ETV Bharat / sitara

'శ్రీకారం' ముఖ్య ఉద్దేశం అదే: శర్వానంద్​

author img

By

Published : Mar 9, 2021, 7:05 PM IST

చదువుకున్న యువత వ్యవసాయం చేస్తే ఎలాంటి మార్పులు వస్తాయో తెలియజేయడమే తన సినిమా 'శ్రీకారం' ముఖ్య ఉద్దేశమని తెలిపారు హీరో శర్వానంద్​. యువత ఈ రంగాన్ని వృత్తిగా ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ చిత్రం మార్చి 11న విడుదల కానుంది.

sreekaram
శ్రీకారం

నూతన దర్శకుడు కిశోర్ బి దర్శకత్వంలో తెరకెక్కిన 'శ్రీకారం' సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ప్రముఖ హాస్యనటుడు సప్తగిరి వ్యాఖ్యాతగా శర్వానంద్, ప్రియాంక, నరేష్, దర్శకుడు కిశోర్​ ఈ చిత్ర విశేషాలను అభిమానులతో పంచుకున్నారు.

చదువుకున్న యువత వ్యవసాయ రంగంలో అడుగుపెడితే ఎలాంటి మార్పులు వస్తాయో ఈ చిత్రంలో చూపించినట్లు తెలిపారు యువ కథానాయకుడు శర్వానంద్. రైతుల కష్టాలు, ప్రభుత్వ విధానాలు తమ సినిమాలో కనిపించవని చెప్పిన ఆయన.. ఈ చిత్రం కోసం నిజంగానే వ్యవసాయం చేసినట్లు వివరించారు. యువత వ్యవసాయ రంగాన్ని వృత్తిగా ఎంచుకోవాలని పిలుపునిచ్చారు.

నూతన దర్శకుడు కిశోర్ బి దర్శకత్వంలో తెరకెక్కిన 'శ్రీకారం' సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ప్రముఖ హాస్యనటుడు సప్తగిరి వ్యాఖ్యాతగా శర్వానంద్, ప్రియాంక, నరేష్, దర్శకుడు కిశోర్​ ఈ చిత్ర విశేషాలను అభిమానులతో పంచుకున్నారు.

చదువుకున్న యువత వ్యవసాయ రంగంలో అడుగుపెడితే ఎలాంటి మార్పులు వస్తాయో ఈ చిత్రంలో చూపించినట్లు తెలిపారు యువ కథానాయకుడు శర్వానంద్. రైతుల కష్టాలు, ప్రభుత్వ విధానాలు తమ సినిమాలో కనిపించవని చెప్పిన ఆయన.. ఈ చిత్రం కోసం నిజంగానే వ్యవసాయం చేసినట్లు వివరించారు. యువత వ్యవసాయ రంగాన్ని వృత్తిగా ఎంచుకోవాలని పిలుపునిచ్చారు.

శ్రీకారం

ఇదీ చూడండి: 'శ్రీకారం'.. గొప్ప సందేశమిచ్చే చిత్రం: చిరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.