ETV Bharat / sitara

సుశాంత్​ కేసు: సీబీఐ దర్యాప్తును ఖండించిన మహారాష్ట్ర

author img

By

Published : Aug 4, 2020, 4:02 PM IST

Updated : Aug 4, 2020, 4:13 PM IST

సుశాంత్​ కేసులో బిహార్​ ప్రభుత్వం సీబీఐ విచారణకు సిఫార్సు చేసింది. అయితే దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ.. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించింది.

Sushant Singh Rajput case: Maha slams CBI probe recommendation
సుశాంత్​

బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ ఆత్మహత్య కేసులో ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా, బిహార్​ ప్రభుత్వం సుశాంత్​ కేసుపై సీబీఐ విచారణకు సిఫార్సు చేసినట్లు ప్రకటించింది. దీనిపై స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం.. ఇటువంటి చర్యల వల్ల రాష్ట్ర ప్రభుత్వ హక్కులకు భంగం వాటిల్లుతుందని పేర్కొంది. భాజపా రాజ్యాంగ విధ్వంసానికి పాల్పడుతోందని తెలిపింది.

కరోనాను అరికట్టడంలో బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ విఫలమయ్యారని.. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినట్లు మహారాష్ట్ర ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్​ మాలిక్ ఆరోపించారు.

"మోదీ ప్రభుత్వం భారత ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తోంది. భాజపా కూటమి కూడా ఈ విషయంలో సాయం చేయడం విచారకరం. ఇదంతా రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారు. న్యాయస్థానం మా ఆవేదనను గుర్తిస్తుందని మేము ఆశిస్తున్నాం."

-నవాబ్​ మాలిక్​, ఎన్సీపీ అధికార ప్రతినిధి

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్​ మాట్లాడుతూ.. ఈ కేసులో సీబీఐ విచారణ అవసరం లేదని.. ముంబయి పోలీసులకు దీనిని పరిష్కరించే సత్తా ఉందని ఉద్ఘాటించారు.

బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ ఆత్మహత్య కేసులో ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా, బిహార్​ ప్రభుత్వం సుశాంత్​ కేసుపై సీబీఐ విచారణకు సిఫార్సు చేసినట్లు ప్రకటించింది. దీనిపై స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం.. ఇటువంటి చర్యల వల్ల రాష్ట్ర ప్రభుత్వ హక్కులకు భంగం వాటిల్లుతుందని పేర్కొంది. భాజపా రాజ్యాంగ విధ్వంసానికి పాల్పడుతోందని తెలిపింది.

కరోనాను అరికట్టడంలో బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ విఫలమయ్యారని.. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినట్లు మహారాష్ట్ర ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్​ మాలిక్ ఆరోపించారు.

"మోదీ ప్రభుత్వం భారత ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తోంది. భాజపా కూటమి కూడా ఈ విషయంలో సాయం చేయడం విచారకరం. ఇదంతా రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారు. న్యాయస్థానం మా ఆవేదనను గుర్తిస్తుందని మేము ఆశిస్తున్నాం."

-నవాబ్​ మాలిక్​, ఎన్సీపీ అధికార ప్రతినిధి

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్​ మాట్లాడుతూ.. ఈ కేసులో సీబీఐ విచారణ అవసరం లేదని.. ముంబయి పోలీసులకు దీనిని పరిష్కరించే సత్తా ఉందని ఉద్ఘాటించారు.

Last Updated : Aug 4, 2020, 4:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.