకు కనిపిస్తాయి.

Sushant Singh Rajput's Instgaram account memorialized
సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ ఇన్​స్టాగ్రామ్​ ఖాతా

సమాచారాన్ని మార్చలేరు

అలాగే ఆ ఖాతాను జ్ఞాపకార్థంగా మార్చిన తర్వాత సుశాంత్ పోస్టులతో పాటు సమాచారంలో ఎవరూ మార్పులు చేయలేరు. ఇన్​స్టాలో ఈ నటుడు.. చివరగా జూన్​ 3న తన తల్లిని గుర్తు చేసుకుంటూ పోస్టు పెట్టాడు.

సుశాంత్ మృతిపై సాగుతున్న విచారణ

సుశాంత్​ మృతిపై ముంబయి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నటి రియా చక్రవర్తి, దర్శకుడు ముఖేష్​ ఛబ్రాతో పాటు కుటుంబ సభ్యులను, సన్నిహితుల్లో 13 మంది వాంగ్మూలాలు తీసుకున్నారు. సుశాంత్​తో యశ్​రాజ్​ ఫిల్మ్స్​ గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల వివరాలను కోరుతూ, ఆ సంస్థకు లేఖను రాశారు.

ఇదీ చూడండి... సుశాంత్ జీవితం ఆధారంగా బాలీవుడ్ సినిమా

బాలీవుడ్​ నటుడు సుశాంత్​సింగ్ రాజ్​పుత్​ ఇన్​స్టా​ ఖాతా ఇకపై జ్ఞాపకార్థంగా ఉండనుంది. అతడి బయోలో రిమెంబర్​ను జోడించిన ఇన్​స్టాగ్రామ్ సంస్థ.. ఎప్పటికీ సుశాంత్ ఖాతా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇన్​స్టా​ నిబంధనల ప్రకారం ఈ జ్ఞాపకార్థ ఖాతాలోకి ఎవరూ లాగిన్​ కాలేరు. అతడు షేర్ చేసిన ఫొటోలు, వీడియోలతోపాటు ట్యాగ్​ చేసిన వినియోగదారులకు పోస్టులు నెటిజన్లకు కనిపిస్తాయి.

Sushant Singh Rajput's Instgaram account memorialized
సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ ఇన్​స్టాగ్రామ్​ ఖాతా

సమాచారాన్ని మార్చలేరు

అలాగే ఆ ఖాతాను జ్ఞాపకార్థంగా మార్చిన తర్వాత సుశాంత్ పోస్టులతో పాటు సమాచారంలో ఎవరూ మార్పులు చేయలేరు. ఇన్​స్టాలో ఈ నటుడు.. చివరగా జూన్​ 3న తన తల్లిని గుర్తు చేసుకుంటూ పోస్టు పెట్టాడు.

సుశాంత్ మృతిపై సాగుతున్న విచారణ

సుశాంత్​ మృతిపై ముంబయి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నటి రియా చక్రవర్తి, దర్శకుడు ముఖేష్​ ఛబ్రాతో పాటు కుటుంబ సభ్యులను, సన్నిహితుల్లో 13 మంది వాంగ్మూలాలు తీసుకున్నారు. సుశాంత్​తో యశ్​రాజ్​ ఫిల్మ్స్​ గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల వివరాలను కోరుతూ, ఆ సంస్థకు లేఖను రాశారు.

ఇదీ చూడండి... సుశాంత్ జీవితం ఆధారంగా బాలీవుడ్ సినిమా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.